Trends

ఇంటినుండే ఓటు

రాబోయే ఎన్నికల్లో ఇంటినుండే ఓట్లు, పనిచేసే ప్రాంతంనుండే వేసే ప్రయోగానికి తెలంగాణా వేదిక కాబోతోందా ? అవుననే అంటున్నాయి అధికారవర్గాలు. ఇప్పటికే ఇలాంటి ఓటింగ్ ప్రక్రియను ప్రయోగాత్మకంగా ఖమ్మం జిల్లాలో ఎన్నికల కమీషన్, ఐటి తదితర శాఖల అధికారులు అమలుచేశారు. వాళ్ళ ప్రయోగం సక్సెస్ అయినట్లు తెలిసింది. ఇంటినుండి ఓట్లు వేసే అవకాశం అన్నది తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు వచ్చిన ఆలోచన. తమ ఆలోచనకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి మొబైల్ సాంకేతికతతో ఒక ప్రత్యేకమైన యాప్ ను తయారుచేశారు.

ట్రయల్ రన్ గా ఖమ్మం జిల్లాలో డమ్మీ ఓటింగ్ ను ప్రయోగాత్మకంగా నిర్వహించారు. వివి ప్రయోగాల తర్వాత డమ్మీ పోలింగ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. డమ్మీ పోలింగ్ సందర్భంగా ఎదురైన సమస్యలను కూడా అధికారులు అధిగమించారు. తర్వాతే యాప్ కు ప్రత్యేక రూపునిచ్చారు. దివ్యాంగులు, ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది, వృద్ధులు, ఐటి ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, క్యూలైన్లలో ఉండి ఓటింగ్ చేయటాన్ని ఇష్టపడని అనేక వర్గాల వాళ్ళు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

యాప్ ద్వారా ఓటు వేయాలని అనుకున్న ఎవరైనా సరే ఈ ప్రత్యేక యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి రెండు దశలున్నాయి. మొదటి దశలో ఓటర్లు తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి ఓటర్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ను ఫీడ్ చేయాలి.

పై వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫొటో దిగాల్సుంటుంది. లైవ్ ఫొటోను యాప్ నిర్ధారిస్తేనే యాప్ ద్వారా ఓటింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. వివరాలను నమోదు చేసుకున్న తర్వాత మరొకళ్ళు ఓటు వేయటానికి వీలులేని విదంగా ఆర్టిఫీషియర్ ఇంటెలిజెన్స్ తో యాప్ ను తయారుచేశారు. ఒకసారి యాప్ ద్వారా ఓటింగ్ చేసుకోవాలని అనుకుంటే తర్వాత ఓటింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేసే అవకాశం ఉండదు. ఎన్ని ప్రయోగాలు చేసినా, డమ్మీ ఓటింగ్ నిర్వహించినా వాస్తవంగా ఎన్నికల్లో ఓట్లేసేటపుడు కూడా సడెన్ గా ఏదో సమస్యలు బయటపడే అవకాశాలున్నాయి. మరపుడు ఎన్నికల కమీషన్ ఏమిచేస్తుందో చూడాలి. ఏదేమైనా యాప్ ద్వారా ఓటింగ్ చేసే పద్దతి అమల్లోకి వస్తే మంచిదే కదా.

This post was last modified on September 12, 2023 1:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

16 minutes ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

5 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

5 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

5 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

6 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

8 hours ago