మహేంద్ర సింగ్ ధోనీ….అకా ఎంఎస్ డీ అలియాస్ మహీ…ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి మిస్టర్ కూల్ అనే పేరుంది. మైదానం లోపల మాత్రమే కాదు వెలుపల కూడా ధోనీ టెంపర్ కోల్పోయిన సందర్బాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. మైదానంలో తన మెరుపు వేగంతో స్టంప్స్ ను గిరాటు వేసే ధోనీ…మైదానం బయట మాత్రం మెరుపు వేగంతో దూసుకుపోయే బైక్ లంటే ప్రాణమిస్తాడు. బైక్ లంటే ఇష్టం కాబట్టి..5-6 బైకులు…2-3 కార్లు ఉన్నాయని అనుకుంటే పప్పులో..తప్పులో కాలేసినట్లే.
తాజాగా అదే తరహాలో మహీ బైక్, కార్ల కలెక్షన్ చూసిన మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ అవాక్కయ్యాడు. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ పేసర్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషీ ధోనీ గ్యారేజ్ ను సందర్శించారు. అక్కడున్న బైకులు, కార్లు చూసి షాకయ్యారు. ఆ గ్యారేజీలోవందల కొద్దీ బైకులు, పదుల సంఖ్యలో కార్లు ఉండడం చూసి నోరెళ్లబెట్టారు. ధోనీ బైక్, కార్లు కలెక్ట్ చేస్తాడని తెలుసని, కానీ, ఇన్ని ఉంటాయని అస్సలు అనుకోలేదని వారు ఆశ్చర్యపోయారు. పాత, కొత్తా అని తేడా లేకుండా మహీ భాయ్ రకరకాల మోడల్ బైక్లు, కార్లను కలెక్ట చేశాడని వెంకీ చెప్పాడు.
ఇక, కొన్ని ఇంపోర్డెట్ కార్లు, బైకులు కూడా ఉన్నాయని వెల్లడించాడు. మరికొన్ని అయితే, ఇండియన్ ఆర్మీ నుంచి కొన్నాడని తెలుస్తోంది. ఏదో బైకులు కొన్నాం..పక్కన పడేశాం అన్న రీతిలో కాకుండా…వాటికి తరచుగా సర్వీసింగ్ కూడా స్వయంగా ధోనీనే చేస్తాడట. దాదాపుగా ఓ పెద్ద బైకు, కారు షోరూం మాదిరలో ఉన్న ధోనీ గ్యారేజీ వీడియోను వెంకటేష్ ప్రసాద్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో, ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మహీ కలల బైక్ ల కలెక్షన్ చూసి ఖంగుతింటున్నారు.
This post was last modified on July 19, 2023 9:01 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…