ది ఫ్యామిలీ స్టార్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే విజయ్ దేవరకొండ చేయబోయే తర్వాతి సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొనేవి. కానీ జరిగింది వేరు. మార్నింగ్ షోకు వచ్చిన టాక్ కంటే దారుణంగా ఫెయిల్ కావడం టీమ్ జీర్ణించుకోలేకపోతోంది. రౌడీ హీరో నెక్స్ట్ ప్రాజెక్టు దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ప్యాన్ ఇండియా మూవీ. స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ బాగానే చేశారు. టైం ఎక్కువ దొరకడంతో మేజిక్ అనే చిన్న చిత్రాన్ని కొత్తవాళ్ళతో గౌతమ్ పూర్తి చేశాడు. రెండూ సితార బ్యానర్ లోనే రూపొందాయి. ఇంకేం విడి 12కి రూట్ క్లియరని అనుకోవడానికి లేదు.
డియర్ కామ్రేడ్ నుంచి ది ఫ్యామిలీ స్టార్ దాకా విజయ్ దేవరకొండ మార్కెట్ లో తగ్గుదల కనిపిస్తోంది. ఓటిటిలు కూడా ముందులాగా గుడ్డిగా రేట్లు ఆఫర్లు చేయడం లేదు. దీంతో నిర్మాతలు ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదనే భరోసా కలిగించుకోలేకపోతున్నారు. ఈ కారణంగా బడ్జెట్ లను రివైజ్ చేయాల్సి వస్తోంది. మొన్నటిదాకా పీ నట్స్ తీసుకున్నా, ఇకపై ఎక్కువ డిమాండ్ చేస్తాననే రీతిలో ఇంటర్వ్యూలలో మాట్లాడిన విజయ్ దేవరకొండ ఇప్పుడు దాన్ని మార్చుకోక తప్పదు. ఎంత అడిగినా ఇచ్చే పరిస్థితి లేదిప్పుడు. లాభాల్లో వాటా లేదంటే ఏరియా హక్కులు తీసుకోవడం లాంటి ఆప్షన్లు రావొచ్చు.
హీరోయిన్ ఎంపిక కూడా ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ లో చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపించింది కానిప ప్రేమలు మమిత బైజుని కూడా ట్రై చేస్తున్నారట. ఎవరిని ఫైనల్ చేస్తారో ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. స్పై తరహా బ్యాక్ డ్రాప్ లో గౌతమ్ తిన్ననూరి చాలా సీరియస్ డ్రామాని ప్రెజెంట్ చేయబోతున్నాడు. వంద కోట్లకు పైగా బడ్జెట్ కావొచ్చని నిర్మాత నాగవంశీ గుంటూరు కారం టైంలో అన్నారు కానీ అదే మాటకు కట్టుబడి ఉంటారో లేదో చూడాలి. ఎప్పుడు ప్రారంభమైనా విడి 12 రిలీజ్ మాత్రం 2025 వేసవిలో ఉంటుందని సమాచారం.
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…