ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలను దాటేసింది. మరణాల సంఖ్య 718కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలలోని పలువురు శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు.
ఓ వైపు కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తుండగా…మరో వైపు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కనీసం మరో 6 నెలలు పట్టనున్న నేపథ్యంలో కరోనా కేసుల నిర్ధారణ కీలకంగా మారింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ర్యాపిడ్ టెస్టు కిట్లు, ట్రూనాట్ మిషన్ల ద్వారా కరోనా సోకిందో లేదో నిర్ధారిస్తున్నారు.
అయితే, ఈ నిర్ధారణ కోసం సమయం ఎక్కువగా పడుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం మన దేశంతో పాటు పలు దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేవలం 5 సెకన్లలోనే కరోనా వ్యాధి సోకిందో లేదో నిర్ధారించే సాఫ్ట్ వేర్ ను మన దేశానికి చెందిన ప్రొఫెసర్ రూపొందించారు. కరోనా అనుమానిత వ్యక్తి ఎక్స్-రే ఉపయోగించి ఐదు సెకన్లలోను వైరస్ ఉనికిని గుర్తించవచ్చని ఐఐటి-రూర్కీ ప్రొఫెసర్ కమల్ జైన్ చెప్పారు.
తాను రూపొందించిన సాఫ్ట్వేర్ సాయంతో ఒక వ్యక్తి ఎక్స్రే ద్వారా రోగికి న్యుమోనియా, ఫ్లూ లక్షణాలున్నాయా లేదా అని వర్గీకరించవచ్చని కమల్ జైన్ తెలిపారు. అంతేకాకుండా, ఆ న్యుమోనియా కరోనాకు సంబంధించిందా లేక ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చని కమల్ జైన్ చెప్పారు. కరోనా, న్యుమోనియా, క్షయ రోగులతో సహా 60 వేల మంది రోగుల ఎక్స్-రే స్కాన్లను తాను విశ్లేషించానని కమల్ జైన్ తెలిపారు.
వాటి ఆధారంగా తాను ఒక ఒక కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ )-ఆధారిత డేటాబేస్ అభివృద్ధి చేశానని వెల్లడించారు. దాంతోపాటు అమెరికాకు చెందిన ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్ చెస్ట్ ఎక్స్-రే డేటాబేస్ ను కూడా తాను విశ్లేషించానని చెప్పారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్ష ఖర్చు తగ్గుతుందని, అంతేకాకుండా…కరోనా నిర్ధారణ టెస్టుల చేస్తున్న వైద్య సిబ్బందికి కరోనా సోకే ముప్పు తగ్గుతుందని అన్నారు.
సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడానికి 40 రోజులు పట్టిందని కమల్ జైన్ వెల్లడించారు. ఈ సాఫ్ట్ వేర్ పేటెంట్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కు దరఖాస్తు చేసినట్టు తెలిపారు. ఇదే తరహాలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అమెజాన కూడా ఎక్స్ రే ఆధారంగా కరోనా నిర్ధారణపై పరిశోధనలు చేసింది.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…