ఒకడే ఒక్కడు మొనగాడు..అనే మాట ఆ వ్యక్తికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే… `అంత పోటుగాడు` మరి అంటున్నా నెటిజన్లు. ఈ ఏడాదిలో అతగాడు..ఏకంగా 9940 కండోమ్లను వాడేశాట. దీంతో అతని యవ్వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు.. ఈ విషయం తెలిసిన వారు.. `ఎంతటి రసికుడవో.. తెలిసెరా!` అంటూ కూనిరాగాలు తీస్తున్నారు. ఇంత హాట్ ఘైని ఎక్కడా చూసి ఉండరని కూడా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
విషయంలోకి వెళ్తే.. 2023వ సంవత్సరం ముగిసిపోతున్న నేపథ్యంలో ఆన్లైన్ మర్చంట్ కు సంబంధించి పలు వ్యాపార సంస్థలు తాము చేసిన లావాదేవీలను వెల్లడిస్తున్నారు. స్విగ్గీ, బుక్మై షో, అమెజాన్ ఇలా.. అనే సంస్థలు ఈ ఏడాదిలో ఎన్ని ఆర్డర్లు చేశారు. వీటిలో ఆసక్తికరమైన ఆర్డర్లు ఎన్ని అనే లెక్కలు చెప్పి.. అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థ `స్టోర్ బ్లింకిట్` ఈ ఏడాది తాను చేసిన లావాదేవీలు.. వచ్చిన ఆర్డర్లు, చేసిన డెలివరీల వివరాలు వెల్లడించింది.
ఈ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు.. ఢిల్లీలోని దక్షిణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా.. 9,940 కండోమ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. దీంతో ఈ వార్త సంచలనంగా మారింది. సహజంగా.. కండోమ్స్ అంటే శృంగారానికి సంబంధించినవి కావడంతో గోప్యంగా కొనుగోలు చేస్తారు. లేదా కొనుగోలు చేసినా పదులు, లేదా వందల్లో ఉంటాయి. ఇలా ఒకే ఏడాదిలో 9వేల 940 కండోమ్లను కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. దీనిపైనే నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఎంతటి రసికుడవో తెలిసెరా.. అంటూ ఆటపట్టిస్తున్నారు. మరి కొందరు.. `మంచి పోటుగాడే` అంటూ..బుగ్గలు నొక్కకుంటున్నారు. ఇదీ.. సంగతి!
This post was last modified on December 31, 2023 1:21 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…