Trends

“ఇండియా గెలిస్తే.. 100 కోట్లు పంచుతా“

ఆదివారం జ‌ర‌గ‌నున్న ఇండియా-ఆస్ట్రేలియా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌పై ఉత్కంఠ తీవ్ర‌స్థాయిలో ఉంది. ఈ క్ర‌మంలో భార‌త్ గెలిస్తే.. 100 కోట్ల రూపాయ‌లు పంచుతానంటూ.. ప్రముఖ ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్‌  సీఈవో పునీత్‌ గుప్తా బిగ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. పునీత్ కూడా కూడా భారత్‌ గెలవాలని కోరుకుంటూ.. తమ కస్టమర్లకు ఈ బంపరాఫర్‌ ప్రకటించారు. ఫైనల్‌లో భారత్‌ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతానని, ఇవి త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తాన‌ని సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్‌లో తెలిపారు.

‘‘2011లో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచినప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా. ఆ రోజు నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిటోరియంలో మ్యాచ్‌ చూశా. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు మాకు టెన్షనే. ఆ టోర్నీలో టీమ్‌ఇండియా గెలిచాక.. నా ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ రోజు మేం ఎంతో ఎంజాయ్‌ చేశాం. నా జీవితంలోని అత్యంత ఆనంద క్షణాల్లో అది ఒకటి. ఇప్పుడు టీమ్‌ఇండియా మళ్లీ ఫైనల్‌కు వచ్చింది. ఈసారి భారత్‌ గెలిస్తే ఏం చేయాలా? అని నేను చాలాసేపు ఆలోచించా“ అని పునీత్ గుప్తా పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలోనే త‌న ఆనందాన్ని పంచుకోవడానికి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారని,  ఇప్పుడు  ఆస్ట్రోటాక్‌ యూజర్లంతా త‌న‌ స్నేహితులేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. వారితో కలిసి త‌న‌ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాన‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో భారత్‌ ప్రపంచకప్‌ను ముద్దాడితే సంస్థ యూజర్లందరికీ రూ.100 కోట్లను సమానంగా పంచాలని నిర్ణయించుకున్నట్టు పునీత్ వెల్ల‌డించారు.  కాగా, పునీత్ సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా సేవ‌లు అందిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ రాజ‌కీయ నేతల నుంచి బిల‌య‌నీర్ల వ‌ర‌కు ఆయ‌న‌కు క‌స్ట‌మ‌ర్లుగా ఉన్నారు.

This post was last modified on November 18, 2023 10:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అంబటి కోసం కదిలొచ్చిన కాపు నేతలు!

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ…

1 hour ago

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

3 hours ago

టీడీపీ ఎమ్మెల్యేపై రోజా బాడీ షేమింగ్ కామెంట్స్

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే…

3 hours ago

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…

3 hours ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

4 hours ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

5 hours ago