ఆదివారం జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్పై ఉత్కంఠ తీవ్రస్థాయిలో ఉంది. ఈ క్రమంలో భారత్ గెలిస్తే.. 100 కోట్ల రూపాయలు పంచుతానంటూ.. ప్రముఖ ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా బిగ్ ఆఫర్ ప్రకటించారు. పునీత్ కూడా కూడా భారత్ గెలవాలని కోరుకుంటూ.. తమ కస్టమర్లకు ఈ బంపరాఫర్ ప్రకటించారు. ఫైనల్లో భారత్ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతానని, ఇవి తన కస్టమర్లకు అందిస్తానని సోషల్ మీడియా వేదిక ఎక్స్లో తెలిపారు.
‘‘2011లో భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా. ఆ రోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఆడిటోరియంలో మ్యాచ్ చూశా. మ్యాచ్ జరుగుతున్నంత సేపు మాకు టెన్షనే. ఆ టోర్నీలో టీమ్ఇండియా గెలిచాక.. నా ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ రోజు మేం ఎంతో ఎంజాయ్ చేశాం. నా జీవితంలోని అత్యంత ఆనంద క్షణాల్లో అది ఒకటి. ఇప్పుడు టీమ్ఇండియా మళ్లీ ఫైనల్కు వచ్చింది. ఈసారి భారత్ గెలిస్తే ఏం చేయాలా? అని నేను చాలాసేపు ఆలోచించా“ అని పునీత్ గుప్తా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే తన ఆనందాన్ని పంచుకోవడానికి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారని, ఇప్పుడు ఆస్ట్రోటాక్ యూజర్లంతా తన స్నేహితులేనని ఆయన పేర్కొన్నారు. వారితో కలిసి తన ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలో భారత్ ప్రపంచకప్ను ముద్దాడితే సంస్థ యూజర్లందరికీ రూ.100 కోట్లను సమానంగా పంచాలని నిర్ణయించుకున్నట్టు పునీత్ వెల్లడించారు. కాగా, పునీత్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ రాజకీయ నేతల నుంచి బిలయనీర్ల వరకు ఆయనకు కస్టమర్లుగా ఉన్నారు.
This post was last modified on November 18, 2023 10:20 pm
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…