Trends

రైతు ఉద్య‌మం: పోలీసుల కాల్పులు.. ఒక రైతు మృతి

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి ఇస్తున్న క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని.. రైతుల‌కు, కూలీల‌కు పింఛ‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ.. దేశ రాజ‌ధాని ఢిల్లీ చ‌లోకు పిలుపునిచ్చిన రైతు ఉద్య‌మం… ర‌క్త సిక్త‌మైంది. హ‌రియాణ‌, ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతుల‌ను అదుపు చేసేందుకు పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో యువ రైతు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. దీంతో రైతులు తిర‌గుబాటు చేశారు. చేతికి అందివ‌చ్చిన వ‌స్తువుతో పోలీసుల‌పై దాడులు ముమ్మ‌రం చేశారు.

ఏం జ‌రిగింది?

స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయాల‌ని, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌క‌ల్పించాల‌ని కోరుతూ.. గ‌త 10 రోజులుగా పంజాబ్, హ‌ర్యాణా రైతులు.. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో పెద్ద ఎత్తును ఉద్య‌మిస్తున్నారు. దీంతో ఏకంగా.. రైతుల‌ను నిలువ‌రిం చేందుకు హ‌రియాణా ప్ర‌భుత్వం ర‌హ‌దారుల‌పై గోడ‌లే నిర్మించేసింది. అదేస‌మ‌యంలో కేంద్ర బ‌ల‌గాల‌ను తీసుకువ‌చ్చి.. పెద్ద ఎత్తున ఇక్క‌డ మోహ‌రించింది. అయిన‌ప్ప‌టికీ.. రైతులు వెన‌క్కి త‌గ్గ‌లేదు. త‌మ ఆందోళ‌న‌ను మ‌రింత తీవ్ర త‌రం చేశారు. ఒకానొక ద‌శ‌లో రైతుల ఉద్య‌మాన్ని నీరు గార్చేలా వారిపై విమ‌ర్శ‌లు, మ‌ద్యం తాగుతున్నార‌న్న వీడియోలు కూడా హ‌ల్చ‌ల్ చేశాయి.

ఇక‌, కేంద్ర ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నించి.. 4 సార్లు చ‌ర్చ‌లు జ‌రిపింది. అయితే.. రైతుల డిమాండ్ల‌ను య‌థాత‌థంగా మాత్రం అంగీక‌రించ‌లేదు. కేవ‌లం క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు ప్ర‌భుత్వ ఏజెన్సీల ద్వారా ఐదేళ్ల పాటు కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకుందామ‌ని ఒక‌ప్ర‌తిపాద‌న‌ను తీసుకువ‌చ్చింది. దీనిలో మోసం ఉంద‌న్న రైతులు.. ఈ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించారు. ప‌లితంగా మ‌రోసారి ఉద్య‌మం తెర‌మీద‌కి వ‌చ్చింది. బుధ‌వారం ఉద‌యం నుంచి హ‌రియాణ‌, పంజాబ్ నుంచి దారి తీసే ఢిల్లా స‌రిహ‌ద్దులు.. ఉద్రిక్తంగా మారాయి.

అయితే.. ఉద్య‌మంలో ఉన్న రైతుల‌ను పోలీసులు క‌వ్వించార‌ని.. వెన‌క్కి వెళ్లిపోవాలంటూ.. వారిని హెచ్చ‌రించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అస‌లే ఆగ్ర‌హంతో ఉన్న రైతులు ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు జ‌రిగిన కాల్పుల్లో 24 సంవత్సరాల శుభ్ కరణ్ సింగ్ అనే రైతు ఉద్యమకారుడు తీవ్రమైన గాయాలపాలై మృతి చెందాడు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మోడీ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జా సంగాలు నిప్పులు చెరుగుతున్నాయి.

This post was last modified on February 21, 2024 10:45 pm

Share

Recent Posts

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

1 hour ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

1 hour ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

4 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

4 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

5 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

8 hours ago