Trends

పీచు మిఠాయి అమ్మినా, తిన్నా నేరమే !

పీచు మిఠాయి. ఈ ప‌దార్థం గురించి తెలియ‌నివారు ఉండ‌రు. తిన‌నివారు అంత‌క‌న్నా ఉండ‌రు. అయితే, ఇప్పుడు హ‌ఠాత్తుగా పీచు మిఠాయి వార్త‌ల్లోకి వ‌చ్చింది. రావ‌డ‌మే కాదు.. సంచ‌ల‌నంగా మారింది. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల్లోనూ భ‌యానికి కార‌ణ‌మైంది. దీనికి రీజ‌న్‌.. పీచు మిఠాయి త‌యారీలో ఉప‌యోగించే ప‌దార్థాల్లో క్యాన్స‌ర్ కార‌కాలు ఉన్నాయ‌ట‌! అంతే.. ఈ విష‌యం బ‌య‌ట‌కు రాగానే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వెంట‌నే దీనిపై నిషేధం విధించింది. పీచు మిఠాయిని త‌యారు చేసినా.. విక్ర‌యించినా.. చివ‌ర‌కు చాటు మాటుగా తిన్నార‌ని తెలిసినా.. క్ర‌ిమిన‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది.

రాష్ట్రంలో పీచు మిటాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ వెల్లడించారు. వీటిల్లో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్ర‌ ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులు చెన్నై వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. పీచు మిఠాయి న‌మూనాల‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ల్యాబుల‌కు పంపించి.. క్షుణ్నంగా ప‌రిశీలించారు. కాటన్‌ క్యాండీల్లో రోడమైన్‌-బి అనే కెమికల్‌ను గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగించినట్లు తేలింది.

ఈ నేప‌థ్యంలో పీచు మిఠాయి దుకాణ దారుల‌ను ఇప్ప‌టికే రెండు విడుత‌లు హెచ్చ‌రించిన ప్ర‌భుత్వం అప్ప‌టికీ వారిలో మార్పు రాలేద‌న్న కార‌ణంగా ఏకంగా పీచు మిఠాయి విక్ర‌యం.. తిన‌డంపై కూడా నిషేధం విధిస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కాగా, పీచు మిఠాయిపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా త‌మిళ‌నాడు నిలిచింది. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు అమ‌ల‌వుతుందో చూడాలి.

ఏంటీ రోడ‌మైన్ బి?

రోడమైన్‌-బిని సాధార‌ణ ప‌రిభాష‌లో ‘ఇండస్ట్రియల్‌ డై’గా పిలుస్తారు. దీనిని బ‌ట్ట‌ల‌కు రంగులు అద్దే ప‌నిలోనూ, పేపర్‌ ప్రింటింగ్‌లోను వినియోగిస్తారు. అయితే.. దీనిని ఆహారంగా మాత్రం నిషేధించారు. ఎందుకంటే ఇది క్యాన్స‌ర్ కారక‌మ‌ని ముందుగానే గుర్తించారు. అంతేకాదు, ఇది ఎక్కువ మొత్తంలో మన శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అల్సర్ వంటి ప్ర‌మాద‌క‌ర వ్యాధుల‌ను కూడా వ్యాపింప‌జేస్తుంది. క్యాన్సర్‌కు దారితీస్తుంది.

This post was last modified on February 18, 2024 7:55 am

Share
Show comments
Published by
Satya
Tags: Sugar Candy

Recent Posts

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

1 hour ago

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…

1 hour ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

2 hours ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

3 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

5 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

7 hours ago