ప్రపంచ కప్ క్రికెట్ లో దాయాదుల మధ్య పోరు కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుందన్న సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు క్రికెట్ ప్రేమికులకు పండగే. నరాలు తెగే ఉత్కంఠ రేపే మ్యాచ్ ను ఆస్వాదించేందుకు ఇరు దేశాల క్రికెట్ అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ రెడీ అవుతుంటారు. ఆ అంచనాలకు తగ్గట్లే ఇండో-పాక్ మ్యాచ్ హై టెన్షన్ వాతావరణంలో జరుగుతుంటుంది. అయితే, ఈ ఏడాది మన దేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ సందర్భంగా పాక్ పై భారత్ సునాయస విజయాన్ని అందుకుంది.
దీంతో, స్వదేశంలో పాకిస్థాన్ పై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దానికి తోడు టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి పాక్ కెప్టెన్ జెర్సీ తీసుకున్న వైనంపై కూడా పాక్ మాజీ క్రికెటర్లు సైతం పెదవి విరిచారు. బాబర్ ఆజమ్ మైదానం లోపల, వెలుపల పాక్ జట్టును నిరాశపరిచాడని పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. పాకిస్థాన్ క్రికెట్ టీం లో మునుపటి చేవ కనిపించడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే పాక్ జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం పాక్ క్రికెట్ జట్టులో పోరాట స్ఫూర్తి లేదని, ఈ టీంలోని ఆలగాళ్లలో మునుపటి కసి కనిపించడం లేదని గంగూలీ చేసిన కామెంట్లు షాకింగ్ గా మారాయి. గతంలో పాకిస్థాన్ జట్టు బలంగా ఉండేదని, హోరాహోరీగా మ్యాచ్ లు జరిగేవని దాదా అన్నాడు. ఇక, బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ ల ఆటలో కసి లేదని, టెక్నిక్ లేదని విమర్శించాడు. పాక్ జట్టు పేపర్ మీద బలంగా కనిపిస్తోందని, మైదానంలో మాత్రం బలంగా కనిపించడం లేదని గంగూలీ విమర్శలు గుప్పించాడు.
తాము ఆడే రోజుల్లో పాకిస్తాన్ టీమ్ ఇలా ఉండేది కాదని, వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలింగ్, పటిష్ఠమైన బ్యాటింగ్ ఆర్డర్ తో బలంగా ఉండేదని అన్నాడు. ఈ తరహా పాక్ జట్టుతో తాము ఎప్పుడూ ఆడలేదని, ఒత్తిడిని ఆ జట్టు ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారని విమర్శించాడు. ఇలాంటి జట్టుతో వరల్డ్ కప్ లో పాక్ నెట్టుకు రావడం కష్టమేనని చెప్పాడు. ఇప్పటికే భారత్ పై ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ జట్టుపై గంగూలీ కామెంట్లు పుండు మీద కారం చల్లినట్లు ఉంది.
This post was last modified on October 18, 2023 1:20 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…