Trends

రైతు ఉద్య‌మం: పోలీసుల కాల్పులు.. ఒక రైతు మృతి

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి ఇస్తున్న క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని.. రైతుల‌కు, కూలీల‌కు పింఛ‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ.. దేశ రాజ‌ధాని ఢిల్లీ చ‌లోకు పిలుపునిచ్చిన రైతు ఉద్య‌మం… ర‌క్త సిక్త‌మైంది. హ‌రియాణ‌, ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతుల‌ను అదుపు చేసేందుకు పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో యువ రైతు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. దీంతో రైతులు తిర‌గుబాటు చేశారు. చేతికి అందివ‌చ్చిన వ‌స్తువుతో పోలీసుల‌పై దాడులు ముమ్మ‌రం చేశారు.

ఏం జ‌రిగింది?

స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయాల‌ని, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌క‌ల్పించాల‌ని కోరుతూ.. గ‌త 10 రోజులుగా పంజాబ్, హ‌ర్యాణా రైతులు.. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో పెద్ద ఎత్తును ఉద్య‌మిస్తున్నారు. దీంతో ఏకంగా.. రైతుల‌ను నిలువ‌రిం చేందుకు హ‌రియాణా ప్ర‌భుత్వం ర‌హ‌దారుల‌పై గోడ‌లే నిర్మించేసింది. అదేస‌మ‌యంలో కేంద్ర బ‌ల‌గాల‌ను తీసుకువ‌చ్చి.. పెద్ద ఎత్తున ఇక్క‌డ మోహ‌రించింది. అయిన‌ప్ప‌టికీ.. రైతులు వెన‌క్కి త‌గ్గ‌లేదు. త‌మ ఆందోళ‌న‌ను మ‌రింత తీవ్ర త‌రం చేశారు. ఒకానొక ద‌శ‌లో రైతుల ఉద్య‌మాన్ని నీరు గార్చేలా వారిపై విమ‌ర్శ‌లు, మ‌ద్యం తాగుతున్నార‌న్న వీడియోలు కూడా హ‌ల్చ‌ల్ చేశాయి.

ఇక‌, కేంద్ర ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నించి.. 4 సార్లు చ‌ర్చ‌లు జ‌రిపింది. అయితే.. రైతుల డిమాండ్ల‌ను య‌థాత‌థంగా మాత్రం అంగీక‌రించ‌లేదు. కేవ‌లం క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు ప్ర‌భుత్వ ఏజెన్సీల ద్వారా ఐదేళ్ల పాటు కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకుందామ‌ని ఒక‌ప్ర‌తిపాద‌న‌ను తీసుకువ‌చ్చింది. దీనిలో మోసం ఉంద‌న్న రైతులు.. ఈ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించారు. ప‌లితంగా మ‌రోసారి ఉద్య‌మం తెర‌మీద‌కి వ‌చ్చింది. బుధ‌వారం ఉద‌యం నుంచి హ‌రియాణ‌, పంజాబ్ నుంచి దారి తీసే ఢిల్లా స‌రిహ‌ద్దులు.. ఉద్రిక్తంగా మారాయి.

అయితే.. ఉద్య‌మంలో ఉన్న రైతుల‌ను పోలీసులు క‌వ్వించార‌ని.. వెన‌క్కి వెళ్లిపోవాలంటూ.. వారిని హెచ్చ‌రించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అస‌లే ఆగ్ర‌హంతో ఉన్న రైతులు ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు జ‌రిగిన కాల్పుల్లో 24 సంవత్సరాల శుభ్ కరణ్ సింగ్ అనే రైతు ఉద్యమకారుడు తీవ్రమైన గాయాలపాలై మృతి చెందాడు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మోడీ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జా సంగాలు నిప్పులు చెరుగుతున్నాయి.

Satya

Recent Posts

పేరు చెబితే ల‌క్ష… స‌ర్కారు బంప‌ర్ ఆఫ‌ర్‌!

ప్ర‌భుత్వాలు చేప‌ట్టే కీల‌క కార్య‌క్ర‌మాల‌కు పేర్లు సూచించే వారికి బ‌హుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుక‌లు కూడా ఇస్తాయి. గ‌తంలో స్వ‌చ్ఛ…

1 hour ago

జ‌గ‌న్ నాన్చారు.. చంద్ర‌బాబు తేల్చారు: ఉద్యోగుల‌కు పండ‌గ‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ఐదేళ్లు పాలించిన జ‌గ‌న్‌.. నానుస్తూ వ‌చ్చి.. చివ‌ర‌కు త‌న‌కు సాధ్యంకాద‌ని…

1 hour ago

కళ్యాణ్ రామ్ మీద నవ్వించే బరువు

వెంకటేష్, అనిల్ రావిపూడి అయిదోసారి చేతులు కలిపిన మల్టీస్టారర్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. వెంకీకి తోడుగా కళ్యాణ్ రామ్…

3 hours ago

కోటీశ్వరుడితో పెళ్ళి, కానీ ప్రేమికుడి కోసం….

పెళ్ల‌యిన త‌ర్వాత‌.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం కామ‌న్‌. ఈ క్ర‌మంలో ఒక‌ప్పుడు భార్య‌ల‌ను చంపే భ‌ర్త‌ల వ్య‌వ‌హారాలు పెద్ద…

8 hours ago

తెప్ప త‌గ‌లేసిన త‌మ‌న్నా

కెరీర్ తొలి నాళ్ల‌లో పెద్ద‌గా అవ‌కాశాలు లేన‌పుడు ద‌క్షిణాదిన వ‌చ్చే ప్ర‌తి ఛాన్సునూ మ‌హా ప్ర‌సాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…

8 hours ago

పెద్ది ఈవెంట్ లో పవన్ హవా

మెగా హీరోల సినిమాల‌కు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్క‌డో ఒక చోట ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

10 hours ago