Trends

ఎత్తైన భ‌వ‌నాలు ఎక్క‌డం అలవాటు.. చివ‌ర‌కు అదే ప్రాణం తీసింది

రెమీ లుసిడి.. 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్ వ్య‌క్తికి అత్యంత ఎత్తైన భ‌వ‌నాలు ఎక్క‌డం అల‌వాటు. ప్ర‌మాదాల‌తో చెల‌గాటం చేస్తూ.. సాహ‌సాలకు పాల్ప‌డుతూ.. ఆ ఫొటోలు, వీడియోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేస్తుంటాడు. డేర్ డేవిల్ స్కై స్క్రేప‌ర్‌గా పేరొందిన రెమీ.. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో ఆకాశ హ‌ర్మ్యాల‌ను అధిరోహించాడు. కానీ చివ‌ర‌కు ఓ ఎత్తైన భ‌వ‌నం మీద నుంచి ప‌డే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘ‌ట‌న హాంకాంగ్‌లో సోమ‌వారం జ‌రిగింది. అక్క‌డి ది ట్రెగంటెర్ ట‌వ‌ర్ కాంప్లెక్స్‌ను అధిరోహించాల‌ని ప్ర‌య‌త్నించి లుసిడి మ‌ర‌ణించాడు. హాంకాంగ్ అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఉద‌యం 6 గంట‌ల‌కు లుసిడి ఆ భ‌వ‌నం వ‌ద్ద‌కు చేరుకున్నాడు. 40వ అంత‌స్తులో తన స్నేహితుడు ఉంటాడ‌ని సెక్యూరిటీకి చెప్పి లోప‌లికి వెళ్లిపోయాడు. కానీ లుసిడి ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని ఆ అంత‌స్తులో ఉండే వ్య‌క్తి భ‌ద్ర‌త సిబ్బందికి చెప్పేలోపే లుసిడి ఎలివేట‌ర్‌లో పైకి వెళ్లాడు. ఆ త‌ర్వాత 49వ ఫ్లోర్ నుంచి మెట్ల మార్గంలో లుసిడి పైకి వెళ్లిన‌ట్లు తెలిసింది. కానీ అత‌ను భ‌వ‌నం మీద‌కు చేరుకోలేద‌ని అక్క‌డివాళ్లు అంటున్నారు.

లుసిడి అదుపుత‌ప్పి కింద ప‌డిపోయాడు. అయితే మ‌ధ్య‌లో 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్ కిటికీకి బ‌య‌ట చిక్కుకుపోయాడు. సాయం కోసం ఆ కిటికీని బ‌లంగా త‌న్నాడు. ఆ స‌మ‌యంలో అత‌ణ్ని.. ఆ పెంట్‌హౌస్ ప‌నిమ‌నిషి కిటికీ బ‌య‌ట చూసింది. కానీ అక్క‌డి నుంచి ప‌ట్టు త‌ప్ప‌డంతో లుసిడి నేరుగా కింద‌ప‌డిపోయాడు. అంత ఎత్తు నుంచి ప‌డ‌డంతో సంఘ‌ట‌న స్థలంలోనే ప్రాణాలు వ‌దిలాడు. అక్క‌డి అధికారులు లుసిడి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. ఎత్తైన భ‌వ‌నాలు ఎక్కుతూ సాహ‌హాల‌కు పాల్ప‌డే లుసిడి.. చివ‌ర‌కు అలాంటి ప్ర‌య‌త్నంలోనే ప్రాణాలు వ‌దిలాడు.

This post was last modified on July 31, 2023 6:29 pm

Share
Show comments
Published by
Satya
Tags: remi lucidi

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago