Trends

టార్గెట్ 22.. ఆ రోజే పిల్ల‌ల్ని కంటాం ప్లీజ్‌!

ఇదేదో త‌మాషా విష‌యం కాదు.. నిజ‌మే. ఈ నెల 22వ తేదీనే పిల్ల‌ల్ని కంటామంటూ.. ఇప్పుడు గుజ‌రాత్ స‌హా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోని గ‌ర్భిణులు ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు వంద‌ల సంఖ్య‌లో ఉన్న గ‌ర్భిణులు.. ఈ నెల 22నే తాము పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తామ‌ని తేల్చి చెబుతున్నారు. దీనికి గాను వైద్యులు ఏమైనా చేయాల‌ని వారు అభ్య‌ర్థిస్తున్నారు. ఇక‌, వ్యాపారులు కూడా.. కొత్త ప్రారంభించ‌బోయే త‌మ వ్యాపారాల‌కు ఈ నెల 22నే ముహూర్తాలు ఖ‌రారు చేసుకుంటున్నారు.

మ‌రి ఏంటి ఈ నెల 22కు ఉన్న ఆ మ‌హ‌త్తు! అంటే.. ఆరోజే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో ఉన్న రామ జ‌న్మ భూమిలో పున‌ర్నిర్మించిన రామమందిరాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించ‌నున్నారు. అక్క‌డే 51 అంగుళాల‌(సుమారు 4.25 అడుగులు) బాల రాముడి విగ్ర‌హాన్ని ఆయ‌న ప్ర‌తిష్టించ‌నున్నారు. ప్ర‌త్యేక పూజ‌ల్లోనూ పాల్గొంటారు. దీనికి గుర్తుగా.. మ‌హిళ‌లు.. ముఖ్యంగా గ‌ర్భ‌వతులుగా ఉన్న‌వారు.. అదే రోజు పిల్ల‌ల్ని క‌నాల‌ని టార్గెట్‌గా పెట్టుకోవ‌డం ఆస‌క్తిగా మారింది.

“ఆ రోజు ఎంతో ప‌విత్ర‌మైంద‌ని ప్ర‌ధాని మోడీ చెప్పారు. ఇంటింటా దీపాలు కూడా వెలిగించ‌మ‌న్నారు. రాముడి విగ్ర‌హాన్ని 500 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. ప్ర‌తిష్టించ‌నున్నారు. ఇంత‌క‌న్నా ప‌విత్ర‌దినం ఏముంటుంది? అందుకే ఆ రోజు పిల్లల్ని క‌నాల‌ని నిర్ణ‌యించారు” అని యూపీకి చెందిన ప్ర‌ముఖ పీడియాట్రిష‌న్ ఒక‌రు మీడియాకు చెప్పారు. అంతేకాదు.. ఆ రోజు కోసం.. ఇప్ప‌టికే త‌మ ద‌గ్గ‌ర ఉన్న 30 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి బుక్ అయిపోయింద‌న్నారు.

ఇక‌, గ‌ర్భ‌వ‌తులు కూడా.. ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. దేశంలో పవిత్ర ప్రాంతాల్లో ఒక‌టిగా ఉన్న రామ‌జ‌న్మ‌భూమిలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి గుర్తుగా ఆరోజే పిల్న‌ల్లి కంటామ‌ని.. త‌మ‌కు పుట్ట‌బోయే బిడ్డ ఆడైనా.. మ‌గైనా.. రాముడి పేరునే పెట్టుకుంటామ‌ని చెబుతున్నారు. ఇక‌, ఉత్త‌రాది వ్యాపారులు.. కొత్త‌గా ప్రారంభించే వ్యాపారాల‌ను ఈ నెల 22నే ప్రారంభించాల‌ని నిర్ణ‌యించ‌డం మ‌రో విశేషం. మ‌రోవైపు పురోహితుల‌కు కూడా ఆరోజే డిమాండ్ ఏర్ప‌డింది. ఇదీ.. సంగ‌తి!!

This post was last modified on January 8, 2024 10:45 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ భ‌లే సినిమా

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మ‌హాన‌టి త‌ర్వాత…

4 hours ago

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి…

6 hours ago

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

8 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

10 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

10 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

11 hours ago