Trends

షికాగోలో హైదరాబాద్ యువకుడ్ని దారుణంగా కొట్టేశారు

హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడు అకారణంగా దాడికి గురయ్యాడు. దేశం కాని దేశంలో అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న అతడు దారిదోపిడీదారుల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన సయ్యద్ మజర్ అలీ అనే యువకుడి మీద దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ లోని హాషిమ్ నగర్ లో నివసించే ఇతను కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి షికాగోకు వెళ్లాడు.

యూఎస్ లోని ఇండియానా వెస్లియాన్ వర్సిటీలో మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు చేస్తున్న అతను.. అమెరికాలో తాను నివసించే ఇంటికి సమీపంలో నడుస్తున్న వేళలో గుర్తు తెలియని దుండగలు అతని మీద దాడికి పాల్పడ్డారు. అతని నుంచి పర్సు తీసుకున్నారు. ఈ క్రమంలో అతడిపై దాడికి తెగబడ్డారు. ఇదంతా సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది.

దాడి కారణంగా తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న అతని గురించి పోలీసులకు కొందరుస్థానికులు సమాచారం ఇవ్వటంతో వారు రంగంలోకి దిగి.. అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. అతనిపై దాడి జరిగిన విషయాన్ని హైదరాబాద్ లోని అతని తల్లి.. భార్యలకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న అతన్ని మాట్లాడేందుకు భార్య.. తల్లి ఫోన్ కాల్ చేయగా.. మాట్లాడలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అతనికి అవసరమైన వైద్య సాయం అందించాలని కోరుతూ.. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు మొయిల్ చేశారు. భారత ప్రభుత్వం స్పందించి.. యూఎస్ ఎంబసీతో మాట్లాడాలని పలువురు కోరుకుంటున్నారు.

Satya

Recent Posts

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

3 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

6 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

8 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

8 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

8 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

9 hours ago