ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం రోజురోజుకు తీవ్రమైపోతోంది. పాలస్తీనాను బేస్ గా పెట్టుకున్న హమాస్ మిలిటెంట్లు మూడురోజుల క్రింత ఒక్కసారిగా ఇజ్రాయిల్ పైన దాడులు మొదలుపెట్టారు. మొదట షాక్ తిన్న ఇజ్రాయిల్ దళాలు తర్వాత తేరుకుని ఎదురు దాడులు మొదలుపెట్టారు. ఇప్పటికే పాలస్తీనాలోని కొన్ని పట్టణాలు బాగా దెబ్బతినేశాయి. ఇక యుద్ధమంటేనే విచక్షణా రహితంగా దాడులు చేసుకోవటం. అదే పద్దతిలో ఇపుడు ఇజ్రాయేల్ జనావాసాలపైన మిస్సయిల్స్ ప్రయోగిస్తోంది. ముఖ్యంగా గాజా నగరాన్ని టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నది.
కారణం ఏమిటంటే ఇజ్రాయేల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు ఇళ్ళల్లోకి జోరబడి మామూలు జనాలను చంపేస్తున్నారు. కొందరిని ఇళ్ళల్లో నుండి బయటకు ఈడ్చుకొచ్చి అందరిముందు నరికేస్తున్నారు. దానికి బదులుగా ఇజ్రాయేల్ కూడా అలాగే చేస్తోంది. ఇక్కడో ఇంకో సమస్య ఏముందంటే హమాస్ మిలిటెంట్లు పాలస్తీనాలోని చాలా నగరాలు, పట్టణాల్లో మామూలు జనాలుండే ఇళ్ళల్లోనే తలదాచుకుంటున్నారు.
ప్రత్యేకమైన స్ధావరాలుంటే ఇజ్రాయేల్ వాటిపైనే దాడులుచేయటానికి అవకాశాలుండేవి. కానీ ఇపుడు అలాంటి పరిస్ధితులు లేకపోవటంతోనే ఇజ్రాయేల్ జనావాసాలపై దాడులు చేస్తోంది. అందుబాటులోని సమాచారం ప్రకారం రెండు వైపులా సుమారు 3,4 వేల మంది చనిపోగా మరికొన్ని వేలమంది తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. హమాస్ ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయేల్ కు అమెరికా నౌకాదళంతో పాటు కమేండోలు కూడా రంగంలోకి దిగారు. కాబట్టి యుద్ధం నానాటికీ భీకరంగా మారుతోంది. చూడబోయే ఈసారి రెండు దేశాల్లో ఏదో ఒకటే ప్రపంచపఠంలో మిగులుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
మొదట్లో ఇజ్రాయేల్లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు పౌరులను, సైన్యాన్ని దారుణంగా దెబ్బతీశారు. ఇజ్రాయేల్ సైన్యం దగ్గరున్న అత్యంతాధునిక ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాకపోతే తేరుకుని ఇజ్రాయేల్ ఎదురుదాడులు చేయటం మొదలయ్యే సమయానికి బాగా ఆలస్యమైపోయింది. ఈలోగానే ఇజ్రాయేల్ పెద్ద నష్టమే జరిగింది. ఆ కోపంతోనే పాలస్తీనాలోని నగరాలు ముఖ్యంగా గాజాపైన వేలాది మిస్సయిల్స్ తో విరుచుకుపడుతోంది. ఎందుకంటే హమాస్ కు గాజానే కేంద్ర బింధువు కాబట్టి. తమకున్న సమాచారంతో గాజాకి నాలుగువైపులా ఇజ్రాయేల్ సైన్యం దాడులు చేస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on October 11, 2023 10:18 am
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…