Trends

గుడ్ న్యూస్‌: ద్వార‌క‌ను చూడొచ్చు!

ద్వార‌క‌.. హిందువుల‌కు ప్ర‌త్యేకమైన దివ్య ప్రాంతం. భ‌గ‌వాన్ శ్రీకృష్ణుడు నిర్మించిన భ‌వ‌నంగా ఆయ‌న నివ‌సించిన భ‌వ‌నంగా పురాణాలు చెబుతున్నాయి. అయితే.. ఇది ప్ర‌త్యక్షంగా క‌నిపించ‌దు. ఎందుకంటే.. ఇది స‌ముద్రంలో చాలా లోతున మునిగిపోయి ఉంది. దీంతో ద్వారక ప‌ర్య‌ట‌న అంటే.. కేవ‌లం స‌ద‌రు స‌ముద్ర తీరానికి వెల్లి ఓ న‌మ‌స్కారం చేసుకుని రావ‌డ‌మే. దీనినే ప‌విత్రంగా హిందు వులు భావిస్తున్నారు.

అయితే.. ఇప్పుడు స‌ముద్రంలో నిక్షిప్త‌మైన ద్వార‌క‌ను ప్ర‌త్య‌క్షంగా చూసి త‌రించే అవ‌కాశం రానుంది. అరేబియా సముద్రంలో మునగిపోయి ఉన్న ద్వార‌కా నగరాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా గుజరాత్‌ ప్రభుత్వం జలాంతర్గామి సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది.

దీనికిగాను ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజ్‌గావ్‌తో తాజాగా ఒప్పందం చేసుకుంది. ద్వాపరయుగం అనంతరం అరేబియా సముద్రంలో మునిగిన ఈ పురాతన నగరాన్ని సందర్శించే గొప్ప అవకాశాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. ఈ జలాంతర్గామికి 24 మంది యాత్రికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందని గుజరాత్‌ పర్యాటక శాఖ తెలిపింది.

పర్యాటకు లతో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్‌, గైడ్‌ కూడా ఉంటారు. ఈ జలాంతర్గామి భక్తులను అరేబియా సముద్రంలో 300 అడుగుల దిగువకు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను చూసే అవ‌కాశం ఉంది.

శ్రీకృష్ణుడు రాజ్యమేలిన ప్రదేశాన్ని చూసే అవకాశాన్ని క‌ల్పించ‌డం.. అది కూడా ఎన్నిక‌ల‌కు ముందు కావ‌డం గ‌మ‌నార్హం. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ జలాంతర్గామిని ప్రారంభించాలని చూస్తోంది. పురాతన ద్వారక నగరం శ్రీకృష్ణుడు పాలించిన రాజ్యం కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 28, 2023 10:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago