ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు ఒకట్రెండు ఓకే అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొందరు హీరోయిన్లకు కూడా తొలి సినిమా రిలీజ్ కాకముందే.. ఆ సినిమా ప్రోమోలతో వచ్చిన గుర్తింపు వల్ల అవకాశాలు రావడం కొందరి విషయంలో జరిగింది.
కానీ ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేని కుర్రాడు నటిస్తున్న తొలి చిత్రం విడుదల కాకముందే మూణ్నాలుగు సినిమాల్లో ఛాన్సులు రావడం.. వాటికి సంబంధించి అగ్రిమెంట్లు జరిగిపోవడం అంటే సంచలనంగానే భావించాలి. తమిళంలో భారత్ అనే కుర్రాడు ఇప్పుడు ఇలాగే హాట్ టాపిక్గా మారాడు. అతను అప్పుడే ఐదు సినిమాల దాకా కమిటైపోయాడట. ఇదిప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
యూట్యూబ్లో ‘ఫైనల్లీ’ అనే ఛానెల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించాడు భారత్. ఈ పాపులారిటీతోనే అతను ‘మిస్టర్ భారత్’ అనే సినిమాలో అవకాశం అందుకున్నాడు. తన పేరుతోనే ఈ సినిమా టైటిల్ పెట్టేయడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావస్తోంది. ఇంతలోనే అతడికి ఇంకో మూణ్నాలుగు సినిమాల్లో అవకాశం దక్కింది. ‘కుటుంబస్థాన్’ మూవీతో తమిళంలో హిట్టు కొట్టిన తెలుగమ్మాయి శాన్వి మేఘనతో ఓ సినిమా.. అలాగే ‘నింజా’ పేరుతో మరో చిత్రం.. ప్రాథన అనే మరో అమ్మాయికి జోడీగా మరో సినిమా ఓకే చేశాడు.
తొలి సినిమా విడుదల కాకముందే అతడికి ఎంత క్రేజ్ వచ్చిందంటే.. ఇటీవల కీర్తి సురేష్ తన కొత్త చిత్రం ‘రివాల్వర్ రీటా’ రిలీజ్ సందర్భంగా అతడితో ఒక ప్రమోషనల్ వీడియో కూడా చేసింది. కేవలం యూట్యూబ్ ఛానెల్తో ఇంత పేరు సంపాదించి.. వరుసగా సినిమా ఛాన్సులు అందుకోవడం, ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే చిన్న స్థాయి స్టార్ అయిపోవడం అరుదైన విషయం.
This post was last modified on December 3, 2025 9:33 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…