ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన “రైతన్నా మీకోసం” కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుమారు 30 ఏళ్ల క్రితం రాష్ట్రంలోనే అత్యధిక ఎయిడ్స్ కేసులు నమోదయ్యేవని తెలిపారు.
ఎయిడ్స్ మహమ్మారిపై అవగాహన పెంచడానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్న గత పాలనా కాలంలో తీసుకున్న విప్లవాత్మక చర్యలను చంద్రబాబు వివరించారు. ఆ కాలంలో తాను అసెంబ్లీలో కండోమ్లతో డెకరేషన్ చేయించి, సభ్యులకు, రాష్ట్ర ప్రజలలో దీని గురించి అవగాహన కల్పించామన్నారు. 2030 నాటికి రాష్ట్రాన్ని ఎయిడ్స్ కేసులు లేని రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించారు.
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విడుదల చేసిన లెక్కల ప్రకారం ఏపీలో హెచ్ఐవి పాజిటివిటీ రేటు 2015–16లో 2.34 శాతం నుంచి 2024–25లో 0.58 శాతానికి తగ్గింది. నిరంతర అవగాహన ప్రచారాలు, సురక్షిత లైంగిక పద్ధతుల ప్రచారం, ఉచిత చికిత్స సౌకర్యాలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
2010తో పోలిస్తే 2024–25 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ సంబంధిత మరణాలు 88.72 శాతం తగ్గాయి. గర్భిణీ స్త్రీలలో హెచ్ఐవీ పాజిటివిటీ రేటు 2015–16లో 0.10 శాతం నుంచి 2024–25లో 0.04 శాతానికి తగ్గింది. ఈ వివరాలను వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…
వారణాసి విడుదల ఇంకో ఏడాది టైం ఉందని, పదే పదే మహేష్ బాబు రీ రిలీజులను క్యూ కట్టడం ఎంత…
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…