రెండు రోజుల కిందట ఒక షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్. తమ జట్టుకు 5 టైటిల్లు అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టి హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా ఎంపిక చేసింది. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినప్పుడే.. భవిష్యత్తులో అతనికి జుట్టు పగ్గాలు అప్పగిస్తారని అంచనా ఏర్పడింది. కానీ ఈ సీజన్ నుంచే రోహిత్ ని పక్కన పెట్టి హార్దిక్ ను సారథిని చేస్తారని ఎవరు ఊహించలేదు.
రోహిత్ తో మాట్లాడి పరస్పరంగీకారంతోనే ముంబై ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అనుకున్నారు. కానీ రోహిత్ అయిష్టంగానే గానే కెప్టెన్సీకి దూరమయ్యాడన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ముంబై ఇండియన్స్ నిర్ణయం ఆ జట్టు అభిమానులకు ఎంత మాత్రం రుచించడం లేదు. కెప్టెన్సీ మార్పుపై అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందన్నది ఊహించిన విషయమే.
కానీ ఎవరు ఊహించిన విధంగా అభిమానులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఈ నిర్ణయం బయటికి వచ్చి మూడు రోజులైనా వారి ఆగ్రహం చల్లారడం లేదు. సోషల్ మీడియా అకౌంట్లో ముంబై ఇండియన్స్ ను లక్షల మంది అన్ ఫాలో చేస్తున్నారు. చేస్తూనే ఉన్నారు. మూడు రోజులుగా ముంబైకి వ్యతిరేకంగా నెగిటివ్ ట్రెండ్స్ ఉన్నాయి. కెప్టెన్సీ ఇస్తానంటేనే ముంబైకి వస్తానంటూ హార్దిక్ పాండ్య కండిషన్ పెట్టాడని.. అందుకు అంగీకరించిన ముంబై యాజమాన్యం రోహిత్ ని అవమానకర రీతిలో తప్పించిందని.. మిగతా జట్టు సభ్యులను కూడా ఈ విషయంలో సంప్రదించలేదని మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
సూర్య కుమార్ యాదవ్, బుమ్రా లాంటి వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు చూస్తే వారికి కూడా ఏమాత్రం రుచించడం లేదని అర్థమవుతుంది. ఈ పరిణామాలు రోహిత్ అభిమానుల ఆగ్రహాన్ని ఇంకా పెంచాయి. ఎన్నో ఏళ్లుగా ముంబై ఫ్రాంచైజీని నెత్తిన పెట్టుకున్న అభిమానులు ఇప్పుడు ఒక్కసారిగా పక్కన పడేస్తున్నారు. కెప్టెన్సీ మార్పు నిర్ణయం ఈ స్థాయిలో తమ జట్టుపై వ్యతిరేకత తీసుకొస్తుందని ముంబై కూడా ఉండకపోవచ్చు. ఇది ఆ జట్టు ఫాలోయింగ్, విలువను బాగానే దెబ్బతీసేలా కనిపిస్తోంది.
This post was last modified on December 17, 2023 7:00 pm
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…