Trends

ఆదిత్య ఎల్ 1 లాంచింగ్ సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధృవం పై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ఓవరాల్ గా చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్రపుటలలో నిలిచింది. చంద్రయాన్-3 సక్సెస్ ఇచ్చిన కిక్కుతో తాజాగా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఈ క్రమంలోనే ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్ వన్ సోలార్ మిషన్ లాంచింగ్ కార్యక్రమం విజయవంతమైంది.

ఉదయం 11.50 నిమిషాలకు పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా భూమి దిగువ కక్షలో ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ ను ప్రవేశపెట్టారు. నాలుగు నెలలపాటు ఈ శాటిలైట్ ప్రయాణించి భూమికి, సూర్యుడికి మధ్య ఉండే లాంగ్రెజ్ పాయింట్ కు చేరనుంది. దాదాపు ఐదేళ్లపాటు సూర్యుడిపై ఈ శాటిలైట్ అధ్యయనం చేయనుంది. సౌర తుఫానులు, సూర్యుడి మాగ్నెటిక్ ఫీల్డ్, మాస్ ఎజెక్షన్ వంటి అంశాలపై పరిశోధనలు చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి ప్రతిరోజు భూమికి సమాచారాన్ని ఆదిత్య చేరవేయనుంది.

ఈ నేపథ్యంలోనే ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం కావడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. విశ్వాన్ని అన్వేషించడానికి అవిశ్రాంత ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని మోడీ అన్నారు. మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి ప్రయోగాలు ఉపకరిస్తాయని చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలకు కాంగ్రెస్ కూడా తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది.

This post was last modified on September 2, 2023 5:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

30 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

59 minutes ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago