Trends

విరాట్-అనుష్క ‘పండంటి బిడ్డ రాబోతోంది’

క్రికెటర్లు, సినిమా వాళ్లు పెళ్లి చేసుకుని కొన్ని నెలలు గడవగానే శుభవార్త కోసం ఎదురు చూస్తారు మీడియా వాళ్లు, అభిమానులు. మూడేళ్ల కిందట క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి చేసుకుని ఏడాది గడిచిందో లేదో ఈ విషయంలో ఆరాలు మొదలయ్యాయి.

కానీ వాళ్లు అలాంటి సంకేతాలేమీ ఇవ్వలేదు. ఐతే అందరూ ఎదురు చూస్తున్న ఆ శుభవార్త ఇప్పుడొచ్చింది. అనుష్క గర్భం ధరించిన విషయాన్ని ఈ జంట గురువారం వెల్లడించింది. తామిద్దరం ముగ్గురవుతున్నామని.. 2021లో ప్రసవం జరగబోతోందని కోహ్లి ట్విట్టర్లో వెల్లడించాడు.

మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాము. 2021 జనవరిలో పండంటి బిడ్డ రాబోతోంది అని అతను ట్విట్టర్లో పేర్కొన్నాడు. బేబీ బంప్‌తో ఉన్న అనుష్క ఫొటోను కోహ్లి పోస్ట్ చేశాడు. దీంతో సామన్యులు, సెలబ్రిటీలు విరుష్క జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కోహ్లి-అనుష్కల ప్రేమాయణం ఆరేడేళ్ల కిందట మొదలైంది. రెండేళ్లకు పైగా బంధంలో ఉన్నాక ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. కోహ్లి వెంటనే పెళ్లి చేసుకుందాం అంటే.. బాలీవుడ్ కెరీర్ దృష్ట్యా అనుష్క అందుకు అంగీకరించకపోవడంతోనే ఇద్దరూ విడిపోవాల్సి వచ్చిందని వార్తలొచ్చాయి.

ఐతే ఏడాదికి మించి వీళ్లిద్దరూ దూరంగా ఉండలేకపోయారు. ఆశ్చర్యకరంగా మళ్లీ కలిశారు. ఆ తర్వాత కొంత కాలానికే.. 2017 డిసెంబరులో వీరి పెళ్లి జరిగింది. విరాట్, అనుష్కలకు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో పలు సందర్భాల్లో రుజువైంది. తనకు ఏమాత్రం ఖాళీ దొరికినా అనుష్కతోనే గడుపుతాడు విరాట్. ఆమె కూడా అంతే.

ఈ మధ్య సినిమాలు కూడా తగ్గించేసిన అనుష్క.. లాక్ డౌన్ టైంలో పూర్తిగా కోహ్లితోనే సమయం గడిపింది. ఆ సమయంలోనే ఇద్దరూ బిడ్డకు జన్మనివ్వడంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లున్నారు. జనవరిలో ప్రసవం అంటే.. ప్రస్తుతం అనుష్కకు ఐదో నెల అని అర్థమవుతోంది.

This post was last modified on August 27, 2020 1:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

6 minutes ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

2 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

3 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

4 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

5 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

5 hours ago