ఆదివారం జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్పై ఉత్కంఠ తీవ్రస్థాయిలో ఉంది. ఈ క్రమంలో భారత్ గెలిస్తే.. 100 కోట్ల రూపాయలు పంచుతానంటూ.. ప్రముఖ ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా బిగ్ ఆఫర్ ప్రకటించారు. పునీత్ కూడా కూడా భారత్ గెలవాలని కోరుకుంటూ.. తమ కస్టమర్లకు ఈ బంపరాఫర్ ప్రకటించారు. ఫైనల్లో భారత్ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతానని, ఇవి తన కస్టమర్లకు అందిస్తానని సోషల్ మీడియా వేదిక ఎక్స్లో తెలిపారు.
‘‘2011లో భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా. ఆ రోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఆడిటోరియంలో మ్యాచ్ చూశా. మ్యాచ్ జరుగుతున్నంత సేపు మాకు టెన్షనే. ఆ టోర్నీలో టీమ్ఇండియా గెలిచాక.. నా ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ రోజు మేం ఎంతో ఎంజాయ్ చేశాం. నా జీవితంలోని అత్యంత ఆనంద క్షణాల్లో అది ఒకటి. ఇప్పుడు టీమ్ఇండియా మళ్లీ ఫైనల్కు వచ్చింది. ఈసారి భారత్ గెలిస్తే ఏం చేయాలా? అని నేను చాలాసేపు ఆలోచించా“ అని పునీత్ గుప్తా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే తన ఆనందాన్ని పంచుకోవడానికి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారని, ఇప్పుడు ఆస్ట్రోటాక్ యూజర్లంతా తన స్నేహితులేనని ఆయన పేర్కొన్నారు. వారితో కలిసి తన ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలో భారత్ ప్రపంచకప్ను ముద్దాడితే సంస్థ యూజర్లందరికీ రూ.100 కోట్లను సమానంగా పంచాలని నిర్ణయించుకున్నట్టు పునీత్ వెల్లడించారు. కాగా, పునీత్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ రాజకీయ నేతల నుంచి బిలయనీర్ల వరకు ఆయనకు కస్టమర్లుగా ఉన్నారు.
This post was last modified on November 18, 2023 10:20 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…