పంజాబ్లో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవరు లేని ఒక గూడ్స్ రైలు వంద కిలోమీటర్ల వేగాన్నందుకుని పట్టాల మీద దూసుకెళ్లగా అదృష్టవశాత్తూ ఆ మార్గంలో ప్రయాణికులున్న ఏ రైలూ రాకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అతి కష్టం మీద ఆ రైలుకు అడ్డుకట్ట వేసిన రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సంచలనం రేపిన ఈ ఉదంతం గురించి తెలుసుకుందాం పదండి.
జమ్ము కశ్మీర్లోని కథువా రైల్వే స్టేషన్లలో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడ్తో ఓ గూడ్స్ రైలు పంజాబ్కు బయల్దేరాల్సి ఉంది. ఐతే కథువా రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలును ఆపిన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్.. హ్యాండ్ బ్రేక్ వేయకుండా బయటికి వెళ్లారు. మామూలుగా అయితే రైలు దానికదే ముందుకు కదలదు. కానీ పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ ఏటవాలుగా ఉండడంతో రైలు ముందుకు కదిలింది. ముందుకు సాగేకొద్దీ వేగం పెరిగిపోయింది. ఏకంగా 100 కిలోమీటర్ల వేగాన్నందుకుని రైలు ముందుకు దూసుకెళ్లింది. మధ్య మధ్యలో స్టేషన్ల వద్ద రైలు శరవేగంగా దూసుకెళ్తున్న వీడియోలు బయటికి వచ్చాయి.
ఐతే కథువా నుంచి రైలు ముందుకు వెళ్లిపోయిన విషయాన్ని కొంచెం ఆలస్యంగా గుర్తించిన లోకో పైలట్ తర్వాతి స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఆ మార్గంలో అదృష్టం కొద్దీ ఏ రైలు ప్రయాణించడం లేదు. రైలు 100 కిలోమీటర్ల వేగంతో 84 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషణ్ వద్ద చెక్కదిమ్మెలు అడ్డుపెట్టి రైలును ఆపాల్సి వచ్చింది. ఆఖరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రైలు ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైలు ప్రమాదాలు చాలా వరకు ఇలాంటి మానవ తప్పిదాలతోనే జరుగుతుంటాయి. ఆ రైలు మార్గంలో ఏదైనా ప్రయాణికుల రైలు ప్రయాణించి ఉంటే జరిగే నష్టం గురించి ఊహించుకోవడం కూడా కష్టమే.
This post was last modified on February 26, 2024 8:07 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…