Trends

భలే ట్విస్ట్.. ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్‌లు విశాఖలో

భారతీయులే కాక ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూసే టోర్నీ.. ఇండియన్ ప్రిమియర్ లీగ్. అంతర్జాతీయ టోర్నీలు, సిరీస్‌లను మించి ఈ వార్షిక లీగ్‌కు ఆదరణ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ఆదరణ ఉన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ 17వ సీజన్‌తో ప్రేక్షకులను పలకరించబోతోంది.

ఏటా ఏప్రిల్ మొదటి వారంలో మొదలయ్యే టోర్నీ.. ఈసారి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్చి 22నే ఆరంభం కాబోతోంది. టోర్నీకి ఇంకో పది రోజులే సమయం ఉండగా.. తెలుగు క్రికెట్ ప్రేమికులకు ఒక శుభవార్త అందుతోంది. లీగ్‌లో అత్యంత ఆకర్షణీయ జట్టు, విరాట్ కోహ్లి ప్రాతినిధ్యం వహించే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు.. ఈసారి తన స్థానిక మ్యాచ్‌లను బెంగళూరులో కాకుండా వైజాగ్‌లో ఆడబోతోందట. ఈ రోజుకు ఇదే హాట్ న్యూస్.

గత ఏడాది దేశవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. కర్ణాటకలో వర్షపాతం మరీ తక్కువ నమోదైంది. ఇంకా వేసవి ఆరంభం కాకముందే అక్కడ నీటి కటకటతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరులో నీటికి తీవ్ర ఇబ్బందులు తప్పట్లేదు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో సజావుగా నిర్వహించే పరిస్థితి లేదట. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగితే స్టేడియానికి సరిపడా నీళ్లు అందించడం కష్టమేనట.

ఈ పరిణామం ఐపీఎల్ మ్యాచ్‌లను బెంగళూరు నుంచి పూర్తిగా తరలించాల్సిన పరిస్థితి కల్పించింది. దీంతో ప్రత్యామ్నాయ వేదికలుగా విశాఖపట్నం, పుణెలను పరిశీలిస్తున్నారు. వైజాగ్‌యే అనువైన ప్రాంతం అని.. అక్కడే ఆర్సీబీ తన హోం మ్యాచ్‌లు అన్నీ ఆడుతుందని అంటున్నారు. ఇదే నిజమైతే వైజాగ్ వాసులకు పండగన్నట్లే.

This post was last modified on March 12, 2024 6:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago