Trends

గుంటూరులో యువకుడి మీద యువతి యాసిడ్ దాడి

రోటీన్ కు భిన్నమైన ఉదంతం ఒకటి గుంటూరులో చోటు చేసుకుంది. సాధారణంగా అమ్మాయి.. తమను ప్రేమించట్లేదన్న కోపంతో ఆరాచకంగా వ్యవహరిస్తున్న కథనాల గురించి చదివే ఉంటారు. ఇప్పుడు అందుకు భిన్నమైన ఉదంతం ఒకటి గుంటూరులో చోటుచేసుకుంది. తనతో సహజీవనంలో ఉన్న యువకుడి మీద ఒక యువతి యాసిడ్ దాడికి పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది.

గుంటూరు నగరంలోని నల్లపాడుకు చెందిన వెంకటేశ్ ఒక వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు వాటర్ ను డబ్బాల్లో సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో రామిరెడ్డి తోటకు చెందిన రాధ అనే వివాహితతో వెంకటేశ్ కు పరిచయమైంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని వైరాకు చెందిన రాధకు భర్త లేడు. స్థానికంగా ఉంటూ ఇళ్లల్లో పని చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరి పరిచయం ముందుకు వెళ్లి సహజీవనం షురూ చేశారు.

వీరిద్దరి వ్యవహారం వెంకటేశ్ తల్లిదండ్రులకు తెలిసి.. రాధను ఇంటి నుంచి బయటకు పంపేశారు. ఈ క్రమంలో వెంకటేశ్.. అతని కుటుంబ సభ్యులు తనను కొట్టి గాయపర్చినట్లుగా పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. తనను ఇంట్లో నుంచి గెంటేసిన వైనంపై కక్ష పెంచుకున్న రాధ.. తాజాగా మరో ముగ్గురు కుర్రాళ్లను తీసుకొని ఆటోలో వెంకటేశ్ వద్దకు వెళ్లారు.

అక్కడ వాటర్ బాటిళ్లను కిందకు దించుతున్న వెంకటేశ్ పై వెనుక నుంచి యాసిడ్ పోసింది. యాసిడ్ మంటలకు పెద్దగా కేకలు వేయటంతో స్థానికులు స్పందించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి అనంతరం తాను వచ్చిన ఆటోలో రాధ పరారైందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ షాకింగ్ ఉదంతంపై స్పందించిన పోలీసులు రాధతో పాటు.. ఆమెకు సహకరించిన మరో ముగ్గురి పైనా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. రాధ కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

This post was last modified on October 4, 2023 9:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

31 seconds ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

1 hour ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

3 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

3 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

5 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

6 hours ago