ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. ఇది పాత విషయమే. ఎందుకంటే బుధవారమే దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ప్రపంచంలో టాప్ 10 మంది అత్యంత సంపన్నుల్లో ముకేశ్ అంబానీ తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే.. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. ముకేశ్ అంబానీ గొప్పతనం.. ఆయన సాధించిన ఘనతల్ని చూస్తే.. వావ్ అనకుండా ఉండలేం. ఒక భారతీయుడిగా ముకేశ్ అంబానీ సాధించిన విజయాలకు అచ్చెరువు చెందకుండా ఉండలేం.
ప్రపంచ సంపన్నుల టాప్ 10 జాబితాలో నిలిచిన అంబానీ సాధించిన మరో ఘనత.. ఆసియా మొత్తంలో ఆయన ఒక్కరు మాత్రమే అత్యంత సంపన్నులు. మరెవరూ టాప్ 10 జాబితాలో లేరు. అంబానీ ఆస్తి 11,600 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో దగ్గర దగ్గర రూ.9.63 లక్షల కోట్లు. వరల్డ్ టాప్ 10లో ఏకైక ఆసియా సంపన్నుడు.. 10,000కోట్ల డాలర్లకు పైగా సంపద కలిగిన అతి కొద్ది మందిలో (ప్రపంచంలో పద్నాలుగు మందే ఉన్నారు) ఆసియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆయన ఒక్కడే.
భారతీయుడిగా ఆయన తిరుగులేని అధిక్యతను ప్రదర్శించటం ఒక ఎత్తు అయితే.. ఆయన ఆసియా ఖండంలోనే మరెవరికి సాధ్యం కాని స్థాయికి చేరుకోవటం మాత్రం మామూలు విషయం కాదని చెప్పాలి. గత ఏడాది తెర మీదకు వచ్చిన హిండెన్ బర్గ్ రిపోర్టుకు ముందు అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ అత్యంత సంపన్నుడిగా తెర మీదకు రావటం తెలిసిందే. అయితే.. హిండెన్ బర్గ్ రిపోర్టు తర్వాత సమీకరణాలు మారిపోవటం తెలిసిందే. తాజాగాఆయన ఆస్తిని 8,400 కోట్ల డాలర్లుగా లెక్కించారు. హెండెన్ బర్గ్ పంచాయితీ తర్వాత ఏడాది కాలంలో ఆయన ఆస్తి 3,680 కోట్ల డాలర్లు పెరిగినట్లుగా చెబుతున్నారు.
ఫోర్భ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొత్తం 200 మంది భారతీయులకు స్థానం దక్కింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే గత ఏడాది ఈ జాబితాలో 169 మంది భారతీయులకు చోటు దక్కితే.. ఈసారి గణనీయంగా పెరిగింది. భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద రూ.79.18 లక్షల కోట్లు కావటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే 41 శాతం అధికం కావటం విశేషం. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడు నిఖిల్ కామత్. అతడి వయసు కేవలం 37 ఏళ్లు మాత్రమే. ఆన్ లైన్ బ్రోకింగ్ సేవల సంస్థ జీరోథా వ్యవస్థాపకులైన నితిన్.. నిఖిల్ కామత్ ఇద్దరూ సోదరుడు. వీరిలో నిఖిల్ చిన్నోడు. ఈ ఏడాది వీరు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
This post was last modified on April 6, 2024 11:04 am
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోటి వెంట కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జపం వినిపించింది.…
రేపు సాయంత్రం కల్కి 2898 ఏడి ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. సుమారు…
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తదితరులు అరెస్టయ్యారు.…
ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి వరస సూపర్ హిట్ల తర్వాత వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో…
ఏపీ అధికార పార్టీ వైసీపీలో మాటలే కాదు.. ఆశలు కూడా కోటలు దాటుతున్నాయి. ఈ నెల 13న జరిగిన పోలింగ్లో…