రోటీన్ కు భిన్నమైన ఉదంతం ఒకటి గుంటూరులో చోటు చేసుకుంది. సాధారణంగా అమ్మాయి.. తమను ప్రేమించట్లేదన్న కోపంతో ఆరాచకంగా వ్యవహరిస్తున్న కథనాల గురించి చదివే ఉంటారు. ఇప్పుడు అందుకు భిన్నమైన ఉదంతం ఒకటి గుంటూరులో చోటుచేసుకుంది. తనతో సహజీవనంలో ఉన్న యువకుడి మీద ఒక యువతి యాసిడ్ దాడికి పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది.
గుంటూరు నగరంలోని నల్లపాడుకు చెందిన వెంకటేశ్ ఒక వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు వాటర్ ను డబ్బాల్లో సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో రామిరెడ్డి తోటకు చెందిన రాధ అనే వివాహితతో వెంకటేశ్ కు పరిచయమైంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని వైరాకు చెందిన రాధకు భర్త లేడు. స్థానికంగా ఉంటూ ఇళ్లల్లో పని చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరి పరిచయం ముందుకు వెళ్లి సహజీవనం షురూ చేశారు.
వీరిద్దరి వ్యవహారం వెంకటేశ్ తల్లిదండ్రులకు తెలిసి.. రాధను ఇంటి నుంచి బయటకు పంపేశారు. ఈ క్రమంలో వెంకటేశ్.. అతని కుటుంబ సభ్యులు తనను కొట్టి గాయపర్చినట్లుగా పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. తనను ఇంట్లో నుంచి గెంటేసిన వైనంపై కక్ష పెంచుకున్న రాధ.. తాజాగా మరో ముగ్గురు కుర్రాళ్లను తీసుకొని ఆటోలో వెంకటేశ్ వద్దకు వెళ్లారు.
అక్కడ వాటర్ బాటిళ్లను కిందకు దించుతున్న వెంకటేశ్ పై వెనుక నుంచి యాసిడ్ పోసింది. యాసిడ్ మంటలకు పెద్దగా కేకలు వేయటంతో స్థానికులు స్పందించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి అనంతరం తాను వచ్చిన ఆటోలో రాధ పరారైందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ షాకింగ్ ఉదంతంపై స్పందించిన పోలీసులు రాధతో పాటు.. ఆమెకు సహకరించిన మరో ముగ్గురి పైనా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. రాధ కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on October 4, 2023 9:36 am
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…