Trends

రైతు ఉద్య‌మం: పోలీసుల కాల్పులు.. ఒక రైతు మృతి

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి ఇస్తున్న క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని.. రైతుల‌కు, కూలీల‌కు పింఛ‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ.. దేశ రాజ‌ధాని ఢిల్లీ చ‌లోకు పిలుపునిచ్చిన రైతు ఉద్య‌మం… ర‌క్త సిక్త‌మైంది. హ‌రియాణ‌, ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతుల‌ను అదుపు చేసేందుకు పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో యువ రైతు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. దీంతో రైతులు తిర‌గుబాటు చేశారు. చేతికి అందివ‌చ్చిన వ‌స్తువుతో పోలీసుల‌పై దాడులు ముమ్మ‌రం చేశారు.

ఏం జ‌రిగింది?

స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయాల‌ని, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌క‌ల్పించాల‌ని కోరుతూ.. గ‌త 10 రోజులుగా పంజాబ్, హ‌ర్యాణా రైతులు.. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో పెద్ద ఎత్తును ఉద్య‌మిస్తున్నారు. దీంతో ఏకంగా.. రైతుల‌ను నిలువ‌రిం చేందుకు హ‌రియాణా ప్ర‌భుత్వం ర‌హ‌దారుల‌పై గోడ‌లే నిర్మించేసింది. అదేస‌మ‌యంలో కేంద్ర బ‌ల‌గాల‌ను తీసుకువ‌చ్చి.. పెద్ద ఎత్తున ఇక్క‌డ మోహ‌రించింది. అయిన‌ప్ప‌టికీ.. రైతులు వెన‌క్కి త‌గ్గ‌లేదు. త‌మ ఆందోళ‌న‌ను మ‌రింత తీవ్ర త‌రం చేశారు. ఒకానొక ద‌శ‌లో రైతుల ఉద్య‌మాన్ని నీరు గార్చేలా వారిపై విమ‌ర్శ‌లు, మ‌ద్యం తాగుతున్నార‌న్న వీడియోలు కూడా హ‌ల్చ‌ల్ చేశాయి.

ఇక‌, కేంద్ర ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నించి.. 4 సార్లు చ‌ర్చ‌లు జ‌రిపింది. అయితే.. రైతుల డిమాండ్ల‌ను య‌థాత‌థంగా మాత్రం అంగీక‌రించ‌లేదు. కేవ‌లం క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు ప్ర‌భుత్వ ఏజెన్సీల ద్వారా ఐదేళ్ల పాటు కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకుందామ‌ని ఒక‌ప్ర‌తిపాద‌న‌ను తీసుకువ‌చ్చింది. దీనిలో మోసం ఉంద‌న్న రైతులు.. ఈ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించారు. ప‌లితంగా మ‌రోసారి ఉద్య‌మం తెర‌మీద‌కి వ‌చ్చింది. బుధ‌వారం ఉద‌యం నుంచి హ‌రియాణ‌, పంజాబ్ నుంచి దారి తీసే ఢిల్లా స‌రిహ‌ద్దులు.. ఉద్రిక్తంగా మారాయి.

అయితే.. ఉద్య‌మంలో ఉన్న రైతుల‌ను పోలీసులు క‌వ్వించార‌ని.. వెన‌క్కి వెళ్లిపోవాలంటూ.. వారిని హెచ్చ‌రించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అస‌లే ఆగ్ర‌హంతో ఉన్న రైతులు ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు జ‌రిగిన కాల్పుల్లో 24 సంవత్సరాల శుభ్ కరణ్ సింగ్ అనే రైతు ఉద్యమకారుడు తీవ్రమైన గాయాలపాలై మృతి చెందాడు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మోడీ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జా సంగాలు నిప్పులు చెరుగుతున్నాయి.

This post was last modified on February 21, 2024 10:45 pm

Share

Recent Posts

జడల్ జమానా మీద మిశ్రమ స్పందనా

న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే…

2 hours ago

వింక్ భామకు పిచ్చి ప్రశ్న

సోషల్ మీడియా ఎప్పుడు ఎవరికి ఎలా ఫేమ్ తెచ్చిపెడుతుందో ఊహించలేం. మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్ అనుకోకుండా అలాగే…

5 hours ago

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

10 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

11 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

12 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

12 hours ago