ద్వారక.. హిందువులకు ప్రత్యేకమైన దివ్య ప్రాంతం. భగవాన్ శ్రీకృష్ణుడు నిర్మించిన భవనంగా ఆయన నివసించిన భవనంగా పురాణాలు చెబుతున్నాయి. అయితే.. ఇది ప్రత్యక్షంగా కనిపించదు. ఎందుకంటే.. ఇది సముద్రంలో చాలా లోతున మునిగిపోయి ఉంది. దీంతో ద్వారక పర్యటన అంటే.. కేవలం సదరు సముద్ర తీరానికి వెల్లి ఓ నమస్కారం చేసుకుని రావడమే. దీనినే పవిత్రంగా హిందు వులు భావిస్తున్నారు.
అయితే.. ఇప్పుడు సముద్రంలో నిక్షిప్తమైన ద్వారకను ప్రత్యక్షంగా చూసి తరించే అవకాశం రానుంది. అరేబియా సముద్రంలో మునగిపోయి ఉన్న ద్వారకా నగరాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గామి సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది.
దీనికిగాను ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజ్గావ్తో తాజాగా ఒప్పందం చేసుకుంది. ద్వాపరయుగం అనంతరం అరేబియా సముద్రంలో మునిగిన ఈ పురాతన నగరాన్ని సందర్శించే గొప్ప అవకాశాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. ఈ జలాంతర్గామికి 24 మంది యాత్రికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందని గుజరాత్ పర్యాటక శాఖ తెలిపింది.
పర్యాటకు లతో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్, గైడ్ కూడా ఉంటారు. ఈ జలాంతర్గామి భక్తులను అరేబియా సముద్రంలో 300 అడుగుల దిగువకు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను చూసే అవకాశం ఉంది.
శ్రీకృష్ణుడు రాజ్యమేలిన ప్రదేశాన్ని చూసే అవకాశాన్ని కల్పించడం.. అది కూడా ఎన్నికలకు ముందు కావడం గమనార్హం. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ జలాంతర్గామిని ప్రారంభించాలని చూస్తోంది. పురాతన ద్వారక నగరం శ్రీకృష్ణుడు పాలించిన రాజ్యం కావడం గమనార్హం.
This post was last modified on %s = human-readable time difference 10:53 am
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, బీఆర్ఎస్ పార్టీ రథసారథి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్…
యూత్ హీరోలు తమ సినిమా మీద నమ్మకంతో ఒక్కోసారి పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చేస్తారు. కొన్నిసార్లు అవి నిజమైతే ఇంకొన్ని…
వైసీపీ అధినేత, తన సోదరుడు వైఎస్ జగన్పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. జగన్ నాయకుడో…
ఒక సినిమా బాగుండటం బాగోకపోవడం పూర్తిగా దాన్ని తీసిన దర్శక నిర్మాత రచయితల బృందం మీద ఆధారపడి ఉంటుంది తప్ప…
మాములుగా ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా హీరో సినిమా వస్తోందంటే బరిలో ఎవరు ఉండరు. ఒకవేళ ముందే ప్లాన్ చేసుకున్నా…
టీడీపీ జాతీయ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా తమ్ముళ్లకు సరికొత్త టార్గెట్ విధించారు. ఒక్కొక్కరికీ వెయ్యి చొప్పున సభ్యత్వాల…