ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు ఒకట్రెండు ఓకే అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొందరు హీరోయిన్లకు కూడా తొలి సినిమా రిలీజ్ కాకముందే.. ఆ సినిమా ప్రోమోలతో వచ్చిన గుర్తింపు వల్ల అవకాశాలు రావడం కొందరి విషయంలో జరిగింది.
కానీ ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేని కుర్రాడు నటిస్తున్న తొలి చిత్రం విడుదల కాకముందే మూణ్నాలుగు సినిమాల్లో ఛాన్సులు రావడం.. వాటికి సంబంధించి అగ్రిమెంట్లు జరిగిపోవడం అంటే సంచలనంగానే భావించాలి. తమిళంలో భారత్ అనే కుర్రాడు ఇప్పుడు ఇలాగే హాట్ టాపిక్గా మారాడు. అతను అప్పుడే ఐదు సినిమాల దాకా కమిటైపోయాడట. ఇదిప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
యూట్యూబ్లో ‘ఫైనల్లీ’ అనే ఛానెల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించాడు భారత్. ఈ పాపులారిటీతోనే అతను ‘మిస్టర్ భారత్’ అనే సినిమాలో అవకాశం అందుకున్నాడు. తన పేరుతోనే ఈ సినిమా టైటిల్ పెట్టేయడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావస్తోంది. ఇంతలోనే అతడికి ఇంకో మూణ్నాలుగు సినిమాల్లో అవకాశం దక్కింది. ‘కుటుంబస్థాన్’ మూవీతో తమిళంలో హిట్టు కొట్టిన తెలుగమ్మాయి శాన్వి మేఘనతో ఓ సినిమా.. అలాగే ‘నింజా’ పేరుతో మరో చిత్రం.. ప్రాథన అనే మరో అమ్మాయికి జోడీగా మరో సినిమా ఓకే చేశాడు.
తొలి సినిమా విడుదల కాకముందే అతడికి ఎంత క్రేజ్ వచ్చిందంటే.. ఇటీవల కీర్తి సురేష్ తన కొత్త చిత్రం ‘రివాల్వర్ రీటా’ రిలీజ్ సందర్భంగా అతడితో ఒక ప్రమోషనల్ వీడియో కూడా చేసింది. కేవలం యూట్యూబ్ ఛానెల్తో ఇంత పేరు సంపాదించి.. వరుసగా సినిమా ఛాన్సులు అందుకోవడం, ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే చిన్న స్థాయి స్టార్ అయిపోవడం అరుదైన విషయం.
This post was last modified on December 3, 2025 9:33 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…