Political News

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఇద్దరు దివ్యాంగులతో సమయాన్ని గడిపారు.

గోగన ఆదిశేషు, శెట్టివారి రఘులతో ముచ్చటించారు. మార్కాపురానికి చెందిన రఘు, బాపట్లకు చెందిన ఆదిశేషుల జీవనం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్న దివ్యాంగుల జీవితాలు ఎందరికో స్ఫూర్తిగా ఉన్నాయన్నారు.

వారిద్దరికీ జ్ఞాపికలు అందించారు. వారిద్దరూ మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచడం మూలంగా తమ జీవనానికి ఒక వెసులుబాటు దొరికింది’ అని చెబుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియచేశారు. అనంతరం దివ్యాంగుల దినోత్సవ కేక్ ను కట్ చేశారు.

This post was last modified on December 3, 2025 10:39 pm

Share

Recent Posts

ధనుష్‌ది పెద్ద ప్లానింగే…

మొన్న భారీ ఎత్తున అభిమానులను ఒక చోటికి చేర్చి ఒక మెగా బ్లడ్ క్యాంప్ పెట్టాడు తమిళ కథానాయకుడు ధనుష్.…

35 minutes ago

రంగ‌నాథ్ ఎఫెక్ట్‌: రేవంత్‌కు భారీ సంక‌టం!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి భారీ సంక‌టం ఏర్ప‌డింది. 2023లో రాష్ట్ర సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే రేవంత్ మూసీ…

1 hour ago

పావలా శ్యామలను మరిచిపోనివ్వని ఆ రెండు సీన్లు

సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులకు ఎక్కువ, క్యారెక్టర్ నటులకు తక్కువ అనిపించేలా కొందరుంటారు. వాళ్లు చాలా సినిమాల్లో కనిపిస్తారు కానీ.. వారి పాత్రలకు తగిన…

1 hour ago

వాళ్ల‌ను వ‌దిలేయండి… విద్యార్థుల నిర్బంధంపై సుప్రీం ఆదేశం

ఢిల్లీలో చేపట్టిన నీట్ నిర‌స‌న‌ల‌కు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే అరెస్టు చేసిన వారిని…

2 hours ago

లోకేష్‌కు షాక్ అనుకున్నారు.. కానీ!

టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. సోమవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమయంలో ఆయనకు…

2 hours ago

రివ్యూల లాజిక్ మిస్సయిన గీత రచయిత

సినిమా అనేది పబ్లిక్ ప్లాట్ ఫార్మ్. ఒక్కసారి థియేటర్లో వచ్చాక దాని మీద అభిప్రాయం వెలిబుచ్చే హక్కు ప్రతి ఒక్కరికి…

3 hours ago