డార్లింగ్…..సాధారణంగా చాలామంది తమ స్నేహితులను, సన్నిహితులు, ప్రేమించేవారిని పిలిచే పిలుపు. ఇక, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ అని పేరుంది. ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ ని, కొంతమంది కో స్టార్స్ ని ప్రేమగా, అభిమానంగా డార్లింగ్, డార్లింగ్స్ అని సంబోధిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తో పాటు డార్లింగ్ అని పిలిచే చాలామందికి కోర్టు షాకిచ్చింది. అపరిచితులను డార్లింగ్ అని పిలవకూడదంటూ కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
‘డార్లింగ్’ అనే పదానికి లైంగిక అర్థం ఉందని, సెక్షన్ 354ఏ(1) (4) కింద అది అభ్యంతరకరమైన వ్యాఖ్య కిందకు వస్తుందని జస్టిస్ జే సేన్ గుప్తా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పరిచయం లేని అమ్మాయిలను ‘డార్లింగ్’ అని పిలవడం లైంగిక వేధింపు కిందకు వస్తుందని స్పష్టం చేసింది. అపరిచితులను డార్లింగ్.. అని పిలిచిన వారిని సెక్షన్ 354ఏ, 509 కింద నిందుతులుగా భావించ వచ్చు అని పేర్కొంది.
గతంలో ఓ మహిళా కానిస్టేబుల్ ను మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ‘డార్లింగ్’ అని పిలిచాడు. చలానా రాయడానికి వస్తున్నావా డార్లింగ్ అంటూ డ్యూటీలో ఉన్న ఆ లేడీ కానిస్టేబుల్ పై అతడు చేసిన వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు పెట్టారు. ఈ ప్రకారం ఆ కేసుపై విచారణ జరిపిన కోర్టు…ఈ మేరకు వ్యాఖ్యానించింది. పరాయి స్త్రీలను ఇష్టం వచ్చినట్లు పిలిచే స్థాయికి భారత్ దిగజారలేదని పేర్కొంది.
అయితే, కోర్టు తీర్పుతో ప్రభాస్ పై మీమ్స్ వస్తున్నాయి. అభిమానులతో మాట్లాడేటపుడు, సక్సెస్ మీట్లలో, ఇంటర్వ్యూలలో అభిమానులను డార్లింగ్ అని సంబోధించే ప్రభాస్….ఇకపై అలా పిలవాలంటే ఆలోచించుకోవాలేమో అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. డార్లింగ్ పరిస్థితి ఇది అంటూ…ఫన్నీ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. తాను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తున్నానో తనకూ తెలీదని ప్రభాస్ చెబుతూ…పలు మార్లు డార్లింగ్ అని పిలిచిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇకపై ప్రభాస్ డార్లింగ్ అని పిలవడేమో అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on March 4, 2024 5:39 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…