మలేషియాకు చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ పై నెటిజన్లు నిప్పులు చెరుగుతు న్నారు. ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా ఇలా వ్యవహరిస్తారా? అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. దీనికి కారణం.. తమ సంస్థలో పనితనం ఇదీ.. అంటూ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ చేసిన ప్రయత్నం. అయితే.. ఈ ప్రయత్నం వికటించింది. ఫలితంగా ఆయనకు నిన్న మొన్నటి వరకు అభిమానులుగా ఉన్న నెటిజన్లు కూడా ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తూ..కామెంట్లు చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
తాజాగా ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ తమ సంస్థ అధికారులు, ఉన్నతోద్యోగులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించా రు. ఈ సందర్భంగా సంస్థ పనితీరు, లాభనష్టాలు, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు, వారికి అందుతున్న సేవలు, లాభాలు వంటివాటిని ఆయన చర్చించారు. అయితే.. ఈక్రమంలో ఆయన ఈ సమావేశాన్ని హుందాగా నిర్వహించకుండా.. చీప్గా చేపట్టారు. ఓ యువతితో మసాజ్ చేయించుకుంటూ.. హాఫ్ న్యూడ్గా ఉన్నారు. అలానే ఆయన తన ల్యాప్ టాప్ ముందు కూర్చుని ఎయిర్ ఏషియా ఉద్యోగులతో వర్చువల్గా భేటీ అయ్యారు.
అంతేకాదు.. ఇదేదో ఘనకార్యం అన్నట్టుగా స్వయంగా టోనీ ఫెర్నాండెజ్ దీనికి సంబంధించిన ఫొటోలను లింక్డిన్లో పోస్ట్ చేశారు. మసాజ్ చేసుకుంటూ మేనేజమెంట్ మీటింగ్కు ఇలా హాజరైనట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. పోస్ట్ చేశారు. ఎయిర్ ఏషియాలో పని సంస్కృతికి ఇది నిదర్శనం అని గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక, ఈ మీటింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే, ఈ పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేస్తూ.. ఇదేం పాడు బుద్ధి అని వ్యాఖ్యానించారు.
This post was last modified on October 17, 2023 9:23 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…