మహేంద్ర సింగ్ ధోనీ….అకా ఎంఎస్ డీ అలియాస్ మహీ…ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి మిస్టర్ కూల్ అనే పేరుంది. మైదానం లోపల మాత్రమే కాదు వెలుపల కూడా ధోనీ టెంపర్ కోల్పోయిన సందర్బాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. మైదానంలో తన మెరుపు వేగంతో స్టంప్స్ ను గిరాటు వేసే ధోనీ…మైదానం బయట మాత్రం మెరుపు వేగంతో దూసుకుపోయే బైక్ లంటే ప్రాణమిస్తాడు. బైక్ లంటే ఇష్టం కాబట్టి..5-6 బైకులు…2-3 కార్లు ఉన్నాయని అనుకుంటే పప్పులో..తప్పులో కాలేసినట్లే.
తాజాగా అదే తరహాలో మహీ బైక్, కార్ల కలెక్షన్ చూసిన మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ అవాక్కయ్యాడు. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ పేసర్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషీ ధోనీ గ్యారేజ్ ను సందర్శించారు. అక్కడున్న బైకులు, కార్లు చూసి షాకయ్యారు. ఆ గ్యారేజీలోవందల కొద్దీ బైకులు, పదుల సంఖ్యలో కార్లు ఉండడం చూసి నోరెళ్లబెట్టారు. ధోనీ బైక్, కార్లు కలెక్ట్ చేస్తాడని తెలుసని, కానీ, ఇన్ని ఉంటాయని అస్సలు అనుకోలేదని వారు ఆశ్చర్యపోయారు. పాత, కొత్తా అని తేడా లేకుండా మహీ భాయ్ రకరకాల మోడల్ బైక్లు, కార్లను కలెక్ట చేశాడని వెంకీ చెప్పాడు.
ఇక, కొన్ని ఇంపోర్డెట్ కార్లు, బైకులు కూడా ఉన్నాయని వెల్లడించాడు. మరికొన్ని అయితే, ఇండియన్ ఆర్మీ నుంచి కొన్నాడని తెలుస్తోంది. ఏదో బైకులు కొన్నాం..పక్కన పడేశాం అన్న రీతిలో కాకుండా…వాటికి తరచుగా సర్వీసింగ్ కూడా స్వయంగా ధోనీనే చేస్తాడట. దాదాపుగా ఓ పెద్ద బైకు, కారు షోరూం మాదిరలో ఉన్న ధోనీ గ్యారేజీ వీడియోను వెంకటేష్ ప్రసాద్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో, ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మహీ కలల బైక్ ల కలెక్షన్ చూసి ఖంగుతింటున్నారు.
This post was last modified on July 19, 2023 9:01 am
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…
జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడానికి వైసీపీ నేతలు ఎంచుకునే అంశం.. ఆయన పెళ్లిళ్ల వ్యవహారం. కార్లను మార్చినట్లు భార్యలను…