Trends

నా భర్తకు 500 మంది మహిళలతో సంబంధం’

మద్రాస్ హైకోర్టును ఒక మహిళ తాజాగా ఆశ్రయించింది. ఆమె చేసిన ఆరోపణ సంచలనంగా మారింది. తన భర్తకు 500 మంది మహిళలతో సంబంధం ఉన్నట్లుగా ఆమె ఆరోపించింది. కలకలాన్ని రేపిన ఈ ఉదంతంలోకి వెళితే.. మద్రాస్ హైకోర్టుకు మధురైలో కూడా ధర్మాసనం ఉంది. ఇక్కడకు తంజావూరుకు చెందిన ఆర్తి అనే మహిళ ఒక పిటిషన్ దాఖలు చేసింది. తన భర్తకు భారీ ఎత్తున పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ చర్యల కోసం ఆమె కోర్టును కోరింది.

వివేక్ రాజ్ తో తనకు పెళ్లైందని.. తామిద్దరం కలిసి జీవిస్తున్నట్లుగా పేర్కొన్న సదరు వివాహిత.. తన భర్త సెల్ ఫోన్ చూసిన సమయంలో పలు అసభ్యకర వీడియోలు ఉన్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తన భర్తను.. అతడి తల్లిదండ్రులకు తాను చెప్పానని.. వారు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని తనను బెదిరించినట్లుగా పేర్కొన్నారు.

అంతేకాదు.. తాను రెండు నెలల గర్భంతో ఉన్నప్పుడు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా తనకు అబార్షన్ అయ్యిందన్న ఆమె.. తనపై దాడి జరిగిన ఘటనను తంజావూరు ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టేలా చూడాలని ఆమె మద్రాస్ మధురై హైకోర్టు బెంచ్ ను అభ్యర్థించారు. తమ ముందుకు వచ్చిన పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి.. దీనికి జిల్లా ఎస్పీతో పాటు సీబీసీఐడీ వారు సమాధానాలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వైనం కలకలాన్ని రేపింది.

This post was last modified on February 1, 2024 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

18 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

27 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago