రెండు రోజుల కిందట ఒక షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్. తమ జట్టుకు 5 టైటిల్లు అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టి హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా ఎంపిక చేసింది. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినప్పుడే.. భవిష్యత్తులో అతనికి జుట్టు పగ్గాలు అప్పగిస్తారని అంచనా ఏర్పడింది. కానీ ఈ సీజన్ నుంచే రోహిత్ ని పక్కన పెట్టి హార్దిక్ ను సారథిని చేస్తారని ఎవరు ఊహించలేదు.
రోహిత్ తో మాట్లాడి పరస్పరంగీకారంతోనే ముంబై ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అనుకున్నారు. కానీ రోహిత్ అయిష్టంగానే గానే కెప్టెన్సీకి దూరమయ్యాడన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ముంబై ఇండియన్స్ నిర్ణయం ఆ జట్టు అభిమానులకు ఎంత మాత్రం రుచించడం లేదు. కెప్టెన్సీ మార్పుపై అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందన్నది ఊహించిన విషయమే.
కానీ ఎవరు ఊహించిన విధంగా అభిమానులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఈ నిర్ణయం బయటికి వచ్చి మూడు రోజులైనా వారి ఆగ్రహం చల్లారడం లేదు. సోషల్ మీడియా అకౌంట్లో ముంబై ఇండియన్స్ ను లక్షల మంది అన్ ఫాలో చేస్తున్నారు. చేస్తూనే ఉన్నారు. మూడు రోజులుగా ముంబైకి వ్యతిరేకంగా నెగిటివ్ ట్రెండ్స్ ఉన్నాయి. కెప్టెన్సీ ఇస్తానంటేనే ముంబైకి వస్తానంటూ హార్దిక్ పాండ్య కండిషన్ పెట్టాడని.. అందుకు అంగీకరించిన ముంబై యాజమాన్యం రోహిత్ ని అవమానకర రీతిలో తప్పించిందని.. మిగతా జట్టు సభ్యులను కూడా ఈ విషయంలో సంప్రదించలేదని మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
సూర్య కుమార్ యాదవ్, బుమ్రా లాంటి వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు చూస్తే వారికి కూడా ఏమాత్రం రుచించడం లేదని అర్థమవుతుంది. ఈ పరిణామాలు రోహిత్ అభిమానుల ఆగ్రహాన్ని ఇంకా పెంచాయి. ఎన్నో ఏళ్లుగా ముంబై ఫ్రాంచైజీని నెత్తిన పెట్టుకున్న అభిమానులు ఇప్పుడు ఒక్కసారిగా పక్కన పడేస్తున్నారు. కెప్టెన్సీ మార్పు నిర్ణయం ఈ స్థాయిలో తమ జట్టుపై వ్యతిరేకత తీసుకొస్తుందని ముంబై కూడా ఉండకపోవచ్చు. ఇది ఆ జట్టు ఫాలోయింగ్, విలువను బాగానే దెబ్బతీసేలా కనిపిస్తోంది.
This post was last modified on December 17, 2023 7:00 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ దగ్గరపడుతోంది. మరొక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ…
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ…
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…