Trends

“ఇండియా గెలిస్తే.. 100 కోట్లు పంచుతా“

ఆదివారం జ‌ర‌గ‌నున్న ఇండియా-ఆస్ట్రేలియా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌పై ఉత్కంఠ తీవ్ర‌స్థాయిలో ఉంది. ఈ క్ర‌మంలో భార‌త్ గెలిస్తే.. 100 కోట్ల రూపాయ‌లు పంచుతానంటూ.. ప్రముఖ ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్‌  సీఈవో పునీత్‌ గుప్తా బిగ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. పునీత్ కూడా కూడా భారత్‌ గెలవాలని కోరుకుంటూ.. తమ కస్టమర్లకు ఈ బంపరాఫర్‌ ప్రకటించారు. ఫైనల్‌లో భారత్‌ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతానని, ఇవి త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తాన‌ని సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్‌లో తెలిపారు.

‘‘2011లో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచినప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా. ఆ రోజు నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిటోరియంలో మ్యాచ్‌ చూశా. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు మాకు టెన్షనే. ఆ టోర్నీలో టీమ్‌ఇండియా గెలిచాక.. నా ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ రోజు మేం ఎంతో ఎంజాయ్‌ చేశాం. నా జీవితంలోని అత్యంత ఆనంద క్షణాల్లో అది ఒకటి. ఇప్పుడు టీమ్‌ఇండియా మళ్లీ ఫైనల్‌కు వచ్చింది. ఈసారి భారత్‌ గెలిస్తే ఏం చేయాలా? అని నేను చాలాసేపు ఆలోచించా“ అని పునీత్ గుప్తా పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలోనే త‌న ఆనందాన్ని పంచుకోవడానికి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారని,  ఇప్పుడు  ఆస్ట్రోటాక్‌ యూజర్లంతా త‌న‌ స్నేహితులేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. వారితో కలిసి త‌న‌ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాన‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో భారత్‌ ప్రపంచకప్‌ను ముద్దాడితే సంస్థ యూజర్లందరికీ రూ.100 కోట్లను సమానంగా పంచాలని నిర్ణయించుకున్నట్టు పునీత్ వెల్ల‌డించారు.  కాగా, పునీత్ సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా సేవ‌లు అందిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ రాజ‌కీయ నేతల నుంచి బిల‌య‌నీర్ల వ‌ర‌కు ఆయ‌న‌కు క‌స్ట‌మ‌ర్లుగా ఉన్నారు.

This post was last modified on November 18, 2023 10:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

2 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

2 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

4 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

4 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

5 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

5 hours ago