Trends

ఆ రైలు ప్రమాదం ఎలా జరిగింది?

ఒక ట్రాక్ మీద ఒక రైలు ఉన్న వేళ.. అదే ట్రాక్ మీదకు మరో రైలు వస్తుందా? ఆ అవకాశం ఉంటుందా? అంటే ‘నో’ అనేస్తారు. కానీ.. కొన్ని నెలల క్రితం బాలేశ్వర్ ఘోర రైలు ప్రమాదం ఉదంతాన్ని మరవక ముందే.. అదే తరహాలో ఏపీలోని విజయనగరం జిల్లాలో అలాంటి ఉదంతమే ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సిగ్నలింగ్ పాపానికి యాభై మంది (?) వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా అంచనా వేస్తున్నారు. వీరిలో పద్నాలుగు మ్రతదేహాల్ని అర్థరాత్రి నాటికి బయటకు తీయగా.. మిగిలిన వారిని తీయాల్సి ఉంది. మరణించిన వారి సంఖ్యపై సందేహాలు ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో వందకు పైగా ప్రయాణికులు గాయాలబారిన పడ్డారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం రైలు ప్రయాణ భద్రతపై కొత్త సందేహాల్ని తీసుకొచ్చేలా చేసింది.

ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి -అలమండ మధ్య ట్రాక్ మీద ఉన్న గూడ్సు రైలును విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖ -పలాస (08532) రైలు వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో బయలుదేరిన విశాఖపట్నం – రాయగడ (08504) రైలు ఢీ కొట్టింది. ఆగి ఉన్న రైలును మరో రైలు ఢీ కొనటంతో రాయగడ రైల్లోని బోగీలు నుజ్జునుజ్జు కాగా.. మరికొన్ని పట్టాలు తప్పాయి. అక్కడే మరో ట్రాక్ మీద ఉన్న గూడ్సు రైలు బోగీలపైకి దూసుకెళ్లాయి.

ఈ ఘోర ప్రమాదం జరిగింది రాత్రి వేళ కావటంతో అక్కడ భీతావహ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చీకటి వాతావరణం కావటంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కంటకాపల్లి- అలమండ వద్ద సిగ్నల్ కోసం పలాస ప్యాసింజర్ పట్టాల మీదకు నెమ్మదిగా వెళుతూ ట్రాక్ మీద నిలిచింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన రాయగడ రైలు ఢీ కొట్టింది. పలాస ట్రైన్ గార్డు ఉన్న బోగీ రాయగడ ఇంజిన్ ను ఢీ కొనటంతో ఆ రెండు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాద వేగానికి రాయగడ బోగీలు అదే రైలు ఇంజిన్ మీదకు దదూసుకెళ్లాయి. ఆ సమయంలో పక్క ట్రాక్ మీద గూడ్స్ రైలు వెళుతోంది. దీంతో.. కొన్ని బోగీలు గూడ్సు రైలును ఢీ కొన్నాయి.
మొత్తం రెండు ప్యాసింజర్ రైళ్లు.. గూడ్సు రైలుతో సహా ఏడు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఒకవేళ.. పక్క ట్రాక్ మీద కూడా ప్రయాణికులు ప్రయాణించే రైలు ఉన్నట్లైయితే.. ప్రాణనష్టం మరింత తీవ్రంగా ఉండేది. ఈ ప్రమాదాన్ని చూసినోళ్లు.. నోరెళ్లబెట్టే పరిస్థితి. ఎందుకంటే.. వెనుక నుంచి ఢీ కొట్టిన రాయగడ రైలు ఇంజిను పైకి ఆ రైలుకు చెందిన మూడు బోగీలు పైకెక్కేశాయి. పక్కనే ఉన్న గూడ్సు రైలును ఢీ కొన్నాయి. అదే సమయంలో విశాఖ -రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి పడింది. దాని వెనుక ఉన్న డీ1 బోడీ వేగానికి కొంత భాగం పైకి లేచింది. ఇలా బోగీలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో.. సహాయక చర్యలకు సవాలుగా మారింది.

రెండు ప్యాసింజర్ రైళ్లలో 1400 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లుగా ఒక అంచనా. ఈ ఘోర రైలు ప్రమాదంలో గార్డు బోగీలో ఉన్న రైలు ఉద్యోగితో పాటు.. రాయగడ రైలు ఇంజిన్ లో ఉన్న ఇద్దరు లోకో పైలెట్లు మరణించినట్లుగా చెబుతున్నారు. సిగ్నలింగ్ తప్పిదమా? మానవ తప్పిదమా? అన్న దానిపై వాదనలు జరుగుతున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవ తప్పిదం చాలా తక్కువని.. సిగ్నలింగ్ ఇష్యూనే ప్రమాదానికి కారణమై ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ప్రమాదం జరిగిన రైల్లో ప్రయాణించే ఒక రైల్వే ఉద్యోగి మాట్లాడుతూ.. తన 26 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ప్రమాదాన్ని చూడలేదని చెప్పారు. “ఒకే ట్రాక్ లో సిగ్నల్ క్రాస్ కాకుండా రెండు రైళ్లను ఎలా పంపించారన్నది అంతుబట్టటం లేదు” అంటూ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on October 30, 2023 10:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

31 minutes ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

45 minutes ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

1 hour ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

2 hours ago

ది వీక్ కవర్ పేజీపై లోకేష్.. చీఫ్ జాబ్ క్రియేటర్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…

2 hours ago

భార‌త్‌పై ట్రంప్ సెగ‌… 50 కాదు… 500 శాతం?

భార‌త్‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ క‌త్తిక‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌నను సంతృప్తి ప‌ర‌చ‌డం లేద‌ని బాహాటంగానే…

2 hours ago