Trends

మసాజ్ చేయించుకుంటూ… మీటింగ్ కి హాజరైన సీఈఓ

మలేషియాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఎయిర్‌ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ పై నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతు న్నారు. ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా ఇలా వ్య‌వ‌హ‌రిస్తారా? అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. దీనికి కార‌ణం.. త‌మ సంస్థ‌లో ప‌నిత‌నం ఇదీ.. అంటూ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ చేసిన ప్ర‌య‌త్నం. అయితే.. ఈ ప్ర‌య‌త్నం విక‌టించింది. ఫ‌లితంగా ఆయ‌న‌కు నిన్న మొన్న‌టి వ‌ర‌కు అభిమానులుగా ఉన్న నెటిజ‌న్లు కూడా ఇప్పుడు తీవ్రంగా విమ‌ర్శిస్తూ..కామెంట్లు చేస్తున్నారు.

ఏం జ‌రిగిందంటే..

తాజాగా ఎయిర్‌ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ త‌మ సంస్థ అధికారులు, ఉన్న‌తోద్యోగుల‌తో వ‌ర్చువ‌ల్ మీటింగ్ నిర్వ‌హించా రు. ఈ సంద‌ర్భంగా సంస్థ ప‌నితీరు, లాభ‌న‌ష్టాలు, ప్ర‌యాణికుల నుంచి ఫిర్యాదులు, వారికి అందుతున్న సేవ‌లు, లాభాలు వంటివాటిని ఆయ‌న చ‌ర్చించారు. అయితే.. ఈక్ర‌మంలో ఆయ‌న ఈ స‌మావేశాన్ని హుందాగా నిర్వ‌హించ‌కుండా.. చీప్‌గా చేప‌ట్టారు. ఓ యువ‌తితో మసాజ్ చేయించుకుంటూ.. హాఫ్ న్యూడ్‌గా ఉన్నారు. అలానే ఆయ‌న త‌న ల్యాప్ టాప్ ముందు కూర్చుని ఎయిర్ ఏషియా ఉద్యోగుల‌తో వ‌ర్చువ‌ల్‌గా భేటీ అయ్యారు.

అంతేకాదు.. ఇదేదో ఘ‌న‌కార్యం అన్న‌ట్టుగా స్వ‌యంగా టోనీ ఫెర్నాండెజ్ దీనికి సంబంధించిన ఫొటోల‌ను లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. మసాజ్‌ చేసుకుంటూ మేనేజమెంట్‌ మీటింగ్‌కు ఇలా హాజరైనట్లు ఆయన స్వయంగా వెల్ల‌డించారు. పోస్ట్‌ చేశారు. ఎయిర్‌ ఏషియాలో పని సంస్కృతికి ఇది నిదర్శనం అని గొప్ప‌గా చెప్పుకొచ్చారు. ఇక‌, ఈ మీటింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే, ఈ పోస్ట్‌ పెట్టిన క్ష‌ణాల్లోనే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లో ప‌నిచేస్తూ.. ఇదేం పాడు బుద్ధి అని వ్యాఖ్యానించారు.

This post was last modified on October 17, 2023 9:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

46 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago