భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధృవం పై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ఓవరాల్ గా చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్రపుటలలో నిలిచింది. చంద్రయాన్-3 సక్సెస్ ఇచ్చిన కిక్కుతో తాజాగా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఈ క్రమంలోనే ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్ వన్ సోలార్ మిషన్ లాంచింగ్ కార్యక్రమం విజయవంతమైంది.
ఉదయం 11.50 నిమిషాలకు పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా భూమి దిగువ కక్షలో ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ ను ప్రవేశపెట్టారు. నాలుగు నెలలపాటు ఈ శాటిలైట్ ప్రయాణించి భూమికి, సూర్యుడికి మధ్య ఉండే లాంగ్రెజ్ పాయింట్ కు చేరనుంది. దాదాపు ఐదేళ్లపాటు సూర్యుడిపై ఈ శాటిలైట్ అధ్యయనం చేయనుంది. సౌర తుఫానులు, సూర్యుడి మాగ్నెటిక్ ఫీల్డ్, మాస్ ఎజెక్షన్ వంటి అంశాలపై పరిశోధనలు చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి ప్రతిరోజు భూమికి సమాచారాన్ని ఆదిత్య చేరవేయనుంది.
ఈ నేపథ్యంలోనే ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం కావడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. విశ్వాన్ని అన్వేషించడానికి అవిశ్రాంత ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని మోడీ అన్నారు. మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి ప్రయోగాలు ఉపకరిస్తాయని చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలకు కాంగ్రెస్ కూడా తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది.
This post was last modified on September 2, 2023 5:48 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…