“మీ ఆయనపై మీరు చేసిన ఆరోపణలు.. నిజం కాదని తేలిపోయింది. ఆయన మిమ్మల్ని హింసించడం కాదు.. మీరే ఆయనను మానసికంగా హింసించారు. దీనికి పరిహారంగా.. ఆయన కు నెలనెలా 5 వేల చొప్పున భరణం చెల్లించండి. ఇదే ఫైనల్“- అని ఓ భార్యకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో సదరు భార్య బిక్క మొహం వేసుకుని కోర్టునుంచి బయటకు వెళ్లిపోయింది.
ఏం జరిగింది?
వివాహితుల రక్షణ కోసం.. 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం గృహ హింస(డొమెస్టిక్ వయలెన్స్) చట్టం తీసుకువచ్చింది. భర్తలు.. భార్యలపై దాడులు చేసినా.. అదనపు కట్నం కోసం వేధించినా.. తిండి పెట్టకుండా.. పోషణ చూడకుండా మలమలా మాడ్చిన సందర్భాల్లో ఈ చట్టం వారికి భద్రత కల్పిస్తుంది. అంతేకాదు.. ఆడపడుచులు, అత్తమామల వేధింపుల నుంచి కూడా ఈ చట్టం రక్షణ కవచంగా మారింది. ఇక, భర్త వేరేవారితో సంబంధాలు పెట్టుకుని.. తనను చూడకుండా పోయినా.. సదరు భార్య కోర్టును ఆశ్రయించి.. రక్షణ పొందే అధికారం దక్కుతుంది.
వివాదాలు..
అయితే.. గృహ హింస చట్టం కింద.. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అనేకం.. ఉద్దేశ పూర్వకంగా భర్తలను వేధించేందుకే కేసులు పెడుతున్నారంటూ.. కొన్నాళ్లుగా వివాదాలు తెరమీదికి వస్తున్నాయి. ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు కూడా దీనిని తప్పుబట్టింది. మహిళలకు వరంగా ఉన్న ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసేవారికి కఠిన శిక్షలు ఉండేలా మార్పులు చేస్తే మంచిదేమో నని వ్యాఖ్యానించింది. అయితే.. ఇది అక్కడితో ఆగిపోయింది.
తాజా కేసులో..
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన ఆమన్ 2021లో ఓ యువతిని వివాహం చేసుకున్నారు. ఆమె ఉద్యోగి. అయితే.. ఆమె అంతకు ముందే ఒకరిని ప్రేమించినట్టు భర్త తెలుసుకున్నాడు. దీంతో ఆమెను పలుమార్లు ప్రశ్నించినా.. మార్పు రాలేదు. తనే సర్దుకుపోతున్నాడు. అయితే.. కలిసి పడుకునేందుకు.. కలిసి భోజనం చేసేందుకు కూడా ఆమె అవకాశం ఇవ్వకుండా.. నిత్యం వేధింపులకు గురి చేసింది. దీంతో ఆమన్ ఆమెను ఒంటరిగా విడిచి పెట్టి.. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. దీంతో ఆమె.. స్థానిక కోర్టులో తన భర్తపై కేసు పెట్టింది. రోజూ తాగి వచ్చి తనను కొడుతున్నాడని.. మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంది. దీనిని విచారించిన ఇండోర్ కోర్టు.. ఆమె చెబుతున్న దానికి సాక్షులు చెబుతున్న దానికి పొంతన లేకపోవడం.. ఆమన్కు మద్యం తాగే అలవాటు లేదని వైద్యులు సర్టిఫికెట్ కూడా ఇవ్వడంతో నెలనెలా భర్తకు 5 వేలచొప్పున భరణం ఇవ్వాలంటూ.. సంచలన తీర్పు చెప్పింది.
This post was last modified on February 23, 2024 3:01 pm
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…