Trends

ర‌న్‌వేపై డిన్న‌ర్‌.. ఇండిగోకు షాక్‌

విమానాలు ప్ర‌యాణించే ర‌న్‌వేపై కాకిని సైతం వాల‌నివ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. నిత్యం ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉంటూ.. ర‌న్‌వేల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తారు. అత్యంత వేగంగా దూసుకువ‌చ్చే విమానాల‌కు చిన్న పాటి ఇబ్బంది కూడా లేకుండా.. క‌డిగిన ముత్యంలా ర‌న్‌వేల‌ను ప‌ర్య‌వేక్షిస్తారు. అలాంటి ర‌న్ వే పై ఏకంగా.. రాత్రి వేళ భోజ‌నాలు ఏర్పాటు చేస్తే.. ఒక‌రు కాదు ఇద్ద‌రుకాదు.. ఏకంగా 150 మంది ప్ర‌యాణికుల‌ను ర‌న్‌వే పైనే కూర్చోబెట్టి వండి వారిస్తే.. ఊహించేందుకు కూడా ఆశ్చ‌ర్యం వేస్తుంది కదూ!

కానీ.. అచ్చం ఇలానే జ‌రిగింది. ర‌న్‌వే పై ప్ర‌యాణికుల‌ను కూర్చోబెట్టి వారికి వండి వార్చి వ‌డ్డించిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఈ ప‌ని చేసింది.. వ్య‌క్తులు కాదు.. ఏకంగా ఇండిగో సంస్థే. అంతే.. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ సెక్యూరిటీ.. మండిప‌డింది. ఇండిగో సంస్థ‌కు ఏకంగా కోటీ 20 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించింది. ఇక ఇదే ఘ‌ట‌న‌పై ముంబై ఎయిర్ పోర్టుకు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ ఏకంగా 30 ల‌క్ష‌లు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ సెక్యూరిటీ రూ.60 ల‌క్ష‌లు చొప్పున జ‌రిమానాలు విధించాయి.

అస‌లేం జ‌రిగింది?

క‌నీసం.. పిట్ట కూడా వాలేందుకు అనుమ‌తి లేని ర‌న్‌వేపై ఏకంగా 150మందికి భోజ‌నాలు వ‌డ్డించ‌డం వెనుక ఏం జ‌రిగింది? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం పొగ‌మంచు.. వాతావ‌ర‌ణంలో ఏర్ప‌డిన అస‌మ‌తుల్య ప‌రిస్థితుల కార‌ణంగా.. విమానాలు ఆల‌స్యం అవుతున్నాయి. మ‌రికొన్నింటిని ర‌ద్దు కూడా చేస్తున్నారు. దీంతో .. ప్ర‌యాణికులు ఆయా సంస్థ‌ల‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ విమానాశ్ర‌యంలో ఇండిగో విమానం 12 గంట‌లు ఆల‌స్యంగా బ‌య‌లు దేరింది.

ఇది పైలెట్‌పై దాడికి కూడా దారితీసింది. ఈ నేప‌థ్యంలో ప్రయాణికుల ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చేందుకు.. ఇండిగో సంస్థ‌.. ఇలా ముంబై విమానాశ్ర‌యంలో ఈ నెల 15న డిన్న‌ర్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఆల‌స్యంగా వెలుగు చూడ‌డంతో చ‌ర్య‌లు తీసుకున్నారు. మ‌రోవైపు.. విమానాల రాక‌పోక‌ల అంశం.. అటుకేంద్రంలోని బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు మ‌ధ్య రాజ‌కీయ వివాదాన్ని కూడా సృష్టించిన విష‌యం తెలిసిందే.

This post was last modified on January 18, 2024 11:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

8 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

9 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

10 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

10 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

10 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

11 hours ago