Trends

“ఇండియా గెలిస్తే.. 100 కోట్లు పంచుతా“

ఆదివారం జ‌ర‌గ‌నున్న ఇండియా-ఆస్ట్రేలియా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌పై ఉత్కంఠ తీవ్ర‌స్థాయిలో ఉంది. ఈ క్ర‌మంలో భార‌త్ గెలిస్తే.. 100 కోట్ల రూపాయ‌లు పంచుతానంటూ.. ప్రముఖ ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్‌  సీఈవో పునీత్‌ గుప్తా బిగ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. పునీత్ కూడా కూడా భారత్‌ గెలవాలని కోరుకుంటూ.. తమ కస్టమర్లకు ఈ బంపరాఫర్‌ ప్రకటించారు. ఫైనల్‌లో భారత్‌ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతానని, ఇవి త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తాన‌ని సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్‌లో తెలిపారు.

‘‘2011లో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచినప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా. ఆ రోజు నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిటోరియంలో మ్యాచ్‌ చూశా. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు మాకు టెన్షనే. ఆ టోర్నీలో టీమ్‌ఇండియా గెలిచాక.. నా ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ రోజు మేం ఎంతో ఎంజాయ్‌ చేశాం. నా జీవితంలోని అత్యంత ఆనంద క్షణాల్లో అది ఒకటి. ఇప్పుడు టీమ్‌ఇండియా మళ్లీ ఫైనల్‌కు వచ్చింది. ఈసారి భారత్‌ గెలిస్తే ఏం చేయాలా? అని నేను చాలాసేపు ఆలోచించా“ అని పునీత్ గుప్తా పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలోనే త‌న ఆనందాన్ని పంచుకోవడానికి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారని,  ఇప్పుడు  ఆస్ట్రోటాక్‌ యూజర్లంతా త‌న‌ స్నేహితులేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. వారితో కలిసి త‌న‌ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాన‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో భారత్‌ ప్రపంచకప్‌ను ముద్దాడితే సంస్థ యూజర్లందరికీ రూ.100 కోట్లను సమానంగా పంచాలని నిర్ణయించుకున్నట్టు పునీత్ వెల్ల‌డించారు.  కాగా, పునీత్ సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా సేవ‌లు అందిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ రాజ‌కీయ నేతల నుంచి బిల‌య‌నీర్ల వ‌ర‌కు ఆయ‌న‌కు క‌స్ట‌మ‌ర్లుగా ఉన్నారు.

This post was last modified on November 18, 2023 10:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒక్క మాటతో 400 సినిమాల్లో అవకాశాలు

ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…

27 minutes ago

నిత్య ఆరోగ్యానికి సంజీవని… సోంపు

సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…

5 hours ago

బాబును చూసి బిత్తరపోయిన మంత్రులు, అధికారులు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…

5 hours ago

ఉప ఎన్నికలు రావడం ఖాయం.. కేసీఆర్ ధీమా

తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…

7 hours ago

కేఎల్ రాహుల్‌ కు అన్యాయం చేస్తున్నారా?

ఇంగ్లండ్‌పై టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్‌ ఆర్డర్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్‌…

11 hours ago

వైరల్ వీడియో… కోహ్లీ హగ్ ఇచ్చిన లక్కీ లేడీ ఎవరు?

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…

11 hours ago