ఇదేదో తమాషా విషయం కాదు.. నిజమే. ఈ నెల 22వ తేదీనే పిల్లల్ని కంటామంటూ.. ఇప్పుడు గుజరాత్ సహా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గర్భిణులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు వందల సంఖ్యలో ఉన్న గర్భిణులు.. ఈ నెల 22నే తాము పిల్లలకు జన్మనిస్తామని తేల్చి చెబుతున్నారు. దీనికి గాను వైద్యులు ఏమైనా చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. ఇక, వ్యాపారులు కూడా.. కొత్త ప్రారంభించబోయే తమ వ్యాపారాలకు ఈ నెల 22నే ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నారు.
మరి ఏంటి ఈ నెల 22కు ఉన్న ఆ మహత్తు! అంటే.. ఆరోజే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామ జన్మ భూమిలో పునర్నిర్మించిన రామమందిరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అక్కడే 51 అంగుళాల(సుమారు 4.25 అడుగులు) బాల రాముడి విగ్రహాన్ని ఆయన ప్రతిష్టించనున్నారు. ప్రత్యేక పూజల్లోనూ పాల్గొంటారు. దీనికి గుర్తుగా.. మహిళలు.. ముఖ్యంగా గర్భవతులుగా ఉన్నవారు.. అదే రోజు పిల్లల్ని కనాలని టార్గెట్గా పెట్టుకోవడం ఆసక్తిగా మారింది.
“ఆ రోజు ఎంతో పవిత్రమైందని ప్రధాని మోడీ చెప్పారు. ఇంటింటా దీపాలు కూడా వెలిగించమన్నారు. రాముడి విగ్రహాన్ని 500 సంవత్సరాల తర్వాత.. ప్రతిష్టించనున్నారు. ఇంతకన్నా పవిత్రదినం ఏముంటుంది? అందుకే ఆ రోజు పిల్లల్ని కనాలని నిర్ణయించారు” అని యూపీకి చెందిన ప్రముఖ పీడియాట్రిషన్ ఒకరు మీడియాకు చెప్పారు. అంతేకాదు.. ఆ రోజు కోసం.. ఇప్పటికే తమ దగ్గర ఉన్న 30 పడకల ఆసుపత్రి బుక్ అయిపోయిందన్నారు.
ఇక, గర్భవతులు కూడా.. ఇదే విషయాన్ని చెబుతున్నారు. దేశంలో పవిత్ర ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న రామజన్మభూమిలో జరిగే కార్యక్రమానికి గుర్తుగా ఆరోజే పిల్నల్లి కంటామని.. తమకు పుట్టబోయే బిడ్డ ఆడైనా.. మగైనా.. రాముడి పేరునే పెట్టుకుంటామని చెబుతున్నారు. ఇక, ఉత్తరాది వ్యాపారులు.. కొత్తగా ప్రారంభించే వ్యాపారాలను ఈ నెల 22నే ప్రారంభించాలని నిర్ణయించడం మరో విశేషం. మరోవైపు పురోహితులకు కూడా ఆరోజే డిమాండ్ ఏర్పడింది. ఇదీ.. సంగతి!!
This post was last modified on January 8, 2024 10:45 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…