Trends

శుభలగ్నం మూవీ రిపీట్.. భర్తను అమ్మేసిన భార్య

ఇప్పటి జనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. మీరు నలభై.. నలభై ప్లస్ అయితే మాత్రం జగతిబాబు హీరోగా నటించిన శుభలగ్నం మూవీ గుర్తుండే ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఆ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. జగతిబాబును ఫ్యామిలీ ఆడియన్స్ కు.. ముఖ్యంగా మహిళలకు దగ్గర చేసిందా మూవీ. ఈ సినిమాలో హీరోను హీరోయిన్ మరో అమ్మాయికి అమ్మేయటం.. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మూవీ.

ఆ సినిమా ముచ్చటను పక్కన పెడితే.. అచ్చం ఆ సినిమాలో మాదిరే.. తన భర్తను వేరే మహిళకు అమ్మేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. రోటీన్ కు భిన్నంగా చోటు చేసుకున్న ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మాండ్ంయకు సమీపంలోని ఒక గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో.. తన భర్త స్థానికంగా ఉన్న ఒక మహిళకు సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని గుర్తించింది.

వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సందర్భంలో చూసింది. ఈ సందర్భంగా వారిని నిలదీసింది. తప్పుడు పనులు చేస్తారా? అంటూ ప్రశ్నించింది. దీంతో.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య జరిగిన గొడవ.. చివరకు పంచాయితీకి వెళ్లింది. ఈ సందర్భంగా సదరు మహిళ.. ‘నీ భర్త నా దగ్గర రూ.5 లక్షలు అప్పు చేశాడు. ఆ మొత్తాన్ని చెల్లించి.. అతన్ని తీసుకెళ్లు’ అని చెప్పింది.

దీనికి స్పందించిన భార్య.. తనకు అలాంటి భర్త అక్కర్లేదని.. తనకే రూ.5లక్షలు ఇచ్చి అతన్ని ఉంచేసుకోవాలని చెప్పింది. దీంతో.. భార్య అడిగిన రూ.5లక్షల మొత్తాన్ని నెలలో సర్దుబాటు చేస్తానని చెప్పటం.. దానికి భార్య ఓకే అనటంతో హాట్ టాపిక్ గా మారింది. డబ్బులతో ముడిపడిన ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన గ్రామపెద్దలు సైతం అవాక్కు అయిన పరిస్థితి. సోషల్ మీడియాలో ఈ ఉదంతం వైరల్ గా మారింది.

This post was last modified on October 21, 2023 11:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

57 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago