Trends

మైనర్ బాలికల అండాలతో నయా ధందా

పాశ్చాత్య దేశాల నుంచి సరోగసి సంస్కృతి మనదేశంలోకి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. సంతానం లేని దంపతులకు చట్ట ప్రకారం కొన్ని నిబంధనలతో సరోగసికి అనుమతి ఉంది. అయితే, కొందరు నిబంధనలను ఉల్లంఘించి అద్దె గర్భాన్ని అమ్ముకుంటున్న వైనంపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం పొందాలనుకుంటున్న దంపతులను టార్గెట్ చేస్తూ కొత్త ధందా మొదలైంది. సంతానం లేని దంపతులకు మైనర్ బాలికల అండాలను అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది.

పేద కుటుంబాలకు చెందిన బాలికలకు డబ్బులు ఎరవేసి ఈ చర్యలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఐవీఎఫ్ సెంటర్లకు వచ్చే జంటలను ఈ ముఠా టార్గెట్ చేసింది. 15-17 ఏళ్ల వయసున్న మైనర్ బాలికల అండాలను వారికి విక్రయిస్తోంది. డబ్బులు అవసరం ఉన్న పేదింటి బాలికలను టార్గెట్ చేసుకొని వారి వయసుకు సంబంధించిన నకిలీ పత్రాలను ఈ ముఠా సృష్టిస్తోంది . ఒక మైనర్ బాలిక నుంచి అండాలు సేకరించి 30 వేలు ఇస్తామని ఆశ చూపి 11,500 చెల్లించడంతో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో, ఆ ముఠా గుట్టు రట్టయింది.

ఈ క్రమంలోనే ఆ ఘటనపై దర్యాప్తు జరిపిన వారణాసి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఐవీఎఫ్ ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లకు కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం అండం దానం చేసే మహిళ వయస్సు 23 ఏళ్లు దాటాలి. అంతేకాదు, ఆమెకు వివాహమై మూడేళ్ల వయసు దాటిన బిడ్డ ఉండాలి. ఇక, ఒక మహిళ జీవితంలో ఒకసారి మాత్రమే అండదానం చేసేందుకు అర్హురాలు.

This post was last modified on November 18, 2023 12:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

21 ప‌ద‌వులు.. 60 వేల ద‌రఖాస్తులు..

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అనేక మందికి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నామినేటెడ్ ప‌ద‌వుల‌తో సంతృప్తి క‌లిగిస్తున్నారు. ఎన్ని…

42 minutes ago

జగన్ కు సాయిరెడ్డి తలనొప్పి మొదలైనట్టే!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…

47 minutes ago

వైసీపీకి భారీ దెబ్బ‌.. ‘గుంటూరు’ పాయే!

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 2021లో అతి…

3 hours ago

కిరణ్ అబ్బవరం… తెలివే తెలివి

కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…

3 hours ago

తోలు తీస్తా: సోష‌ల్ మీడియాకు రేవంత్ వార్నింగ్‌

సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోంద‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విష‌యంలో…

4 hours ago

గుంటూరు మేయర్ రాజీనామా… తర్వాతేంటీ?

ఏపీలో కీలక ప్రాంతమైన గుంటూరు నగర పాలక సంస్థలో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు మేయర్ గా…

4 hours ago