తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఎస్బీ పరిశ్రమలో మేనేజింగ్ డైరెక్టర్ రవి మంటల్లో కాలిపోయారు. ఆయనతోపాటు మరో ఆరుగురు కూడా మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయినట్టు అధికారులు తెలిపారు. మరో 10 మంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు పక్కనున్న మరో పరిశ్రమకు వ్యాపించాయి. చుట్టుపక్కల వారిని యుద్ధ ప్రాతిపదికన అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది కార్మికులు, ఉద్యోగులు కంపెనీ లోపల ఉన్నట్లు సమాచారం. 4 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి భయానక వాతావరణం ఏర్పడింది.
అయితే.. రియాక్టర్ వంటి భారీ పేలుడు వస్తువులను నిర్వహించడంలో పరిశ్రమ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే వాదన వినిపిస్తోంది. సరైన సమయంలో రియాక్టర్లను నిర్వహించడం లేదని.. సాధారణంగానే వాటిని నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో రియాక్టర్ వంటి భారీ పేలుడు గుణం ఉన్న వాటి విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు.. నీటి సదుపాయాన్ని పెంచుకోవాల్సి ఉందని.. కానీ,ఈ రెండు విషయాల్లోనూ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…