సాధారణంగా ఒకింత వయసు మళ్లిన వారిని ఆంటీ అని సంబోధించడం.. నాగరికతకు చిహ్నంగా భావిస్తున్న రోజులివి!. పైగా కొందరు.. 50 ఏళ్లు దాటిన మహిళలు తమ వయసును గుర్తించకుండా ఇలా పిలిస్తే.. ఆనందించేవారు కూడా ఉన్నారు. అయితే .. ఇలా పిలిచారన్న కారణంగా ఓ మహిళకు కోపం నషాళానికి ఎక్కింది. ఆంటీ అని పిలుస్తావా భడవా! అంటూ.. నిప్పులు చెరిగింది. అంతేకాదు.. చెంపలు రెండూ వాయించి పోలీసు కేసు కూడా పెట్టింది. మొత్తానికి ఈ ఘటన రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
తమిళనాడుకు చెందిన నిర్మలాదేవి వయసు 57 ఏళ్లు. ఆమె తాజాగా చెన్నైలోని మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ బస్సులో మింట్ నుంచి రెడ్ హిల్స్కు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ఈ సమయంలో కండెక్టర్ ఆమె దగ్గరకు వచ్చి.. “ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ” అని సంబోధించారు. అంతేకాదు.. “టికెట్కు సరిపడా చిల్లర ఇవ్వండి ఆంటీ” అని పదే పదే బిగ్గరగా అరిచాడు. అంతే.. కోపం నషాళానికి ఎక్కిన నిర్మలాదేవి.. “నన్ను ఆంటీ అని పిలవొద్దు” అని చెప్పారు. అయితే.. జనం ఎక్కువగా ఉండడంతో ఆమె చెప్పింది వినబడని.. కండెక్టర్ మూడో సారి కూడా ఆంటీ అని సంబోధించారు.
అంతే! ఒక్క ఉదుటున సీటు లోంచి లేచిన నిర్మలా దేవి.. కండెక్టర్ రెండు చెంపలూ వాయించేసింది. అంతేకాదు.. అక్కడితో కూడా ఆమె ఆగ్రహం చల్లారలేదు. వెంటనే ఈ విషయాన్ని తన భర్తకు ఫోన్లో చేరవేసింది. రెడ్ హిల్స్ దగ్గర ఆమె బస్సు దిగే సమయానికి భర్త కూడా అక్కడకు చేరుకున్నాడు. ఆ వెంటనే ఆయన కూడా కండెక్టర్కు రెండు తగిలించడంతోపాటు.. స్థానిక పోలీసు స్టేషన్లో మహిళా వేధింపుల సెక్షన్ కింద కేసు పెట్టారు. తన గౌరవానికి భంగం కలిగించాడని.. కండెక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరారు. దీంతో పోలీసులు కండెక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోనే కాకుండా.. క్షణాల్లో దేశవ్యాప్తంగా పాకింది. కండెక్టర్ పట్ల జాలి.. నిర్మలాదేవి పట్ల ఆగ్రహం.. సమపాళ్లలో వ్యక్తమైంది.
This post was last modified on November 8, 2023 6:27 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…