Trends

విండీస్ తో వన్డే సిరీస్ కైవసం…పాండ్యా అసంతృప్తి

వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఆఖరి వన్డేలో టీమిండియా 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ లో టీమిండియా సత్తా చాటి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆఖరి వన్డేలో దుమ్మురేపిన భారత బ్యాట్స్ మన్లు 352 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచారు. గిల్ 85 పరుగులు, ఇషాన్ కిషన్ 77 పరులుగు, పాండ్యా 70 పరుగులు, సంజూ శాంసన్ అర్థ సెంచరీతో రాణించారు. భారీ లక్ష చేదనలో కరీబియన్ బ్యాట్స్ మన్లు తడబడడంతో ఆ జట్టు 151 పరుగులకే కుప్పకూలింది.

మూడో వన్డేలో గెలుపుతో టీమిండియా పలు రికార్డులు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో 200 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ పై భారత్ కు ఇది రెండో అతిపెద్ద విజయం. ఇక, కరీబియన్ జట్టుపై భారత్ కు ఇది వరుసగా 13వ సిరీస్ విజయం కావడం విశేషం. 2007-23 మధ్య ఈ ఘనతను భారత్ సాధించింది. మరోవైపు, 143 పరుగుల తొలి వికెట్ రికార్డు భాగస్వామ్యాన్ని ఇషాన్ కిషన్- గిల్ నెలకొల్పారు. విండీస్ పై భారత్ కు ఇదే అత్యుత్తమ తొలి వికెట్ భాగస్వామ్యం. రేపటి నుంచి విండీస్ తో 5 టీ 20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది.

కాగా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తీరుపై టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన విమర్శలు గుప్పించారు. తమకు కనీస వసతులు కల్పించడంలో విండీస్ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ విఫలమైందని షాకింగ్ ఆరోపణలు చేశాడు. అయితే, తమకు లగ్జరీ స్థాయిలో సౌకర్యాలు అందించాలని అడగడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ టూర్ లో మిగిలిన రోజులకైనా తమకు కనీస వసతులు, సౌకర్యాలు కల్పించాలని కోరాడు. ముఖ్యంగా ప్రయాణాలు, రవాణా, వాహనాల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి అని అసంతృప్తిని వెళ్లగక్కాడు. మరి, పాండ్యా కామెంట్లపై విండీస్ బోర్డు స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on August 2, 2023 5:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago