ప్రపంచ వ్యాప్తంగా.. నిరుద్యోగం ముసురుకున్న విషయం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశం.. అని చెంద ని దేశమని.. ఈ విషయంలో తేడా లేదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలదీ ఇదే పరిస్థితి. ఉద్యోగాల కల్పన.. అనేది అది ప్రైవేటైనా.. ప్రభుత్వమైనా.. దేశాలకు తీవ్ర సవాల్గా పరిణమించింది. ఇక, సాఫ్ట్వేర్ రంగం అయితే.. చెప్పాల్పిన పనిలేదు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో అధునాతన సాంకేతిక వ్యవస్థలు .. మరింతగా భయాందోళనలను సృష్టిస్తున్నాయి.
ప్రపంచంలో హాట్ టాపిక్గా మారిన కృత్రిమమేథ(ఏఐ) ఇప్పుడు ఉద్యోగాలకు గండి కొట్టడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) మరింత ఆందోళన వ్యక్తం చేస్తోంది. “ఏఐ మంచిదే. కానీ, ఇది ఎంతవరకు వినియోగించుకుంటామనేది ప్రధానం. ముఖ్యంగా ఉద్యోగ కల్పన రంగంలో ఏఐ ప్రభావం అంతా ఇంతా ఉండేలా లేదు. దీనివల్ల లక్షల ఉద్యోగాలు రాత్రికిరాత్రి పోయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు“ అని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా హెచ్చరించారు.
ఏఐ పని ప్రారంభిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మంది ఉద్యోగులు ఇంటి ముఖం పట్టడంతోపాటు.. 60 శాతం నియామకాలపై ప్రభావం పడుతుందని క్రిస్టాలినా తెలిపారు. ఈ విషయంపై తాము చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగు చూసినట్టు చెప్పారు. “ఒక టాలెంట్ ఉన్న ఉద్యోగి ద్వారా వచ్చే ఉత్పాదనకు రెండింత నుంచి నాలిగింతల ఉత్పాదన వస్తుంది. ఏఐ వినియోగించేందుకు అందుకే ఆసక్తి పెరుగుతోంది` అని ఆమె వివరించారు.
ఉత్పాదకత(ప్రొడక్ట్) పెరుగుతున్నందున పరిశ్రమలు, ఐటీ వంటివి ఏఐ వైపు చూస్తున్నట్టు చెప్పారు. “అధునాతన ఆర్థిక వ్యవస్థకలిగిన దేశాల్లో 60 శాతం ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ఊడే అవకాశం ఉంది. ఎంతో టాలెంట్ ఉంటే తప్ప.. ఉద్యోగాలు లభించకపోవచ్చు. అందుకే ఏఐని సమర్థవంతంగా వినియోగించుకునే కంటే.. అవసరమైన దేశాలకు బదిలీ చేయడం మంచిదని భావిస్తున్నాం“ అని క్రిస్టాలినా పేర్కొన్నారు.
తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనాల్లో ‘బేబీ’ ఒకటి. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్…
సీఎం చంద్రబాబు మీద మాజీ సీఎం జగన్ నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. చంద్రబాబును నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు…
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
రాజకీయ నాయకులకు కొన్ని ప్రత్యేకమైన మేనరిజాలు, సిగ్నేచర్లు ఉంటాయి. అవే వారికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి…
మాములుగా మన తెలుగు తమిళ సినిమాల్లో మాఫియా అంటే ముంబైనే చూపిస్తారు. రజనీకాంత్ బాషా నుంచి పవన్ కళ్యాణ్ ఓజి…
ది రాజా సాబ్ తర్వాత దాన్ని మర్చిపోయే సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వాళ్ళు…