భారతీయులే కాక ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూసే టోర్నీ.. ఇండియన్ ప్రిమియర్ లీగ్. అంతర్జాతీయ టోర్నీలు, సిరీస్లను మించి ఈ వార్షిక లీగ్కు ఆదరణ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ఆదరణ ఉన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ 17వ సీజన్తో ప్రేక్షకులను పలకరించబోతోంది.
ఏటా ఏప్రిల్ మొదటి వారంలో మొదలయ్యే టోర్నీ.. ఈసారి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్చి 22నే ఆరంభం కాబోతోంది. టోర్నీకి ఇంకో పది రోజులే సమయం ఉండగా.. తెలుగు క్రికెట్ ప్రేమికులకు ఒక శుభవార్త అందుతోంది. లీగ్లో అత్యంత ఆకర్షణీయ జట్టు, విరాట్ కోహ్లి ప్రాతినిధ్యం వహించే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు.. ఈసారి తన స్థానిక మ్యాచ్లను బెంగళూరులో కాకుండా వైజాగ్లో ఆడబోతోందట. ఈ రోజుకు ఇదే హాట్ న్యూస్.
గత ఏడాది దేశవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. కర్ణాటకలో వర్షపాతం మరీ తక్కువ నమోదైంది. ఇంకా వేసవి ఆరంభం కాకముందే అక్కడ నీటి కటకటతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరులో నీటికి తీవ్ర ఇబ్బందులు తప్పట్లేదు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో సజావుగా నిర్వహించే పరిస్థితి లేదట. ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే స్టేడియానికి సరిపడా నీళ్లు అందించడం కష్టమేనట.
ఈ పరిణామం ఐపీఎల్ మ్యాచ్లను బెంగళూరు నుంచి పూర్తిగా తరలించాల్సిన పరిస్థితి కల్పించింది. దీంతో ప్రత్యామ్నాయ వేదికలుగా విశాఖపట్నం, పుణెలను పరిశీలిస్తున్నారు. వైజాగ్యే అనువైన ప్రాంతం అని.. అక్కడే ఆర్సీబీ తన హోం మ్యాచ్లు అన్నీ ఆడుతుందని అంటున్నారు. ఇదే నిజమైతే వైజాగ్ వాసులకు పండగన్నట్లే.
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…