ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఇద్దరు దివ్యాంగులతో సమయాన్ని గడిపారు.
గోగన ఆదిశేషు, శెట్టివారి రఘులతో ముచ్చటించారు. మార్కాపురానికి చెందిన రఘు, బాపట్లకు చెందిన ఆదిశేషుల జీవనం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్న దివ్యాంగుల జీవితాలు ఎందరికో స్ఫూర్తిగా ఉన్నాయన్నారు.
వారిద్దరికీ జ్ఞాపికలు అందించారు. వారిద్దరూ మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచడం మూలంగా తమ జీవనానికి ఒక వెసులుబాటు దొరికింది’ అని చెబుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియచేశారు. అనంతరం దివ్యాంగుల దినోత్సవ కేక్ ను కట్ చేశారు.
This post was last modified on December 3, 2025 10:39 pm
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…