పంజాబ్లో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవరు లేని ఒక గూడ్స్ రైలు వంద కిలోమీటర్ల వేగాన్నందుకుని పట్టాల మీద దూసుకెళ్లగా అదృష్టవశాత్తూ ఆ మార్గంలో ప్రయాణికులున్న ఏ రైలూ రాకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అతి కష్టం మీద ఆ రైలుకు అడ్డుకట్ట వేసిన రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సంచలనం రేపిన ఈ ఉదంతం గురించి తెలుసుకుందాం పదండి.
జమ్ము కశ్మీర్లోని కథువా రైల్వే స్టేషన్లలో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడ్తో ఓ గూడ్స్ రైలు పంజాబ్కు బయల్దేరాల్సి ఉంది. ఐతే కథువా రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలును ఆపిన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్.. హ్యాండ్ బ్రేక్ వేయకుండా బయటికి వెళ్లారు. మామూలుగా అయితే రైలు దానికదే ముందుకు కదలదు. కానీ పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ ఏటవాలుగా ఉండడంతో రైలు ముందుకు కదిలింది. ముందుకు సాగేకొద్దీ వేగం పెరిగిపోయింది. ఏకంగా 100 కిలోమీటర్ల వేగాన్నందుకుని రైలు ముందుకు దూసుకెళ్లింది. మధ్య మధ్యలో స్టేషన్ల వద్ద రైలు శరవేగంగా దూసుకెళ్తున్న వీడియోలు బయటికి వచ్చాయి.
ఐతే కథువా నుంచి రైలు ముందుకు వెళ్లిపోయిన విషయాన్ని కొంచెం ఆలస్యంగా గుర్తించిన లోకో పైలట్ తర్వాతి స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఆ మార్గంలో అదృష్టం కొద్దీ ఏ రైలు ప్రయాణించడం లేదు. రైలు 100 కిలోమీటర్ల వేగంతో 84 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషణ్ వద్ద చెక్కదిమ్మెలు అడ్డుపెట్టి రైలును ఆపాల్సి వచ్చింది. ఆఖరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రైలు ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైలు ప్రమాదాలు చాలా వరకు ఇలాంటి మానవ తప్పిదాలతోనే జరుగుతుంటాయి. ఆ రైలు మార్గంలో ఏదైనా ప్రయాణికుల రైలు ప్రయాణించి ఉంటే జరిగే నష్టం గురించి ఊహించుకోవడం కూడా కష్టమే.
This post was last modified on February 26, 2024 8:07 pm
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…