ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య చేసింది. విడాకుల కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న వేళ స్పందించిన ధర్మాసనం కీలక వ్యాఖ్య చేసింది. పదే పదే పుట్టింటికి వెళ్లటం కూడా భర్తను మానసికంగా హింసించటమేనని స్పష్టం చేసింది. భర్త పొరపాటు ఏమీ లేనప్పటికీ భార్య మాటిమాటికి పుట్టింటికి వెళ్లటాన్ని తప్పు పట్టింది.
భార్యభర్తల మధ్య పరస్పర ప్రేమ.. విశ్వాసం.. ఆరాధన భావన ఉంటే వైవాహిక బంధం అన్యోన్యతలతో వికసిస్తుందన్న న్యాయమూర్తి.. పుట్టింటికి భార్య పదే పదే వెళ్లటాన్ని తప్పు పట్టారు. ఒక విడాకుల కేసులో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం ఒక విడాకుల కేసును విచారించింది.
తమ పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితంలో కనీసం తన భార్య తనను విడిచి పెట్టి ఏడుసార్లు పుట్టింటికి వెళ్లిపోయిందని.. అలా వెళ్లిన ప్రతిసారీ పది నెలల పాటు పుట్టింట్లోనే ఉండిపోయిందని సదరు భర్త పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భార్య నుంచి తనకు విడాకులు కావాలని భర్త కోరారు. అయితే.. ఈ కేసు తొలుత ఫ్యామిలీ కోర్టు ముందుకు వెళ్లగా.. భర్త కోరినట్లుగా విడాకులు మంజూరు చేయటానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు విచారించిన ధర్మాసనం.. సంయమనం కోల్పోయిన దంతుల మధ్య దూరం పెరుగుతూపోతే.. వారు ఎప్పటికి కలవలేనంతగా పరిస్థితి మారుతుందని చెప్పారు. భార్య హింస.. క్రూరత్వం కారణంగా విడివిడిగా ఉంటున్నదంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ధర్మాసనం విడాకుల్ని మంజూరు చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ తీర్పు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on April 6, 2024 10:13 am
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…