హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడు అకారణంగా దాడికి గురయ్యాడు. దేశం కాని దేశంలో అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న అతడు దారిదోపిడీదారుల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన సయ్యద్ మజర్ అలీ అనే యువకుడి మీద దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ లోని హాషిమ్ నగర్ లో నివసించే ఇతను కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి షికాగోకు వెళ్లాడు.
యూఎస్ లోని ఇండియానా వెస్లియాన్ వర్సిటీలో మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు చేస్తున్న అతను.. అమెరికాలో తాను నివసించే ఇంటికి సమీపంలో నడుస్తున్న వేళలో గుర్తు తెలియని దుండగలు అతని మీద దాడికి పాల్పడ్డారు. అతని నుంచి పర్సు తీసుకున్నారు. ఈ క్రమంలో అతడిపై దాడికి తెగబడ్డారు. ఇదంతా సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది.
దాడి కారణంగా తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న అతని గురించి పోలీసులకు కొందరుస్థానికులు సమాచారం ఇవ్వటంతో వారు రంగంలోకి దిగి.. అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. అతనిపై దాడి జరిగిన విషయాన్ని హైదరాబాద్ లోని అతని తల్లి.. భార్యలకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న అతన్ని మాట్లాడేందుకు భార్య.. తల్లి ఫోన్ కాల్ చేయగా.. మాట్లాడలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అతనికి అవసరమైన వైద్య సాయం అందించాలని కోరుతూ.. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు మొయిల్ చేశారు. భారత ప్రభుత్వం స్పందించి.. యూఎస్ ఎంబసీతో మాట్లాడాలని పలువురు కోరుకుంటున్నారు.
This post was last modified on February 7, 2024 12:18 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…