మొత్తానికి ఏడాదికి పైగా సాగుతున్న చర్చకు తెరపడింది. మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైపోయాడు. తన భవిష్యత్ మీద జనాలు ఏవేవో ఊహాగానాల్లో ఉండగా.. చడీచప్పుడు లేకుండా స్వాంతంత్ర్య దినోత్సవాన రిటైర్మెంట్ కబురు చెప్పేశాడు.
దీంతో ధోనీని మళ్లీ టీమ్ ఇండియా బ్లూ జెర్సీలో చూస్తామని ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. అలాగే అతడి రిటైర్మెంట్ కోసం డిమాండ్లు చేస్తున్న వాళ్లు చల్లబడ్డారు. సచిన్ టెండుల్కర్ లాగే 40 ఏళ్ల వయసులో ధోని రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. ఇంతకీ ధోని భవిష్యత్తేంటి.. రాబోయే రోజుల్లో అతనేం చేయబోతున్నాడు అన్నది ఆసక్తికం.
ఈ ఏడాది వరకైతే అతను ఐపీఎల్ ఆడబోతున్నాడు. వచ్చే నెలలో యూఏఈ వేదికగా టోర్నీ ఆరంభం కాబోతోంది. వచ్చే ఏడాది యధావిధిగా వేసవిలో ఐపీఎల్ జరిగేట్లయితే.. అందులోనూ పాల్గొనే అవకాశముంది. కానీ అంతకుమించి అతను ఈ లీగ్లోనూ కొనసాగుతాడా అన్నది సందేహమే. 40 ఏళ్లు పైబడ్డాక ఏడాది పొడవునా క్రికెట్టే ఆడకుండా ఉండి.. ఐపీఎల్లో సత్తా చాటడం అంటే అంత సులువు కాదు.
కాబట్టి 2022లో ధోనీని ఐపీఎల్లో చూస్తామా అన్నది సందేహమే. మరి అప్పుడు ధోని ఏం చేస్తాడో చూడాలి. సచిన్ లాగే ధోని స్టేచర్ వేరు. అతను ద్రవిడ్లా కోచింగ్కు పరిమితం కాకపోవచ్చు. అలాగని గంగూలీ లాగా బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్లోకి రావడమూ సందేహమే. ధోనికి తన స్వరాష్ట్రంలో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా రాజకీయాల్లోకి రావచ్చని భావిస్తున్నారు. మొత్తం ఝార్ఖండ్ చరిత్రలోనే ధోని అంత పాపులారిటీ, ఇమేజ్ ఇంకెవరికీ లేదు.
రాజకీయ నాయకులు కూడా అతడి ముందు దిగదుడుపే. అతను సరైన ప్రణాళికలతో వస్తే ఝార్ఖండ్ ముఖ్యమంత్రి కాగల స్థాయి అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ధోనికి కూడా ఈ ఆసక్తి ఉండే ఉంటుందని.. ఏదైనా ప్రధాన పార్టీలో చేరడమో.. లేక సొంతంగా పార్టీ పెట్టడమో చేసి భవిష్యత్తులో ఝార్ఖండ్ పగ్గాలు చేపట్టడం ఖాయమని అతడి మద్దతుదారులంటున్నారు. చూద్దాం ఏమవుతుందో?
This post was last modified on August 16, 2020 4:42 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…