విమానాలు ప్రయాణించే రన్వేపై కాకిని సైతం వాలనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నిత్యం ఎంతో అప్రమత్తంగా ఉంటూ.. రన్వేలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. అత్యంత వేగంగా దూసుకువచ్చే విమానాలకు చిన్న పాటి ఇబ్బంది కూడా లేకుండా.. కడిగిన ముత్యంలా రన్వేలను పర్యవేక్షిస్తారు. అలాంటి రన్ వే పై ఏకంగా.. రాత్రి వేళ భోజనాలు ఏర్పాటు చేస్తే.. ఒకరు కాదు ఇద్దరుకాదు.. ఏకంగా 150 మంది ప్రయాణికులను రన్వే పైనే కూర్చోబెట్టి వండి వారిస్తే.. ఊహించేందుకు కూడా ఆశ్చర్యం వేస్తుంది కదూ!
కానీ.. అచ్చం ఇలానే జరిగింది. రన్వే పై ప్రయాణికులను కూర్చోబెట్టి వారికి వండి వార్చి వడ్డించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ పని చేసింది.. వ్యక్తులు కాదు.. ఏకంగా ఇండిగో సంస్థే. అంతే.. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ.. మండిపడింది. ఇండిగో సంస్థకు ఏకంగా కోటీ 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇక ఇదే ఘటనపై ముంబై ఎయిర్ పోర్టుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏకంగా 30 లక్షలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ రూ.60 లక్షలు చొప్పున జరిమానాలు విధించాయి.
అసలేం జరిగింది?
కనీసం.. పిట్ట కూడా వాలేందుకు అనుమతి లేని రన్వేపై ఏకంగా 150మందికి భోజనాలు వడ్డించడం వెనుక ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం పొగమంచు.. వాతావరణంలో ఏర్పడిన అసమతుల్య పరిస్థితుల కారణంగా.. విమానాలు ఆలస్యం అవుతున్నాయి. మరికొన్నింటిని రద్దు కూడా చేస్తున్నారు. దీంతో .. ప్రయాణికులు ఆయా సంస్థలపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం 12 గంటలు ఆలస్యంగా బయలు దేరింది.
ఇది పైలెట్పై దాడికి కూడా దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు.. ఇండిగో సంస్థ.. ఇలా ముంబై విమానాశ్రయంలో ఈ నెల 15న డిన్నర్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూడడంతో చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. విమానాల రాకపోకల అంశం.. అటుకేంద్రంలోని బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు మధ్య రాజకీయ వివాదాన్ని కూడా సృష్టించిన విషయం తెలిసిందే.
This post was last modified on January 18, 2024 11:22 am
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…