Trends

పార్టీ సభ్యుడి కామెంట్లపై త్రిష సీరియస్

ఆ మధ్య సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ లియో సినిమాలో త్రిషతో నటించడం గురించి అభ్యంతరకరమైన కామెంట్లు చేసి దుమారం రేపడం చూశాం. ఆమెకు మద్దతుగా మాట్లాడినందుకు చిరంజీవి, ఖుష్భూ తదితరుల మీద కేసు పెట్టి కోర్టు చేత చీవాట్లు తిన్న ఘనత కూడా ఇతనికే చెల్లింది. అభిమానులతో సహా ఈ విషయంలో ప్రేక్షకులందరూ త్రిషకు పూర్తి మద్దతు తెలిపారు.  పొన్నియిన్ సెల్వన్ నుంచి వరస అవకాశాలతో త్రిష బిజీగా మారింది. చిరంజీవి, కమల్ హాసన్, అజిత్ లాంటి అగ్ర హీరోలతో ప్యాన్ ఇండియా మూవీస్ లో భాగమవుతోంది. అందుకే కొందరు ఓర్వలేకపోతున్నారు.

తాజాగా తమిళనాడు ఏఐఐడిఎంకె పార్టీకి చెందిన ఏవి రాజు అనే మాజీ నాయకుడు త్రిష మీద నోరు పారేసుకోవడం కలకలం రేపుతోంది. భారీ మొత్తంలో సొమ్ము ముట్టజెప్పడం గురించి మాట్లాడుతూ ఆమె గురించి అనవసరంగా కామెంట్ చేయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు భగ్గుమంటున్నాయి. అతను ఏం చెప్పాడనేది వివరించలేనంత అసహ్యంగా ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత దిగజారుడుగా వ్యవహరించాడో. ఈ వివాదంపై త్రిష ట్విట్టర్ వేదికగా భగ్గుమంది. మనుషులు ఇంత దిగజారి ప్రవర్తిస్తారని ఎప్పుడూ అనుకోలేదని, చట్టపరమైన చర్యలకు వెళ్తున్నట్టు చెప్పింది.

ఇలాంటి వాళ్ళు మంత్రులైనా ఆర్టిస్టులైనా ఎవరైనా సరే తీవ్రమైన శిక్ష పడితే తప్ప ఈ ప్రహసనం ఆగేలా లేదు. కేవలం కాంట్రావర్సి ద్వారా పాపులర్ అయ్యేందుకు వేస్తున్న ఎత్తుగడల్లో ఇది భాగంగా కనిపిస్తోంది. సదరు ఏవి రాజు గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడట. అయినా బుద్ది రాకపోవడం విచారకరం. అయినా పదే పదే త్రిషని లక్ష్యంగా పెట్టుకోవడం పట్ల అభిమానులు కలత చెందుతున్నారు. కెరీర్ చక్కగా ఉన్న టైంలో ఇలా రాళ్లు ఎందుకు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా సిగ్గు మానం లేని రాజు లాంటి వ్యక్తులు అవన్నీ ఆలోచిస్తారా. 

This post was last modified on February 20, 2024 10:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

1 hour ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

3 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

4 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

5 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

6 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

6 hours ago