Trends

ర‌న్‌వేపై డిన్న‌ర్‌.. ఇండిగోకు షాక్‌

విమానాలు ప్ర‌యాణించే ర‌న్‌వేపై కాకిని సైతం వాల‌నివ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. నిత్యం ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉంటూ.. ర‌న్‌వేల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తారు. అత్యంత వేగంగా దూసుకువ‌చ్చే విమానాల‌కు చిన్న పాటి ఇబ్బంది కూడా లేకుండా.. క‌డిగిన ముత్యంలా ర‌న్‌వేల‌ను ప‌ర్య‌వేక్షిస్తారు. అలాంటి ర‌న్ వే పై ఏకంగా.. రాత్రి వేళ భోజ‌నాలు ఏర్పాటు చేస్తే.. ఒక‌రు కాదు ఇద్ద‌రుకాదు.. ఏకంగా 150 మంది ప్ర‌యాణికుల‌ను ర‌న్‌వే పైనే కూర్చోబెట్టి వండి వారిస్తే.. ఊహించేందుకు కూడా ఆశ్చ‌ర్యం వేస్తుంది కదూ!

కానీ.. అచ్చం ఇలానే జ‌రిగింది. ర‌న్‌వే పై ప్ర‌యాణికుల‌ను కూర్చోబెట్టి వారికి వండి వార్చి వ‌డ్డించిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఈ ప‌ని చేసింది.. వ్య‌క్తులు కాదు.. ఏకంగా ఇండిగో సంస్థే. అంతే.. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ సెక్యూరిటీ.. మండిప‌డింది. ఇండిగో సంస్థ‌కు ఏకంగా కోటీ 20 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించింది. ఇక ఇదే ఘ‌ట‌న‌పై ముంబై ఎయిర్ పోర్టుకు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ ఏకంగా 30 ల‌క్ష‌లు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ సెక్యూరిటీ రూ.60 ల‌క్ష‌లు చొప్పున జ‌రిమానాలు విధించాయి.

అస‌లేం జ‌రిగింది?

క‌నీసం.. పిట్ట కూడా వాలేందుకు అనుమ‌తి లేని ర‌న్‌వేపై ఏకంగా 150మందికి భోజ‌నాలు వ‌డ్డించ‌డం వెనుక ఏం జ‌రిగింది? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం పొగ‌మంచు.. వాతావ‌ర‌ణంలో ఏర్ప‌డిన అస‌మ‌తుల్య ప‌రిస్థితుల కార‌ణంగా.. విమానాలు ఆల‌స్యం అవుతున్నాయి. మ‌రికొన్నింటిని ర‌ద్దు కూడా చేస్తున్నారు. దీంతో .. ప్ర‌యాణికులు ఆయా సంస్థ‌ల‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ విమానాశ్ర‌యంలో ఇండిగో విమానం 12 గంట‌లు ఆల‌స్యంగా బ‌య‌లు దేరింది.

ఇది పైలెట్‌పై దాడికి కూడా దారితీసింది. ఈ నేప‌థ్యంలో ప్రయాణికుల ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చేందుకు.. ఇండిగో సంస్థ‌.. ఇలా ముంబై విమానాశ్ర‌యంలో ఈ నెల 15న డిన్న‌ర్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఆల‌స్యంగా వెలుగు చూడ‌డంతో చ‌ర్య‌లు తీసుకున్నారు. మ‌రోవైపు.. విమానాల రాక‌పోక‌ల అంశం.. అటుకేంద్రంలోని బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు మ‌ధ్య రాజ‌కీయ వివాదాన్ని కూడా సృష్టించిన విష‌యం తెలిసిందే.

This post was last modified on January 18, 2024 11:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago