కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రాజేశాయి. ఈ క్రమంలోనే అవి రైతులతో మాట్లాడుతున్న సందర్భంగా పవన్ క్యాజువల్ గా చేసిన వ్యాఖ్యలని, వాటిపై అనవసర రాద్ధాంతం అక్కర లేదని జనసేన ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
అయినా సరే కొందరు తెలంగాణ నేతలు మాత్రం పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని అంటున్నారు. ఇక, తాజాగా ఆ జాబితాకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తోడయ్యారు.
పవన్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాల్సిందేనని షర్మిల డిమాండ్ చేశారు. అంతేకాదు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టొద్దని, మూఢ నమ్మకాలతో ప్రజలను కించపరచడం సరికాదని షర్మిల హితవు పలికారు. ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి అని చెప్పడం సరికాదన్నారు. ఉప్పు నీటి వల్ల కొబ్బరి చెట్లు కూలాయని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉప్పునీటి ముప్పును తప్పించాలని కోరారు. మరి, షర్మిల వ్యాఖ్యలపై పవన్, జనసేనల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on December 3, 2025 10:07 pm
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే తమిళ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిపై కేసు నమోదైంది. ఎక్స్లో ఆమె చేసిన…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండని సక్సెస్ వరించడానికి టైం అయితే పట్టింది. బేబీ…
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ఇప్పటికే సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ…