Trends

హైదరాబాద్ పరువు ‘లులు’పాలు

లులు మాల్.. లులు మాల్.. వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని గురించే చర్చ. దేశంలోనే అతి పెద్దదైన మాల్స్‌లో ఒకటైన ఈ మాల్.. వాస్తవానికి విశాఖపట్నంలో ఏర్పాటు కావాల్సింది. కానీ జగన్ సర్కారు ఇబ్బందులకు గురి చేయడంతో అక్కడి నుంచి తరలివెళ్లి హైదరాబాద్‌లో ఏర్పాటు కావడంతో రాజకీయంగా కూడా దీని మీద పెద్ద చర్చ జరిగింది. ఇక ఇప్పటిదాకా ఇండియాలో చూడని భారీ హైపర్ మార్కెట్ సహా అనేక ఆకర్షణలతో ఈ మాల్ సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ మాల్ మొదలైన దగ్గర్నుంచి దాని విశేషాలతో సోషల్ మీడియా నిండిపోతోంది.

ఇక ఈ మాల్‌న చూడ్డానికి జనం మామూలుగా ఎగబడట్లేదు. ఇదేదో కొన్ని వారాలు ఉండి వెళ్లిపోయే ఎగ్జిబిషన్ అన్నట్లుగా జనం తొలి వారంలోనే వేల సంఖ్యలో మాల్‌కు వరుస కట్టేస్తున్నారు. దీని వల్ల కూకట్ పల్లి ప్రాంతంలో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం కావడం హాట్ టాపిక్ అయింది.

జనానికి ఇదేం పిచ్చి అంటూ ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక గాంధీ జయంతి రోజు జరిగిన పరిణామాలు చూస్తే షాకవ్వకుండా ఉండలేం. సెలవు రోజు కావడంతో గత కొన్ని రోజులను మించి ఈ మాల్‌కు జనం పోటెత్తారు. మాల్‌లో నిలబడటానికి కూడా చోటు లేని పరిస్థితి తలెత్తింది. జనాన్ని సిబ్బంది అస్సలు కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో దొరికింది ఛాన్స్ అన్నట్లుగా జనం ఫుడ్ ఐటెమ్స్‌ను లాగించేశారు. ర్యాక్స్‌లో ఉన్న తిండి పదార్థాలను ఎలా పడితే అలా తినేశారు. కూల్ డ్రింక్స్ ఖాళీ చేసేశారు. ఒకరిని చూసి ఇంకొకరు ఫుడ్ ఐటెమ్స్‌ లూటీకి పాల్పడ్డారు. మాల్ లోపల ఒక విధ్వంసం జరిగిన పరిస్థితి నెలకొంది. సంబంధిత దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మాల్‌కు వచ్చిన జనాల్లో పేదవాళ్లు, తిండికి గతి లేని వాళ్లేమీ ఉండరు. కొంచెం స్థితిమంతులే వస్తారు. అలాంటి వాళ్లు ఇలాంటి దారుణాలకు పాల్పడటం ఘోరం. దీని వల్ల హైదరాబాద్ పరువు పోయిందనడంలో సందేహం లేదు.

This post was last modified on October 3, 2023 8:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కండల వీరుడి సినిమాకు ‘చైనా’ కష్టాలు

యుద్ధ నేపధ్యాలు, చారిత్రాత్మక సంఘటనలు ఆధారంగా తీసే సినిమాలకు మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ అంగీకారం తప్పనిసరి. లేదంటే సెన్సార్ అభ్యంతరాలు…

52 minutes ago

నదిలో 11,000 లీటర్ల పాలు.. ప్రకృతికి మంచిదేనా?

మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక వేడుక ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. 21 రోజుల పాటు…

2 hours ago

మీడియాలోకి సాయిరెడ్డి.. పక్షపాతం లేకుండా…!

అవును, నిజమే.. విజయ్ సాయి రెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. త్వరలో…

2 hours ago

చిరంజీవి చుట్టూ డబుల్ అయోమయం

మన శంకరవరప్రసాద్ గారు రిలీజై మూడు నెలలు దాటేసింది. ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమాల అప్డేట్స్ లేవు. అదిగో ఇదిగో…

3 hours ago

శేష్ కెపాసిటీ ఏంటో అర్థమయ్యిందిగా

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో అడివి శేష్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిర్మాతలు రెడీగా ఉన్నా వేగంగా సినిమాలు చేసేందుకు పరుగులు…

4 hours ago

పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వానికి ఉచితాలు ఎందుకు

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద…

4 hours ago