భారతదేశంలో చెస్ పేరు చెప్పగానే వినిపించే పేరు విశ్వనాథన్ ఆనంద్. చెస్ లో భారత్ పేరు మార్మోగిపోయేలా చేసిన ఘనత ఈ గ్రాండ్ మాస్టర్ కే దక్కుతుంది. అందుకే 37 సంవత్సరాలుగా భారతదేశం తరఫున చెస్ లో విషి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, తాజాగా ప్రపంచ చెస్ పోటీలలో తమ సత్తా చాటుతూ ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్న యువ ఆటగాళ్లు విశ్వనాథ్ ఆనంద్ కు సవాల్ విసురుతున్నారు. ఇటీవలే చెన్నైకు చెందిన 18 ఏళ్ల ప్రజ్ఞానందా చెస్ ప్రపంచ కప్ లో రజత పథకం సాధించి చరిత్ర సృష్టించాడు.
ఇక తాజాగా చెన్నైకు చెందిన మరో ఆటగాడు 17 ఏళ్ల డి గుకేష్ మరో రికార్డు బద్దలు కొట్టాడు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా భారతదేశం తరఫున చెస్ లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న విశ్వనాథన్ ఆనంద్ ను గుకేష్ వెనక్కునెట్టాడు. తాజాగా విడుదల చేసిన ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ లో గుకేష్ 2758 పాయింట్లతో ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. ఇక, ఆనంద్ 2754 పాయింట్లు తొమ్మిదో ర్యాంకు పడిపోయాడు. దీంతో మన దేశం తరఫున అగ్రస్థానంలో గుకేష్ కొనసాగుతున్నాడు.
5 సార్లు చెస్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఆనంద్ 1986 జూలై 1 నుంచి భారత నెంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ రికార్డును తాజాగా గుకేష్ బద్దలు కొట్టాడు. ఇటీవలి కాలంలో యువ ఆటగాళ్లు చెస్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. భారత నుంచి 80 మంది చెస్ గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. త్వరలోనే ఈ సంఖ్య 100కు చేరుతుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…