Trends

ట‌మాటాల‌తో ఏపీ రైతుకు రూ.4 కోట్లు.. తెలంగాణలో రూ.2 కోట్లు

అప్పులు చేసి మ‌రీ వ్య‌వ‌సాయం చేస్తున్న రైత‌న్న‌ల‌కు ఏమీ మిగ‌ల‌క ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న సంఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. దేశానికి అన్నం పెట్టే అన్న‌దాత‌లు తినేందుకు తిండి లేక క‌డుపు మాడ్చుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పెరిగిన ట‌మాట ధ‌ర పుణ్య‌మా అని రైతులు కోటీశ్వ‌రులు అవుతున్నారు. కొంత‌మంది అన్న‌దాత‌ల‌కు ట‌మాట‌లు అధిక లాభాల‌ను తెచ్చిపెడుతున్నాయి.

ఏపీలోని చిత్తూరు జిల్లా క‌ర‌క‌మండ్ల గ్రామానికి చెందిన ముర‌ళి.. ట‌మాటాల ద్వారా 45 రోజుల్లోనే రూ.4 కోట్లు సంపాదించ‌డం విశేషం. ముర‌ళి దంపతులు గ్రామంలోని 22 ఎక‌రాల భూమిలో ట‌మాట సాగు చేశారు. స‌రిగ్గా ధ‌ర పెరిగే నాటికి వీళ్ల పంట చేతికి వ‌చ్చింది. ఇంకేముంది ఏపీలోని మ‌ద‌న‌ప‌ల్లె ట‌మాట మార్కెట్‌తో పాటు ప‌క్క‌నే ఉన్న క‌ర్ణాట‌క‌లోనూ క‌లిపి 40 వేల ట‌మాట బాక్సుల‌ను విక్ర‌యించారు. దీంతో రూ.4 కోట్ల ఆదాయం వ‌చ్చింది. వ‌చ్చిన డ‌బ్బుతో రూ.1.5 కోట్ల అప్పులు తీర్చారు.

తెలంగాణ‌లోని మెద‌క్ జిల్లా కౌడిప‌ల్లి మండ‌లం మ‌హ్మ‌ద్ న‌గ‌ర్‌కు చెందిన బాన్సువాడ మ‌హిపాల్ రెడ్డి అనే రైతుది కూడా ఇలాంటి క‌థే. నెల రోజులుగా ట‌మాటాలు అమ్మి ఆయ‌న రూ.2 కోట్లు సంపాదించారు. అంతే కాకుండా మ‌రో రూ.కోటి రూపాయాల విలువైన పంట కోత‌కు సిద్ధంగా ఉంది. హైద‌రాబాద్ మార్కెట్లోనే హోల్‌సేల్ ధ‌ర కిలో రూ.100కు అమ్మి మ‌హేంద‌ర్ రెడ్డి కోటీశ్వ‌రుడ‌య్యారు. వ్య‌వ‌సాయాన్నే న‌మ్ముకున్న రైత‌న్న‌లు ఇప్పుడు ఇలా రూ.కోట్లు సంపాదించ‌డం చూస్తే ఎంతో ఆనందంగా ఉంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. పెరిగిన ధ‌ర‌లు సామాన్యుల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ప్ప‌టికీ రైతుకు మాత్రం మేలు చేస్తున్నాయి.

This post was last modified on July 31, 2023 3:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

1 hour ago

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…

1 hour ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

2 hours ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

3 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

5 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

7 hours ago