చికెన్ ధర కొండకెక్కింది. చూస్తుండగానే కేజీ చికెన్ ధర రూ.300 దాటేసింది. ఎందుకిలా? అంటే.. ఒక్కసారిగా విరుచుకుపడిన అనేక సమస్యలు దీనికి కారణంగా చెప్పాలి. చికెన్ ప్రియులకు షాకిచ్చేలా మారిన ఈ ధరల దెబ్బకు జేబులు చిల్లులు పడుతున్నాయి. ఏపీలో పెరిగిన చికెన్ ధరల కారణంగా తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఇటీవల కాలంలో ఏపీలో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. దీనికి తోడు వేసవి కాలం కావటంతో ఉత్పత్తి తగ్గింది. దీనికి తోడు కార్తీక మాసంలో కోడి మాంసానికి డిమాండ్ విపరీతంగా పడిపోయింది. అప్పట్లో కేజీ రూ.130 – 140 మధ్యనే అమ్మాల్సి వచ్చింది. దీంతో కోళ్ల ఫారాల యజమానులకు భారీగా నష్టాలు చూశారు.
దీంతో.. కోళ్ల ఉత్పత్తిని భారీగా తగ్గించారు. తల్లికోళ్లను గిట్టుబాటు కాక అమ్మేశారు. దీంతో.. ఉత్పత్తి తగ్గింది. కోళ్ల కొరత ఏర్పడటంతో ధరలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఏపీలో పెద్ద ఎత్తున కోళ్లకు ఆరోగ్య సమస్యలు ఎదురుకావటం.. వేలాదిగా చనిపోయిన పరిస్థితి.
దీని ప్రభావం తెలంగాణ మీదా పడింది. మొత్తంగా పెరిగిన చికెన్ ధరలతో చికెన్ ప్రియులు మాత్రం ఠారెత్తిపోతున్నారు. వేసవిలో చికెన్ ధరలకు రెక్కలు రావటం మామూలే. అయితే.. వేసవి కాలం అధికారికంగా మొదలు కానప్పటికీ ధరలు ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో రికార్డు స్థాయికి చేరుకుంటాయన్న అంచనా వ్యక్తమవుతోంది.
This post was last modified on February 28, 2024 11:10 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…