Trends

నా భర్తకు 500 మంది మహిళలతో సంబంధం’

మద్రాస్ హైకోర్టును ఒక మహిళ తాజాగా ఆశ్రయించింది. ఆమె చేసిన ఆరోపణ సంచలనంగా మారింది. తన భర్తకు 500 మంది మహిళలతో సంబంధం ఉన్నట్లుగా ఆమె ఆరోపించింది. కలకలాన్ని రేపిన ఈ ఉదంతంలోకి వెళితే.. మద్రాస్ హైకోర్టుకు మధురైలో కూడా ధర్మాసనం ఉంది. ఇక్కడకు తంజావూరుకు చెందిన ఆర్తి అనే మహిళ ఒక పిటిషన్ దాఖలు చేసింది. తన భర్తకు భారీ ఎత్తున పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ చర్యల కోసం ఆమె కోర్టును కోరింది.

వివేక్ రాజ్ తో తనకు పెళ్లైందని.. తామిద్దరం కలిసి జీవిస్తున్నట్లుగా పేర్కొన్న సదరు వివాహిత.. తన భర్త సెల్ ఫోన్ చూసిన సమయంలో పలు అసభ్యకర వీడియోలు ఉన్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తన భర్తను.. అతడి తల్లిదండ్రులకు తాను చెప్పానని.. వారు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని తనను బెదిరించినట్లుగా పేర్కొన్నారు.

అంతేకాదు.. తాను రెండు నెలల గర్భంతో ఉన్నప్పుడు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా తనకు అబార్షన్ అయ్యిందన్న ఆమె.. తనపై దాడి జరిగిన ఘటనను తంజావూరు ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టేలా చూడాలని ఆమె మద్రాస్ మధురై హైకోర్టు బెంచ్ ను అభ్యర్థించారు. తమ ముందుకు వచ్చిన పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి.. దీనికి జిల్లా ఎస్పీతో పాటు సీబీసీఐడీ వారు సమాధానాలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వైనం కలకలాన్ని రేపింది.

This post was last modified on February 1, 2024 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ లిక్కర్ స్కాం రూ.2 వేల కోట్ల అయితే జగన్ ది రూ.20 వేల కోట్ల

ఏపీలో అధికార కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీకి చెందిన యువ నేతలు ఒక్కొక్కరుగా ఆక్టివేట్ అయిపోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రిగా…

1 minute ago

నాయకుడి కోసం జనం ఎదురుచూసే ‘కింగ్ డమ్’

https://www.youtube.com/watch?v=McPGQ-Nb9Uk బ్లాక్ బస్టర్ చూసి సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక హీరో మార్కెట్, బడ్జెట్ తగ్గడానికి బదులు పెరుగుతోందంటే అతని స్టార్…

2 minutes ago

ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్.. వారి కోసమే స్ట్రాంగ్ రూల్స్!

మెటా సంస్థ భారతదేశంలో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.16 ఏళ్ల లోపు ఉన్న పిల్లల కోసం సురక్షితమైన, వయస్సుకు తగిన అనుభవాన్ని…

18 minutes ago

కష్టాల్లో ఉన్న కెన్నడీకి టాలీవుడ్ అండ

బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ లాంటి…

1 hour ago

అమరావతికి రూ.26 వేల కోట్లు వచ్చేసినట్టే!

ఏపీ నూతన రాజధాని అమరావతికి ఇక నిధుల కొరత అన్న మాట వినిపించదు. ఎందుకంటే… కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన…

1 hour ago

వైసీపీ దౌర్జన్యాలపై లోకేష్ క్షణం కూడా ఆగట్లేదు!

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ తరహా ఫలితాలు ఆ…

2 hours ago