శీర్షిక చూడగానే ఆశ్చర్యం వేసిందా? విస్మయం కలిగిందా? ఔను.. నిజమే. మనం కంటితో చూస్తున్న ప్రతి దశ్యం వెనుక అనేక కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. అలానే.. ఈ నెల 22న చూడముచ్చటైన రూపంలో అయో ధ్యలో కొలువు దీరిన బాలరామయ్య విగ్రహం వెనుక కూడా.. పెద్ద వ్యథే గూడుకట్టుకుంది. రాతిని మలిచి.. రామయ్యగా కొలువుదీర్చిన ఈ ప్రధాన ఘట్టంలో తెరవెనుక మరుగుపడిన ఓ హృదయ విదారక అంశం తాజాగా వెలుగు చూసింది. ఈ శిల.. అయోధ్యకు చేరడం వెను.. ఓ గృహిణి తాళి బొట్టు తాకట్టు వ్యధ దాగి ఉంది.
భద్రాచల రామదాసు మాదిరిగా.. ఇక్కడ కూడా.. శ్రీనివాస్ అనే ఒక కాంట్రాక్టర్ తనకు ఆ రామయ్యే దిక్కం టూ కుమిలిపోతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న అయోధ్య రామయ్య నినాదం ఎంత మార్మో గుతోందో.. తాజాగా ఈ విషయం కూడా అంతే స్థాయిలో వెలుగులోకి వచ్చింది. దీనిపై రామజన్మభూమి తీర్థ ట్రస్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఏం జరిగింది?
రామజన్మభూమిలో రామమందిర నిర్మాణంపై చర్చలు ఒకవైపు జరుగుతున్నాయి. వీటితో సంబంధం లేకుండా.. మరోవైపు.. కర్ణాటకలో ఒక యాదృచ్ఛిక ఘట్టం చోటు చేసుకుంది. మైసూర్ జిల్లా, హెచ్డీ కోట తాలూక.. బుజ్జేగౌడనపురలోని ఓ పొలంలో రైతులుపంట కోసం యథాలాపంగా దుక్కిదున్నారు. ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ సాగుచేస్తున్నారు. కానీ, వింతో విచిత్రమో తెలియదు కానీ.. పొలంలో నాగలికి.. పెద్ద బండరాయి తగిలింది. దీంతో పనులు ఆపేసి.. రాళ్ల విక్రయ దారుగా.. కాంట్రాక్టరుగా ఉన్న శ్రీనివాస్ను సంప్రదించారు. దీంతో ఆయన వెళ్లి పరిశీలించి దీనిని బయటకు తీశారు. ఈ క్రమంలో ఆయన రైతు నుంచి కొంత సొమ్ము తీసుకున్నారు.
కట్ చేస్తే.. పొలం నుంచి తీసిన ఈ భారీ కృష్ణ శిల వ్యవహారం.. కర్ణాటక సర్కారుకు తెలిసింది. అప్పట్లో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. వెంటనే గనుల శాఖ అధికారులు వచ్చి.. ఎలాంటి అనుమతి లేకుండానే భారీ శిలను భూమి నుంచి సేకరించిన నేరంపై 80 వే లజరిమానా విధించారు. దీనిని కట్టకపోతే.. జైలు తప్పదని హెచ్చరించారు. దీంతో విధిలేక కాంట్రాక్టర్ శ్రీనివాస్.. తన భార్య మెడలో తాళిని తాకట్టుపెట్టి 50 వేలు.. తన దగ్గర ఉన్న 30 వేలు కలిపి జరిమానా చెల్లించారు.
ఇలా ఆ కేసు నుంచి బయట పడిన శ్రీనివాస్.. తన కార్యశాలకు.. ఆ శిలను చేర్చారు. నెలలు గడిచిపోయి నా.. దానిని ఎవరూ కొనలేదు. ఇంతలో అయోధ్య రామ తీర్థ ట్రస్టు నుంచి వచ్చిన సభ్యులు శిలను పరిశీలించి.. తీసుకువెళ్లారట. ఆ శిలే.. ఇప్పుడు అయోధ్య రామాలయంలో బాలరామునిగా విరాజిల్లు తోంది. అయితే.. తాళిబొట్టు విషయానికి వస్తే.. ఇప్పటికీ అది తాకట్టులోనే ఉందని శ్రీనివాస్ చెప్పారు. తన నుంచి సేకరించిన శిల.. రాముడిగా మారుతుందని ఊహించలేదని ఆయన అన్నారు. త్వరలోనే తాను తీర్థ ట్రస్టును కలిసి.. తన సమస్యను వెల్లడించి సాయం కోరతానని చెప్పడం గమనార్హం.
This post was last modified on January 28, 2024 9:44 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…