ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య చేసింది. విడాకుల కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న వేళ స్పందించిన ధర్మాసనం కీలక వ్యాఖ్య చేసింది. పదే పదే పుట్టింటికి వెళ్లటం కూడా భర్తను మానసికంగా హింసించటమేనని స్పష్టం చేసింది. భర్త పొరపాటు ఏమీ లేనప్పటికీ భార్య మాటిమాటికి పుట్టింటికి వెళ్లటాన్ని తప్పు పట్టింది.
భార్యభర్తల మధ్య పరస్పర ప్రేమ.. విశ్వాసం.. ఆరాధన భావన ఉంటే వైవాహిక బంధం అన్యోన్యతలతో వికసిస్తుందన్న న్యాయమూర్తి.. పుట్టింటికి భార్య పదే పదే వెళ్లటాన్ని తప్పు పట్టారు. ఒక విడాకుల కేసులో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం ఒక విడాకుల కేసును విచారించింది.
తమ పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితంలో కనీసం తన భార్య తనను విడిచి పెట్టి ఏడుసార్లు పుట్టింటికి వెళ్లిపోయిందని.. అలా వెళ్లిన ప్రతిసారీ పది నెలల పాటు పుట్టింట్లోనే ఉండిపోయిందని సదరు భర్త పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భార్య నుంచి తనకు విడాకులు కావాలని భర్త కోరారు. అయితే.. ఈ కేసు తొలుత ఫ్యామిలీ కోర్టు ముందుకు వెళ్లగా.. భర్త కోరినట్లుగా విడాకులు మంజూరు చేయటానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు విచారించిన ధర్మాసనం.. సంయమనం కోల్పోయిన దంతుల మధ్య దూరం పెరుగుతూపోతే.. వారు ఎప్పటికి కలవలేనంతగా పరిస్థితి మారుతుందని చెప్పారు. భార్య హింస.. క్రూరత్వం కారణంగా విడివిడిగా ఉంటున్నదంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ధర్మాసనం విడాకుల్ని మంజూరు చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ తీర్పు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on April 6, 2024 10:13 am
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…