అప్పులు చేసి మరీ వ్యవసాయం చేస్తున్న రైతన్నలకు ఏమీ మిగలక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు తినేందుకు తిండి లేక కడుపు మాడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పెరిగిన టమాట ధర పుణ్యమా అని రైతులు కోటీశ్వరులు అవుతున్నారు. కొంతమంది అన్నదాతలకు టమాటలు అధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి.
ఏపీలోని చిత్తూరు జిల్లా కరకమండ్ల గ్రామానికి చెందిన మురళి.. టమాటాల ద్వారా 45 రోజుల్లోనే రూ.4 కోట్లు సంపాదించడం విశేషం. మురళి దంపతులు గ్రామంలోని 22 ఎకరాల భూమిలో టమాట సాగు చేశారు. సరిగ్గా ధర పెరిగే నాటికి వీళ్ల పంట చేతికి వచ్చింది. ఇంకేముంది ఏపీలోని మదనపల్లె టమాట మార్కెట్తో పాటు పక్కనే ఉన్న కర్ణాటకలోనూ కలిపి 40 వేల టమాట బాక్సులను విక్రయించారు. దీంతో రూ.4 కోట్ల ఆదాయం వచ్చింది. వచ్చిన డబ్బుతో రూ.1.5 కోట్ల అప్పులు తీర్చారు.
తెలంగాణలోని మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్కు చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డి అనే రైతుది కూడా ఇలాంటి కథే. నెల రోజులుగా టమాటాలు అమ్మి ఆయన రూ.2 కోట్లు సంపాదించారు. అంతే కాకుండా మరో రూ.కోటి రూపాయాల విలువైన పంట కోతకు సిద్ధంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లోనే హోల్సేల్ ధర కిలో రూ.100కు అమ్మి మహేందర్ రెడ్డి కోటీశ్వరుడయ్యారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతన్నలు ఇప్పుడు ఇలా రూ.కోట్లు సంపాదించడం చూస్తే ఎంతో ఆనందంగా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. పెరిగిన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నప్పటికీ రైతుకు మాత్రం మేలు చేస్తున్నాయి.
This post was last modified on July 31, 2023 3:56 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…