సినిమా వాళ్లు ఒకప్పట్లా స్వేచ్ఛగా రాజకీయాలు మాట్లాడే రోజులు ఇప్పుడు లేవు. ఎవరికో ఒకరికి మద్దతు మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా తయారవుతోంది పరిస్థితి. ఒక పార్టీకి మద్దతుదా చిన్న మాట మాట్లాడినా.. ఇంకో పార్టీ వాళ్లు తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు. పార్టీల సంగతి పక్కన పెట్టి ఏదైనా సమస్య మీద మాట్లాడినా.. అధికారంలో ఉన్న పార్టీ వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అందుకే చాలా వరకు ఫిలిం సెలబ్రెటీలు సైలెంటుగా ఉండిపోతున్నారు.
ఇలాంటి టైంలో శ్రీకాంత్ అయ్యంగార్ అనే నటుడు చాలా అగ్రెసివ్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఢీకొడుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. శ్రీకాంత్ కొన్ని నెలల కిందట ఆంధ్రాలో తయారయ్యే బూమ్ బూమ్ బీర్ మీద ఒక సెటైరికల్ వీడియో చేశాడు. రాకేష్ మాస్టర్ ఈ బీర్ తాగాక తనకేదో తేడాగా ఉందని వీడియో పెట్టడం.. తర్వాత కొన్ని రోజులకే ఆయన చనిపోవడం తెలిసిందే.
దీంతో రాకేష్ మాస్టర్ ఆంధ్రా మందు తాగి ప్రమాదం కొని తెచ్చుకున్నాడనే చర్చ సోషల్ మీడియాలో నడిచింది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ తాను బూమ్ బూమ్ బీర్ తాగుతుున్నానని.. ఏమవుతుందో తెలియదని సెటైరికల్ వీడియో చేశాడు. అది వైసీపీ వాళ్లకు రుచించలేదు. ఆయన్ని తీవ్ర స్థాయిలో బూతులు తిట్టారు. ఐతే తాను వైసీపీ, జగన్, ప్రభుత్వం ఇలా ఎవరి మాటా ఎత్తకుండా వీడియో చేస్తే.. ఇంత దారుణంగా తిడతారా అంటూ శ్రీకాంత్ రివర్స్ అయ్యాడు. గుమ్మడికాయల దొంగలు అంటే భుజాలు తడుముకున్న చందంగా ఇది ఉందంటూ వైసీపీ మద్దతుదారులను టార్గెట్ చేస్తూ వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాలు మాట్లాడకున్నా, ఎవరికి మద్దతుగానో, వ్యతిరేకంగానో మాట్లాడకపోయినా తనను టార్గెట్ చేసి దారుణమైన బూతులు తిట్టారని.. వీళ్లను అంత సులువుగా వదిలిపెట్టనని అన్నాడు. తనకు ఫ్యామిలీ లేదని, ఏక్ నిరంజన్ అని.. తనను అమ్మనా బూతులు తిట్టిన వాళ్లు ఏం చేస్తారో చూస్తానని.. వాళ్లతో తాడో పేడో తేల్చుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు.
This post was last modified on October 22, 2023 5:48 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…