హీరోయిన్ల కెరీర్లు ఉన్నట్లుండి ఊపందుకుంటాయి. అలాగే ఉన్నట్లుండి డౌన్ అయిపోతాయి. ఒకసారి డౌన్ అయ్యాక మళ్లీ పుంజుకోవడం అంత తేలిక కాదు. కొన్నేళ్ల పాటు వైభవం చూసిన హీరోయిన్లు ఉన్నట్లుండి కనుమరుగైపోతుంటారు.
ఒక ఐదారేళ్ల పాటు టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ హోదాను అనుభవించిన పూజా హెగ్డేకు ఉన్నట్లుండి కాలం కలిసి రాలేదు. వరుసగా ఫ్లాపులు ఎదురయ్యాయి. దీంతో చేతిలో ఉన్న మంచి అవకాశాలు చేజారాయి. కొత్త అవకాశాలు ఆగిపోయాయి. కొన్ని నెలలుగా టాలీవుడ్లో పూజా పేరే వినిపించడం లేదు. ఇక మళ్లీ తెలుగులో పూజా ఓ పెద్ద సినిమాలో నటించడం అంటే కష్టమే అని భావిస్తున్న సమయంలో ఓ క్రేజీ ప్రాజెక్టులో ఆమె భాగం అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
తెలుగులో పూజా కెరీర్ మలుపు తిరిగింది అల్లు అర్జున్ మూవీ దువ్వాడ జగన్నాథంతో. మళ్లీ బన్నీ మూవీతోనే ఆమె మరో బ్రేక్ అందుకోనుందని అంటున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ ఓ సినిమా చేయబోతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ బేనర్ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుందట. ఈ చిత్రంలో పూజానే హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది. కెరీర్లో ఈ దశలో పూజాకు ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో అవకాశం రావడం అంటే ఆశ్చర్యమే. సన్ పిక్చర్స్లో ఆల్రెడీ పూజా బీస్ట్ మూవీ చేసింది. కానీ అది డిజాస్టర్ కావడంతో తమిళంలో ఆమె కెరీర్ ముందుకు సాగలేదు. ఇటు తెలుగులో కూడా ఆమె డౌన్ అయింది. మరి నిజంగా పూజా.. అట్లీ-బన్నీ మూవీ నటించబోతోందంటే.. ఆమె కెరీర్కు మళ్లీ ఓ లైఫ్ లైన్ దొరికినట్లే.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…