Trends

ఇలా అయితే ఐపీఎల్ ఎలా?

ఎప్పట్లా వేసవిలో కాకపోయినా.. కొంచెం ఆలస్యంగా అయినా ఐపీఎల్ చూడబోతున్నామని చాలా సంతోషంలో ఉన్నారు క్రికెట్ ప్రియులు. కానీ ఐపీఎల్ సజావుగా జరుగుతుందా లేదా అని ముందు నుంచి ఉన్న అనుమానాలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తే ఆందోళనకరంగా ఉన్నాయి.

కరోనా ముప్పు పొంచి ఉన్నప్పటికీ బయో బబుల్ నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఇంగ్లాండ్‌లో ఒకటికి మూడు సిరీస్‌లను ఏ ఇబ్బందీ లేకుండా నిర్వహించారు. ఇదే రీతిలో ఐపీఎల్ కూడా జరిపించాలని బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అనుకున్నాయి. కానీ వాస్తవంలో ఇదంత తేలిక కాదని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇంకా అన్ని జట్లూ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టలేదు. ఇంతలోనే చెన్నై బృందంలో ఇద్దరు ఆటగాళ్లు సహా పది మందికి పైగా కరోనా బారిన పడ్డారు.యూఏఈలో జట్టలు అడుగు పెట్టిన కొన్ని రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఇక ప్రాక్టీస్ మొదలుపెడితే.. మ్యాచ్‌లు ఆడితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అందులోనూ మూడు నగరాలకు ఆటగాళ్లు మారుతూ ఉండాలి. ఇటు అటు తిరుగుతూ ఉండాలి. ఇంగ్లాండ్‌లో రెండేసి జట్లు సిరీస్‌ల్లో తలపడ్డాయి కాబట్టి.. తక్కువమంది ఆటగాళ్లు, సిబ్బంది, ఇతర వ్యక్తుల్ని కట్టుదిట్టంగా బబుల్‌లో ఉంచి మ్యాచ్‌లు నిర్వహించగలిగారు. కానీ ఐపీఎల్ అంటే ఎనిమిది జట్లతో ముడిపడ్డ టోర్నీ.

ఆటగాళ్లతో పాటు సిబ్బంది, అధికారులు, ఇతరులు కలిపితే వెయ్యి మంది దాకా ఉంటారేమో. పైగా వివిధ దేశాల నుంచి ఆటగాళ్లు వెళ్లి అక్కడ కలిశారు. ఈ నేపథ్యంలో కరోనా ముప్పును ఛేదించి మ్యాచ్‌లు విజయవంతంగా జరిపించడం కష్టంగానే అనిపిస్తోంది. ఇంకా ప్రాక్టీస్ మొదలు కాకముందే ఇంతమంది కరోనా బారిన పడితే.. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో.. వైరస్ మరీ విస్తరించే పరిస్థితి వస్తే టోర్నీ జరుగుతుందో లేదో అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. టోర్నీ ఆరంభానికి ఇంకో 20 రోజులే ఉండగా ఇప్పటిదాకా బీసీసీఐ షెడ్యూల్ కూడా ప్రకటించకపోవడం సందేహాలను మరింత పెంచుతోంది.

Satya

Recent Posts

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

2 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

4 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

4 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

5 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

5 hours ago

ఉత్తరాది బుకింగ్స్ ఎలా ఉన్నాయి

పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…

5 hours ago