ఒకడే ఒక్కడు మొనగాడు..అనే మాట ఆ వ్యక్తికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే… `అంత పోటుగాడు` మరి అంటున్నా నెటిజన్లు. ఈ ఏడాదిలో అతగాడు..ఏకంగా 9940 కండోమ్లను వాడేశాట. దీంతో అతని యవ్వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు.. ఈ విషయం తెలిసిన వారు.. `ఎంతటి రసికుడవో.. తెలిసెరా!` అంటూ కూనిరాగాలు తీస్తున్నారు. ఇంత హాట్ ఘైని ఎక్కడా చూసి ఉండరని కూడా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
విషయంలోకి వెళ్తే.. 2023వ సంవత్సరం ముగిసిపోతున్న నేపథ్యంలో ఆన్లైన్ మర్చంట్ కు సంబంధించి పలు వ్యాపార సంస్థలు తాము చేసిన లావాదేవీలను వెల్లడిస్తున్నారు. స్విగ్గీ, బుక్మై షో, అమెజాన్ ఇలా.. అనే సంస్థలు ఈ ఏడాదిలో ఎన్ని ఆర్డర్లు చేశారు. వీటిలో ఆసక్తికరమైన ఆర్డర్లు ఎన్ని అనే లెక్కలు చెప్పి.. అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థ `స్టోర్ బ్లింకిట్` ఈ ఏడాది తాను చేసిన లావాదేవీలు.. వచ్చిన ఆర్డర్లు, చేసిన డెలివరీల వివరాలు వెల్లడించింది.
ఈ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు.. ఢిల్లీలోని దక్షిణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా.. 9,940 కండోమ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. దీంతో ఈ వార్త సంచలనంగా మారింది. సహజంగా.. కండోమ్స్ అంటే శృంగారానికి సంబంధించినవి కావడంతో గోప్యంగా కొనుగోలు చేస్తారు. లేదా కొనుగోలు చేసినా పదులు, లేదా వందల్లో ఉంటాయి. ఇలా ఒకే ఏడాదిలో 9వేల 940 కండోమ్లను కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. దీనిపైనే నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఎంతటి రసికుడవో తెలిసెరా.. అంటూ ఆటపట్టిస్తున్నారు. మరి కొందరు.. `మంచి పోటుగాడే` అంటూ..బుగ్గలు నొక్కకుంటున్నారు. ఇదీ.. సంగతి!
This post was last modified on December 31, 2023 1:21 am
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…
ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన టీవీ ఛానెళ్లలో ఈటీవీ ఒకటి. 90వ దశకంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితం పట్ల దర్శకుడు ఆదిత్య హాసన్ టెన్షన్ పడుతున్న…
భారత్లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు…