మలేషియాకు చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ పై నెటిజన్లు నిప్పులు చెరుగుతు న్నారు. ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా ఇలా వ్యవహరిస్తారా? అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. దీనికి కారణం.. తమ సంస్థలో పనితనం ఇదీ.. అంటూ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ చేసిన ప్రయత్నం. అయితే.. ఈ ప్రయత్నం వికటించింది. ఫలితంగా ఆయనకు నిన్న మొన్నటి వరకు అభిమానులుగా ఉన్న నెటిజన్లు కూడా ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తూ..కామెంట్లు చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
తాజాగా ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ తమ సంస్థ అధికారులు, ఉన్నతోద్యోగులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించా రు. ఈ సందర్భంగా సంస్థ పనితీరు, లాభనష్టాలు, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు, వారికి అందుతున్న సేవలు, లాభాలు వంటివాటిని ఆయన చర్చించారు. అయితే.. ఈక్రమంలో ఆయన ఈ సమావేశాన్ని హుందాగా నిర్వహించకుండా.. చీప్గా చేపట్టారు. ఓ యువతితో మసాజ్ చేయించుకుంటూ.. హాఫ్ న్యూడ్గా ఉన్నారు. అలానే ఆయన తన ల్యాప్ టాప్ ముందు కూర్చుని ఎయిర్ ఏషియా ఉద్యోగులతో వర్చువల్గా భేటీ అయ్యారు.
అంతేకాదు.. ఇదేదో ఘనకార్యం అన్నట్టుగా స్వయంగా టోనీ ఫెర్నాండెజ్ దీనికి సంబంధించిన ఫొటోలను లింక్డిన్లో పోస్ట్ చేశారు. మసాజ్ చేసుకుంటూ మేనేజమెంట్ మీటింగ్కు ఇలా హాజరైనట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. పోస్ట్ చేశారు. ఎయిర్ ఏషియాలో పని సంస్కృతికి ఇది నిదర్శనం అని గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక, ఈ మీటింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే, ఈ పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేస్తూ.. ఇదేం పాడు బుద్ధి అని వ్యాఖ్యానించారు.
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…