విమానాలు ప్రయాణించే రన్వేపై కాకిని సైతం వాలనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నిత్యం ఎంతో అప్రమత్తంగా ఉంటూ.. రన్వేలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. అత్యంత వేగంగా దూసుకువచ్చే విమానాలకు చిన్న పాటి ఇబ్బంది కూడా లేకుండా.. కడిగిన ముత్యంలా రన్వేలను పర్యవేక్షిస్తారు. అలాంటి రన్ వే పై ఏకంగా.. రాత్రి వేళ భోజనాలు ఏర్పాటు చేస్తే.. ఒకరు కాదు ఇద్దరుకాదు.. ఏకంగా 150 మంది ప్రయాణికులను రన్వే పైనే కూర్చోబెట్టి వండి వారిస్తే.. ఊహించేందుకు కూడా ఆశ్చర్యం వేస్తుంది కదూ!
కానీ.. అచ్చం ఇలానే జరిగింది. రన్వే పై ప్రయాణికులను కూర్చోబెట్టి వారికి వండి వార్చి వడ్డించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ పని చేసింది.. వ్యక్తులు కాదు.. ఏకంగా ఇండిగో సంస్థే. అంతే.. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ.. మండిపడింది. ఇండిగో సంస్థకు ఏకంగా కోటీ 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇక ఇదే ఘటనపై ముంబై ఎయిర్ పోర్టుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏకంగా 30 లక్షలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ రూ.60 లక్షలు చొప్పున జరిమానాలు విధించాయి.
అసలేం జరిగింది?
కనీసం.. పిట్ట కూడా వాలేందుకు అనుమతి లేని రన్వేపై ఏకంగా 150మందికి భోజనాలు వడ్డించడం వెనుక ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం పొగమంచు.. వాతావరణంలో ఏర్పడిన అసమతుల్య పరిస్థితుల కారణంగా.. విమానాలు ఆలస్యం అవుతున్నాయి. మరికొన్నింటిని రద్దు కూడా చేస్తున్నారు. దీంతో .. ప్రయాణికులు ఆయా సంస్థలపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం 12 గంటలు ఆలస్యంగా బయలు దేరింది.
ఇది పైలెట్పై దాడికి కూడా దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు.. ఇండిగో సంస్థ.. ఇలా ముంబై విమానాశ్రయంలో ఈ నెల 15న డిన్నర్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూడడంతో చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. విమానాల రాకపోకల అంశం.. అటుకేంద్రంలోని బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు మధ్య రాజకీయ వివాదాన్ని కూడా సృష్టించిన విషయం తెలిసిందే.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…