మలేషియాకు చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ పై నెటిజన్లు నిప్పులు చెరుగుతు న్నారు. ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా ఇలా వ్యవహరిస్తారా? అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. దీనికి కారణం.. తమ సంస్థలో పనితనం ఇదీ.. అంటూ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ చేసిన ప్రయత్నం. అయితే.. ఈ ప్రయత్నం వికటించింది. ఫలితంగా ఆయనకు నిన్న మొన్నటి వరకు అభిమానులుగా ఉన్న నెటిజన్లు కూడా ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తూ..కామెంట్లు చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
తాజాగా ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ తమ సంస్థ అధికారులు, ఉన్నతోద్యోగులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించా రు. ఈ సందర్భంగా సంస్థ పనితీరు, లాభనష్టాలు, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు, వారికి అందుతున్న సేవలు, లాభాలు వంటివాటిని ఆయన చర్చించారు. అయితే.. ఈక్రమంలో ఆయన ఈ సమావేశాన్ని హుందాగా నిర్వహించకుండా.. చీప్గా చేపట్టారు. ఓ యువతితో మసాజ్ చేయించుకుంటూ.. హాఫ్ న్యూడ్గా ఉన్నారు. అలానే ఆయన తన ల్యాప్ టాప్ ముందు కూర్చుని ఎయిర్ ఏషియా ఉద్యోగులతో వర్చువల్గా భేటీ అయ్యారు.
అంతేకాదు.. ఇదేదో ఘనకార్యం అన్నట్టుగా స్వయంగా టోనీ ఫెర్నాండెజ్ దీనికి సంబంధించిన ఫొటోలను లింక్డిన్లో పోస్ట్ చేశారు. మసాజ్ చేసుకుంటూ మేనేజమెంట్ మీటింగ్కు ఇలా హాజరైనట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. పోస్ట్ చేశారు. ఎయిర్ ఏషియాలో పని సంస్కృతికి ఇది నిదర్శనం అని గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక, ఈ మీటింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే, ఈ పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేస్తూ.. ఇదేం పాడు బుద్ధి అని వ్యాఖ్యానించారు.
This post was last modified on October 17, 2023 9:23 pm
https://www.youtube.com/watch?v=79v4XEc2Q-s నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. 2023 డెవిల్ తర్వాత మళ్ళీ దర్శనమివ్వలేదు. ఈసారి అర్జున్…
ఏపీ అసెంబ్లీలో ఓ వింత పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైపోయిన వైసీపీకి సభలో ప్రధాన…
కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు స్టార్లు లేకపోయినా బ్రహ్మాండంగా ఆదరిస్తారని గతంలో బలగం లాంటివి ఋజువు చేస్తే తాజాగా కోర్ట్…
మే 9 విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు కన్నా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి మీదే ఎక్కువ ప్రేముందనేది బహిరంగ…
విడుదలై నెలరోజులు దాటుతున్నా ఛావా పరుగులు ఆగడం లేదు. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వారాంతం వస్తే చాలు విక్కీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట ఇచ్చారంటే.. అది క్షణాల్లో అమలు కావాల్సిందే. ఇదేదో……