“మీ ఆయనపై మీరు చేసిన ఆరోపణలు.. నిజం కాదని తేలిపోయింది. ఆయన మిమ్మల్ని హింసించడం కాదు.. మీరే ఆయనను మానసికంగా హింసించారు. దీనికి పరిహారంగా.. ఆయన కు నెలనెలా 5 వేల చొప్పున భరణం చెల్లించండి. ఇదే ఫైనల్“- అని ఓ భార్యకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో సదరు భార్య బిక్క మొహం వేసుకుని కోర్టునుంచి బయటకు వెళ్లిపోయింది.
ఏం జరిగింది?
వివాహితుల రక్షణ కోసం.. 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం గృహ హింస(డొమెస్టిక్ వయలెన్స్) చట్టం తీసుకువచ్చింది. భర్తలు.. భార్యలపై దాడులు చేసినా.. అదనపు కట్నం కోసం వేధించినా.. తిండి పెట్టకుండా.. పోషణ చూడకుండా మలమలా మాడ్చిన సందర్భాల్లో ఈ చట్టం వారికి భద్రత కల్పిస్తుంది. అంతేకాదు.. ఆడపడుచులు, అత్తమామల వేధింపుల నుంచి కూడా ఈ చట్టం రక్షణ కవచంగా మారింది. ఇక, భర్త వేరేవారితో సంబంధాలు పెట్టుకుని.. తనను చూడకుండా పోయినా.. సదరు భార్య కోర్టును ఆశ్రయించి.. రక్షణ పొందే అధికారం దక్కుతుంది.
వివాదాలు..
అయితే.. గృహ హింస చట్టం కింద.. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అనేకం.. ఉద్దేశ పూర్వకంగా భర్తలను వేధించేందుకే కేసులు పెడుతున్నారంటూ.. కొన్నాళ్లుగా వివాదాలు తెరమీదికి వస్తున్నాయి. ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు కూడా దీనిని తప్పుబట్టింది. మహిళలకు వరంగా ఉన్న ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసేవారికి కఠిన శిక్షలు ఉండేలా మార్పులు చేస్తే మంచిదేమో నని వ్యాఖ్యానించింది. అయితే.. ఇది అక్కడితో ఆగిపోయింది.
తాజా కేసులో..
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన ఆమన్ 2021లో ఓ యువతిని వివాహం చేసుకున్నారు. ఆమె ఉద్యోగి. అయితే.. ఆమె అంతకు ముందే ఒకరిని ప్రేమించినట్టు భర్త తెలుసుకున్నాడు. దీంతో ఆమెను పలుమార్లు ప్రశ్నించినా.. మార్పు రాలేదు. తనే సర్దుకుపోతున్నాడు. అయితే.. కలిసి పడుకునేందుకు.. కలిసి భోజనం చేసేందుకు కూడా ఆమె అవకాశం ఇవ్వకుండా.. నిత్యం వేధింపులకు గురి చేసింది. దీంతో ఆమన్ ఆమెను ఒంటరిగా విడిచి పెట్టి.. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. దీంతో ఆమె.. స్థానిక కోర్టులో తన భర్తపై కేసు పెట్టింది. రోజూ తాగి వచ్చి తనను కొడుతున్నాడని.. మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంది. దీనిని విచారించిన ఇండోర్ కోర్టు.. ఆమె చెబుతున్న దానికి సాక్షులు చెబుతున్న దానికి పొంతన లేకపోవడం.. ఆమన్కు మద్యం తాగే అలవాటు లేదని వైద్యులు సర్టిఫికెట్ కూడా ఇవ్వడంతో నెలనెలా భర్తకు 5 వేలచొప్పున భరణం ఇవ్వాలంటూ.. సంచలన తీర్పు చెప్పింది.
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…