Trends

డ్రైవర్లు దిగారు.. రైలు వెళ్లిపోయింది

పంజాబ్‌లో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవరు లేని ఒక గూడ్స్ రైలు వంద కిలోమీటర్ల వేగాన్నందుకుని పట్టాల మీద దూసుకెళ్లగా అదృష్టవశాత్తూ ఆ మార్గంలో ప్రయాణికులున్న ఏ రైలూ రాకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అతి కష్టం మీద ఆ రైలుకు అడ్డుకట్ట వేసిన రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సంచలనం రేపిన ఈ ఉదంతం గురించి తెలుసుకుందాం పదండి.

జమ్ము కశ్మీర్‌లోని కథువా రైల్వే స్టేషన్లలో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడ్‌తో ఓ గూడ్స్ రైలు పంజాబ్‌కు బయల్దేరాల్సి ఉంది. ఐతే కథువా రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలును ఆపిన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్.. హ్యాండ్ బ్రేక్ వేయకుండా బయటికి వెళ్లారు. మామూలుగా అయితే రైలు దానికదే ముందుకు కదలదు. కానీ పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ ఏటవాలుగా ఉండడంతో రైలు ముందుకు కదిలింది. ముందుకు సాగేకొద్దీ వేగం పెరిగిపోయింది. ఏకంగా 100 కిలోమీటర్ల వేగాన్నందుకుని రైలు ముందుకు దూసుకెళ్లింది. మధ్య మధ్యలో స్టేషన్ల వద్ద రైలు శరవేగంగా దూసుకెళ్తున్న వీడియోలు బయటికి వచ్చాయి. 

ఐతే కథువా నుంచి రైలు ముందుకు వెళ్లిపోయిన విషయాన్ని కొంచెం ఆలస్యంగా గుర్తించిన లోకో పైలట్ తర్వాతి స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఆ మార్గంలో అదృష్టం కొద్దీ ఏ రైలు ప్రయాణించడం లేదు. రైలు 100 కిలోమీటర్ల వేగంతో 84 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషణ్ వద్ద చెక్కదిమ్మెలు అడ్డుపెట్టి రైలును ఆపాల్సి వచ్చింది. ఆఖరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రైలు ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైలు ప్రమాదాలు చాలా వరకు ఇలాంటి మానవ తప్పిదాలతోనే జరుగుతుంటాయి. ఆ రైలు మార్గంలో ఏదైనా ప్రయాణికుల రైలు ప్రయాణించి ఉంటే జరిగే నష్టం గురించి ఊహించుకోవడం కూడా కష్టమే.

This post was last modified on February 26, 2024 8:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

1 hour ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

3 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

4 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

5 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

6 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

6 hours ago