మొత్తానికి ఏడాదికి పైగా సాగుతున్న చర్చకు తెరపడింది. మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైపోయాడు. తన భవిష్యత్ మీద జనాలు ఏవేవో ఊహాగానాల్లో ఉండగా.. చడీచప్పుడు లేకుండా స్వాంతంత్ర్య దినోత్సవాన రిటైర్మెంట్ కబురు చెప్పేశాడు.
దీంతో ధోనీని మళ్లీ టీమ్ ఇండియా బ్లూ జెర్సీలో చూస్తామని ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. అలాగే అతడి రిటైర్మెంట్ కోసం డిమాండ్లు చేస్తున్న వాళ్లు చల్లబడ్డారు. సచిన్ టెండుల్కర్ లాగే 40 ఏళ్ల వయసులో ధోని రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. ఇంతకీ ధోని భవిష్యత్తేంటి.. రాబోయే రోజుల్లో అతనేం చేయబోతున్నాడు అన్నది ఆసక్తికం.
ఈ ఏడాది వరకైతే అతను ఐపీఎల్ ఆడబోతున్నాడు. వచ్చే నెలలో యూఏఈ వేదికగా టోర్నీ ఆరంభం కాబోతోంది. వచ్చే ఏడాది యధావిధిగా వేసవిలో ఐపీఎల్ జరిగేట్లయితే.. అందులోనూ పాల్గొనే అవకాశముంది. కానీ అంతకుమించి అతను ఈ లీగ్లోనూ కొనసాగుతాడా అన్నది సందేహమే. 40 ఏళ్లు పైబడ్డాక ఏడాది పొడవునా క్రికెట్టే ఆడకుండా ఉండి.. ఐపీఎల్లో సత్తా చాటడం అంటే అంత సులువు కాదు.
కాబట్టి 2022లో ధోనీని ఐపీఎల్లో చూస్తామా అన్నది సందేహమే. మరి అప్పుడు ధోని ఏం చేస్తాడో చూడాలి. సచిన్ లాగే ధోని స్టేచర్ వేరు. అతను ద్రవిడ్లా కోచింగ్కు పరిమితం కాకపోవచ్చు. అలాగని గంగూలీ లాగా బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్లోకి రావడమూ సందేహమే. ధోనికి తన స్వరాష్ట్రంలో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా రాజకీయాల్లోకి రావచ్చని భావిస్తున్నారు. మొత్తం ఝార్ఖండ్ చరిత్రలోనే ధోని అంత పాపులారిటీ, ఇమేజ్ ఇంకెవరికీ లేదు.
రాజకీయ నాయకులు కూడా అతడి ముందు దిగదుడుపే. అతను సరైన ప్రణాళికలతో వస్తే ఝార్ఖండ్ ముఖ్యమంత్రి కాగల స్థాయి అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ధోనికి కూడా ఈ ఆసక్తి ఉండే ఉంటుందని.. ఏదైనా ప్రధాన పార్టీలో చేరడమో.. లేక సొంతంగా పార్టీ పెట్టడమో చేసి భవిష్యత్తులో ఝార్ఖండ్ పగ్గాలు చేపట్టడం ఖాయమని అతడి మద్దతుదారులంటున్నారు. చూద్దాం ఏమవుతుందో?
This post was last modified on August 16, 2020 4:42 pm
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…