Trends

ర‌న్‌వేపై డిన్న‌ర్‌.. ఇండిగోకు షాక్‌

విమానాలు ప్ర‌యాణించే ర‌న్‌వేపై కాకిని సైతం వాల‌నివ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. నిత్యం ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉంటూ.. ర‌న్‌వేల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తారు. అత్యంత వేగంగా దూసుకువ‌చ్చే విమానాల‌కు చిన్న పాటి ఇబ్బంది కూడా లేకుండా.. క‌డిగిన ముత్యంలా ర‌న్‌వేల‌ను ప‌ర్య‌వేక్షిస్తారు. అలాంటి ర‌న్ వే పై ఏకంగా.. రాత్రి వేళ భోజ‌నాలు ఏర్పాటు చేస్తే.. ఒక‌రు కాదు ఇద్ద‌రుకాదు.. ఏకంగా 150 మంది ప్ర‌యాణికుల‌ను ర‌న్‌వే పైనే కూర్చోబెట్టి వండి వారిస్తే.. ఊహించేందుకు కూడా ఆశ్చ‌ర్యం వేస్తుంది కదూ!

కానీ.. అచ్చం ఇలానే జ‌రిగింది. ర‌న్‌వే పై ప్ర‌యాణికుల‌ను కూర్చోబెట్టి వారికి వండి వార్చి వ‌డ్డించిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఈ ప‌ని చేసింది.. వ్య‌క్తులు కాదు.. ఏకంగా ఇండిగో సంస్థే. అంతే.. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ సెక్యూరిటీ.. మండిప‌డింది. ఇండిగో సంస్థ‌కు ఏకంగా కోటీ 20 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించింది. ఇక ఇదే ఘ‌ట‌న‌పై ముంబై ఎయిర్ పోర్టుకు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ ఏకంగా 30 ల‌క్ష‌లు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ సెక్యూరిటీ రూ.60 ల‌క్ష‌లు చొప్పున జ‌రిమానాలు విధించాయి.

అస‌లేం జ‌రిగింది?

క‌నీసం.. పిట్ట కూడా వాలేందుకు అనుమ‌తి లేని ర‌న్‌వేపై ఏకంగా 150మందికి భోజ‌నాలు వ‌డ్డించ‌డం వెనుక ఏం జ‌రిగింది? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం పొగ‌మంచు.. వాతావ‌ర‌ణంలో ఏర్ప‌డిన అస‌మ‌తుల్య ప‌రిస్థితుల కార‌ణంగా.. విమానాలు ఆల‌స్యం అవుతున్నాయి. మ‌రికొన్నింటిని ర‌ద్దు కూడా చేస్తున్నారు. దీంతో .. ప్ర‌యాణికులు ఆయా సంస్థ‌ల‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ విమానాశ్ర‌యంలో ఇండిగో విమానం 12 గంట‌లు ఆల‌స్యంగా బ‌య‌లు దేరింది.

ఇది పైలెట్‌పై దాడికి కూడా దారితీసింది. ఈ నేప‌థ్యంలో ప్రయాణికుల ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చేందుకు.. ఇండిగో సంస్థ‌.. ఇలా ముంబై విమానాశ్ర‌యంలో ఈ నెల 15న డిన్న‌ర్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఆల‌స్యంగా వెలుగు చూడ‌డంతో చ‌ర్య‌లు తీసుకున్నారు. మ‌రోవైపు.. విమానాల రాక‌పోక‌ల అంశం.. అటుకేంద్రంలోని బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు మ‌ధ్య రాజ‌కీయ వివాదాన్ని కూడా సృష్టించిన విష‌యం తెలిసిందే.

This post was last modified on January 18, 2024 11:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

52 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago