Trends

జ‌గ‌న్ ఆ స్కూల్లోనే ప‌రీక్ష పేప‌ర్లు కొట్టేశాడు: ప‌వ‌న్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ ప‌దోత‌ర‌గతి ప‌రీక్ష‌ల‌ప్పుడు ప్ర‌శ్న ప‌త్రాల‌ను హైద‌రాబాద్‌లోని శివ‌శివానీ పాఠశాల నుంచి కొట్టేసి ప‌రీక్ష‌లు రాశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. శ‌నివారం జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడి చిన్న‌దేన‌ని అయితే.. వైసీపీ నాయ‌కులు దీనిని పెద్ద‌దిగా ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. జ‌గ‌న్ త‌న నాట‌కాలు క‌ట్టిపెట్టాల‌ని ప‌వ‌న్ సూచించారు.

జ‌గన్‌కు చిన్న గాయమైతే రాష్ట్రమంతా ఊగిపోతోంది. సగటు మనిషికి గాయమైతే మనకు బాధ లేదా? జ‌గ‌న్‌కు గాయమైతే నాకు బాధగా ఉంది. ఇది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు? నాన్న పులి కథ ఒకసారి చెబితే బాగుంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెబితే ఎవరు నమ్ముతారు? ఈ నాటకాలు ఆపండి చాలు. భరించలేకపోతున్నాం. ప్రజలు కూడా ఇలాంటి డ్రామాలను నమ్మకండి అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. తెనాలిలో నిర్వ‌హించిన వారాహి విజ‌య‌భేరి సభలో ప‌వ‌న్ ప్ర‌సంగిం చారు. అభివృద్ధి అంటే ఏంటో తాము కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రుచి చూపిస్తామ‌న్నారు.

ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఈజిప్టులో ముబార‌క్‌పై జ‌రిగిన తిరుగుబాటు, శ్రీలంక‌లో జ‌రిగిన తిరుగు బాటు వంటివి తాడేప‌ల్లిలోనూ వ‌స్తాయ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు తాడేప‌ల్లి ప్యాలెస్‌పై దండెత్తేందుకు ఎక్కువ రోజులు లేవ‌ని చెప్పారు. ఉపాధ్యాయు ల‌ను మందు కొట్ల ద‌గ్గ‌ర కాప‌లా పెట్టిన ఘ‌నుడు.. వారితో పింఛ‌న్లు పంపిణీ చేస్తే త‌ప్పా? ఎండ‌కు మ‌ల‌మ‌లా మాడిపోయేలా చేసి వృద్ధుల‌ను చంపేసి.. ఆ నెపంపై మాపై వేశార‌ని ప‌వ‌న్ నిప్పులు చెరిగారు. తెనాలిలో నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను, గుంటూరులో చంద్ర‌శేఖ‌ర్‌ను గెలిపించాల‌ని సూచించారు.

నాకు జ్ఞానం అలా వ‌చ్చింది..?

నాకు ఇంత జ్ఞానం ఎలా వ‌చ్చింద‌ని మా జ‌న‌సైనికులు అప్పుడ‌ప్పుడు ప్ర‌శ్నిస్తుంటారు. చిన్న‌ప్పుడు నాకు ఓ వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన మిత్రుడు ఉండేవాడు. వాడు నాకు పుస్త‌కాలు కొనిచ్చాడు. వాటిని చ‌దివి నా జ్ఞానాన్ని పెంచుకున్నా. అందుకే నాకు వైశ్య సామాజిక వ‌ర్గం ప‌ట్ల అభిమానం. వారిస‌మ‌స్య‌లు కూడా కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌రిష్క‌రిస్తాం అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

This post was last modified on April 15, 2024 8:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

1 hour ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

4 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

4 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

5 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

6 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

6 hours ago