చికెన్ ధర కొండకెక్కింది. చూస్తుండగానే కేజీ చికెన్ ధర రూ.300 దాటేసింది. ఎందుకిలా? అంటే.. ఒక్కసారిగా విరుచుకుపడిన అనేక సమస్యలు దీనికి కారణంగా చెప్పాలి. చికెన్ ప్రియులకు షాకిచ్చేలా మారిన ఈ ధరల దెబ్బకు జేబులు చిల్లులు పడుతున్నాయి. ఏపీలో పెరిగిన చికెన్ ధరల కారణంగా తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఇటీవల కాలంలో ఏపీలో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. దీనికి తోడు వేసవి కాలం కావటంతో ఉత్పత్తి తగ్గింది. దీనికి తోడు కార్తీక మాసంలో కోడి మాంసానికి డిమాండ్ విపరీతంగా పడిపోయింది. అప్పట్లో కేజీ రూ.130 – 140 మధ్యనే అమ్మాల్సి వచ్చింది. దీంతో కోళ్ల ఫారాల యజమానులకు భారీగా నష్టాలు చూశారు.
దీంతో.. కోళ్ల ఉత్పత్తిని భారీగా తగ్గించారు. తల్లికోళ్లను గిట్టుబాటు కాక అమ్మేశారు. దీంతో.. ఉత్పత్తి తగ్గింది. కోళ్ల కొరత ఏర్పడటంతో ధరలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఏపీలో పెద్ద ఎత్తున కోళ్లకు ఆరోగ్య సమస్యలు ఎదురుకావటం.. వేలాదిగా చనిపోయిన పరిస్థితి.
దీని ప్రభావం తెలంగాణ మీదా పడింది. మొత్తంగా పెరిగిన చికెన్ ధరలతో చికెన్ ప్రియులు మాత్రం ఠారెత్తిపోతున్నారు. వేసవిలో చికెన్ ధరలకు రెక్కలు రావటం మామూలే. అయితే.. వేసవి కాలం అధికారికంగా మొదలు కానప్పటికీ ధరలు ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో రికార్డు స్థాయికి చేరుకుంటాయన్న అంచనా వ్యక్తమవుతోంది.
This post was last modified on February 28, 2024 11:10 am
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…