ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం రోజురోజుకు తీవ్రమైపోతోంది. పాలస్తీనాను బేస్ గా పెట్టుకున్న హమాస్ మిలిటెంట్లు మూడురోజుల క్రింత ఒక్కసారిగా ఇజ్రాయిల్ పైన దాడులు మొదలుపెట్టారు. మొదట షాక్ తిన్న ఇజ్రాయిల్ దళాలు తర్వాత తేరుకుని ఎదురు దాడులు మొదలుపెట్టారు. ఇప్పటికే పాలస్తీనాలోని కొన్ని పట్టణాలు బాగా దెబ్బతినేశాయి. ఇక యుద్ధమంటేనే విచక్షణా రహితంగా దాడులు చేసుకోవటం. అదే పద్దతిలో ఇపుడు ఇజ్రాయేల్ జనావాసాలపైన మిస్సయిల్స్ ప్రయోగిస్తోంది. ముఖ్యంగా గాజా నగరాన్ని టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నది.
కారణం ఏమిటంటే ఇజ్రాయేల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు ఇళ్ళల్లోకి జోరబడి మామూలు జనాలను చంపేస్తున్నారు. కొందరిని ఇళ్ళల్లో నుండి బయటకు ఈడ్చుకొచ్చి అందరిముందు నరికేస్తున్నారు. దానికి బదులుగా ఇజ్రాయేల్ కూడా అలాగే చేస్తోంది. ఇక్కడో ఇంకో సమస్య ఏముందంటే హమాస్ మిలిటెంట్లు పాలస్తీనాలోని చాలా నగరాలు, పట్టణాల్లో మామూలు జనాలుండే ఇళ్ళల్లోనే తలదాచుకుంటున్నారు.
ప్రత్యేకమైన స్ధావరాలుంటే ఇజ్రాయేల్ వాటిపైనే దాడులుచేయటానికి అవకాశాలుండేవి. కానీ ఇపుడు అలాంటి పరిస్ధితులు లేకపోవటంతోనే ఇజ్రాయేల్ జనావాసాలపై దాడులు చేస్తోంది. అందుబాటులోని సమాచారం ప్రకారం రెండు వైపులా సుమారు 3,4 వేల మంది చనిపోగా మరికొన్ని వేలమంది తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. హమాస్ ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయేల్ కు అమెరికా నౌకాదళంతో పాటు కమేండోలు కూడా రంగంలోకి దిగారు. కాబట్టి యుద్ధం నానాటికీ భీకరంగా మారుతోంది. చూడబోయే ఈసారి రెండు దేశాల్లో ఏదో ఒకటే ప్రపంచపఠంలో మిగులుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
మొదట్లో ఇజ్రాయేల్లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు పౌరులను, సైన్యాన్ని దారుణంగా దెబ్బతీశారు. ఇజ్రాయేల్ సైన్యం దగ్గరున్న అత్యంతాధునిక ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాకపోతే తేరుకుని ఇజ్రాయేల్ ఎదురుదాడులు చేయటం మొదలయ్యే సమయానికి బాగా ఆలస్యమైపోయింది. ఈలోగానే ఇజ్రాయేల్ పెద్ద నష్టమే జరిగింది. ఆ కోపంతోనే పాలస్తీనాలోని నగరాలు ముఖ్యంగా గాజాపైన వేలాది మిస్సయిల్స్ తో విరుచుకుపడుతోంది. ఎందుకంటే హమాస్ కు గాజానే కేంద్ర బింధువు కాబట్టి. తమకున్న సమాచారంతో గాజాకి నాలుగువైపులా ఇజ్రాయేల్ సైన్యం దాడులు చేస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on October 11, 2023 10:18 am
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…