విమానాలు ప్రయాణించే రన్వేపై కాకిని సైతం వాలనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నిత్యం ఎంతో అప్రమత్తంగా ఉంటూ.. రన్వేలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. అత్యంత వేగంగా దూసుకువచ్చే విమానాలకు చిన్న పాటి ఇబ్బంది కూడా లేకుండా.. కడిగిన ముత్యంలా రన్వేలను పర్యవేక్షిస్తారు. అలాంటి రన్ వే పై ఏకంగా.. రాత్రి వేళ భోజనాలు ఏర్పాటు చేస్తే.. ఒకరు కాదు ఇద్దరుకాదు.. ఏకంగా 150 మంది ప్రయాణికులను రన్వే పైనే కూర్చోబెట్టి వండి వారిస్తే.. ఊహించేందుకు కూడా ఆశ్చర్యం వేస్తుంది కదూ!
కానీ.. అచ్చం ఇలానే జరిగింది. రన్వే పై ప్రయాణికులను కూర్చోబెట్టి వారికి వండి వార్చి వడ్డించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ పని చేసింది.. వ్యక్తులు కాదు.. ఏకంగా ఇండిగో సంస్థే. అంతే.. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ.. మండిపడింది. ఇండిగో సంస్థకు ఏకంగా కోటీ 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇక ఇదే ఘటనపై ముంబై ఎయిర్ పోర్టుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏకంగా 30 లక్షలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ రూ.60 లక్షలు చొప్పున జరిమానాలు విధించాయి.
అసలేం జరిగింది?
కనీసం.. పిట్ట కూడా వాలేందుకు అనుమతి లేని రన్వేపై ఏకంగా 150మందికి భోజనాలు వడ్డించడం వెనుక ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం పొగమంచు.. వాతావరణంలో ఏర్పడిన అసమతుల్య పరిస్థితుల కారణంగా.. విమానాలు ఆలస్యం అవుతున్నాయి. మరికొన్నింటిని రద్దు కూడా చేస్తున్నారు. దీంతో .. ప్రయాణికులు ఆయా సంస్థలపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం 12 గంటలు ఆలస్యంగా బయలు దేరింది.
ఇది పైలెట్పై దాడికి కూడా దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు.. ఇండిగో సంస్థ.. ఇలా ముంబై విమానాశ్రయంలో ఈ నెల 15న డిన్నర్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూడడంతో చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. విమానాల రాకపోకల అంశం.. అటుకేంద్రంలోని బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు మధ్య రాజకీయ వివాదాన్ని కూడా సృష్టించిన విషయం తెలిసిందే.
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…
మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…