ఏపీ అధికార పార్టీ వైసీపీలో చేరిక విషయంపై కాపు ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా మరో లేఖ సంధించారు. ఆయన తాజాగా రాసిన లేఖ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నేను రమ్మన్నానని.. చాలా మంది వచ్చేందుకు రెడీ అయిపోయారు. అయితే, ఇంత మంది వస్తే.. అక్కడ(తాడేపల్లి) ఏర్పాట్లు చేసేందుకు ఇబ్బంది అవుతుందంట. అందుకే మీరెవరూ రావొద్దు.. నేనే వెళ్లి జాయిన్ అయిపోతాను. అని తాజాగా ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
ఏం జరిగింది?
ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 14న ఆయన మూహూర్తం పెట్టుకుని.. తన అభిమానులు, అనుచరులు కూడా తన వెంట వచ్చేవారు రావాలని పిలుపునిచ్చారు. అయితే.. ఎవరి భోజనాలు, ఖర్చులు వారే పెట్టుకోవాలని మంచినీళ్లు కూడా వెంట తెచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై నెటిజన్ల నుంచి సటైర్లు కూడా పేలాయి. ఇదిలావుంటే.. తాజాగా రాసిన లేఖలో ఆయన చిత్రమైన వ్యాఖ్యలు చేశారు.
ముద్రగడ తాజా లేఖ ఇదీ..
“గౌరవ ప్రజలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములతో క్షమించమని కోరుకుంటున్నాను. 14.03.2024 తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి మీ అందరి ఆశీస్సులతో వెళ్లాలని నిర్ణయం తీసుకుని మీకు లేఖ ద్వారా తెలియపర్చి ఉన్నానండి. ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదని మరియు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బందని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి. మిమ్మల్ని నిరుత్సాహపర్చినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటున్నానండి. ఈ నెల 15 లేక 16వ తేదీలలో నేను ఒక్కడినే తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలోకి చేరతానండి. మీ అందరి ఆశీస్సులు వారికి, నాకు తప్పకుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి”
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…