వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఇస్తున్న కనీస మద్దతు ధరలకు చట్ట బద్ధత కల్పించాలని.. రైతులకు, కూలీలకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. దేశ రాజధాని ఢిల్లీ చలోకు పిలుపునిచ్చిన రైతు ఉద్యమం… రక్త సిక్తమైంది. హరియాణ, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో యువ రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో రైతులు తిరగుబాటు చేశారు. చేతికి అందివచ్చిన వస్తువుతో పోలీసులపై దాడులు ముమ్మరం చేశారు.
ఏం జరిగింది?
స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధతకల్పించాలని కోరుతూ.. గత 10 రోజులుగా పంజాబ్, హర్యాణా రైతులు.. ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తును ఉద్యమిస్తున్నారు. దీంతో ఏకంగా.. రైతులను నిలువరిం చేందుకు హరియాణా ప్రభుత్వం రహదారులపై గోడలే నిర్మించేసింది. అదేసమయంలో కేంద్ర బలగాలను తీసుకువచ్చి.. పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించింది. అయినప్పటికీ.. రైతులు వెనక్కి తగ్గలేదు. తమ ఆందోళనను మరింత తీవ్ర తరం చేశారు. ఒకానొక దశలో రైతుల ఉద్యమాన్ని నీరు గార్చేలా వారిపై విమర్శలు, మద్యం తాగుతున్నారన్న వీడియోలు కూడా హల్చల్ చేశాయి.
ఇక, కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ పరిణామాలను నిశితంగా గమనించి.. 4 సార్లు చర్చలు జరిపింది. అయితే.. రైతుల డిమాండ్లను యథాతథంగా మాత్రం అంగీకరించలేదు. కేవలం కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఐదేళ్ల పాటు కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకుందామని ఒకప్రతిపాదనను తీసుకువచ్చింది. దీనిలో మోసం ఉందన్న రైతులు.. ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. పలితంగా మరోసారి ఉద్యమం తెరమీదకి వచ్చింది. బుధవారం ఉదయం నుంచి హరియాణ, పంజాబ్ నుంచి దారి తీసే ఢిల్లా సరిహద్దులు.. ఉద్రిక్తంగా మారాయి.
అయితే.. ఉద్యమంలో ఉన్న రైతులను పోలీసులు కవ్వించారని.. వెనక్కి వెళ్లిపోవాలంటూ.. వారిని హెచ్చరించారని వార్తలు వచ్చాయి. అసలే ఆగ్రహంతో ఉన్న రైతులు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు జరిగిన కాల్పుల్లో 24 సంవత్సరాల శుభ్ కరణ్ సింగ్ అనే రైతు ఉద్యమకారుడు తీవ్రమైన గాయాలపాలై మృతి చెందాడు. కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ప్రజా సంగాలు నిప్పులు చెరుగుతున్నాయి.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…